spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Golden lizard : శేషాచలం అడవుల్లో అరుదైన ‘బంగారు’ జంతువు.. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్లు గుర్తించడంతో...

Golden lizard : శేషాచలం అడవుల్లో అరుదైన ‘బంగారు’ జంతువు.. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్లు గుర్తించడంతో వెలుగులోకి..

Golden lizard : శేషాచలం కొండలు ఎర్రచందనం చెట్లకు మాత్రమే కాదు.. విశిష్టమైన జంతుజాలానికి ప్రతీకలు. ఇక్కడ ఆదిమానవుల గుహలనుంచి మొదలుపెడితే నాటి రాజుల పరిపాలన కాలం నాటి కోటల వరకు కనిపిస్తాయి. పురాతత్వ శాస్త్రవేత్తలు ఇక్కడ నిత్యం పరిశోధనలు కొనసాగిస్తుంటారు. ముందుగానే చెప్పినట్టు ఇక్కడ అరుదైన జంతువులకు కొదవలేదు. పునుగు పిల్లి నుంచి మొదలు పెడితే నల్ల పులుల వరకు ఇక్కడ ప్రతి జంతువు ప్రత్యేకమే. అయితే ఇటీవల శేషాచలం కొండల్లో వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్లు ఫోటోలు తీస్తుండగా ఒక బంగారు బల్లి ప్రత్యక్షమైంది.. దీన్ని జంతు శాస్త్ర పరిభాషలో గోల్డెన్ గెకో అని పిలుస్తారు. ఇది సరిసృపాల జాతికి చెందింది. ఈ బల్లికి తక్కువ కాలంలో 40 నుంచి 150 వరకు గుడ్లు పెట్టగలిగే సామర్థ్యం ఉంటుంది. అంతేకాదు వంటిపై బంగారపు వర్ణాన్ని కలిగి ఉంటుంది. చీకట్లో అత్యంత ప్రకాశవంతంగా మెరుస్తూ ఉంటుంది. చిన్న చిన్న కీటకాలను మాత్రమే కాదు.. మొక్కల ఆకుల్ని కూడా తిని బతకడం ఈ బల్లి ప్రత్యేకత.

అంతరించే స్థాయికి చేరుకుంది

అయితే ఈ బల్లి ప్రస్తుతం అంతరించే స్థాయికి చేరుకుంది.. మారుతున్న వాతావరణ పరిస్థితులు, పెరిగిపోయిన కాలుష్యం, అడవులలో నివసించేందుకు అనువైన ప్రదేశాలు లేకపోవడంతో ఈ బల్లులు అంతరించే స్థాయికి చేరుకున్నాయి. గత ఏడాది ఈ బల్లులు పాపికొండల అభయారణ్యంలో కనిపించాయి. తిరుపతిలోని కళ్యాణి డ్యాం పరిసర ప్రాంతాల్లోనూ ఇవి దర్శనమిచ్చాయి. సమైక్య జీవనానికి ఈ బల్లులు ప్రతీకగా నిలుస్తాయి. గుడ్లను పెట్టి.. వాటిని పొదిగే ఇవి చాలా దూరం వెళ్తాయి. శత్రువుల నుంచి ముప్పు పొంచి ఉంటే.. వెంటనే పొదల్లోకి వెళ్తాయి..

ప్రకృతిలో జరిగే మార్పులను గుర్తిస్తాయి

బంగారు బల్లులు ప్రకృతి లో జరిగే మార్పులను వెంటనే గుర్తిస్తాయి. ఇవి పొదల్లోకి వెళితే కచ్చితంగా వర్షాలు కురుస్తాయట. అవి ఎక్కువ కాలం బయట ఉంటే కరువు కాటకాలు ఏర్పడతాయట. ఇది అప్పుడప్పుడు బొరియలు చేసుకొని అందులోకి వెళితే.. భూకంపాల వంటివి సంభవిస్తాయట. పూర్వకాలంలో ఈ బల్లుల గమనం ఆధారంగా వ్యవసాయం చేసే వారట. కాల క్రమంలో ఈ బల్లులు అంతరించిపోయే స్థితికి చేరుకున్నాయట. డైనోసార్లు, ఈ బల్లులు ఒకే జాతికి చెందినప్పటికీ.. ఇవి సూక్ష్మ రూపంలో ఉండడం వల్ల.. ఎక్కువ కాలం జీవించాయట. డైనోసార్ల కాలంలో కొన్ని బంగారు బల్లులు దాదాపు కుందేలు పరిమాణం వరకు పెరిగేవట. అప్పట్లో కొంతమంది ఆదిమ జాతులకు చెందిన వాళ్లు ఈ బల్లుల చర్మాన్ని ఔషధాల తయారీలో వినియోగించే వారట.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

Today 25 July 2026 Horoscope: ఈ నాలుగు రాశుల వారికి ఈరోజు నారాయణుడి ఆశీస్సులు.. పట్టిందల్లా బంగారమే..

Today 25 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశ రాశులపై జ్యేష్ఠ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా కొన్ని రాశుల వారికి అనుకోని ధన...

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...
Oktelugu Epaper
Exit mobile version