spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Gnaneshwari missing case update: జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో మరో కీలక పరిణామం.. జీపీఎస్ కట్టిన...

Gnaneshwari missing case update: జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో మరో కీలక పరిణామం.. జీపీఎస్ కట్టిన కుక్క మృతి.. కేసులో ఏం జరుగుతోంది..

Gnaneshwari missing case update: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారం రోజులుగా తీవ్ర ఉత్కంఠకు దారితీసిన జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు మరో మలుపుతీసుకుంది. తప్పిపోయిన పాప కేసులో పురోగతి సాధించాలని పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కేసు పోలీసులకు సవాల్ గా మారింది. ఈ నేపథ్యంలో ఈ కేసులో ఎంతో కీలకమైన కుక్క అనూహ్యంగా ట్విస్ట్ ఇచ్చింది.

జ్ఞానేశ్వరి తప్పిపోయినప్పుడు.. ఆమె వెంట పెంపుడు కుక్క కూడా వెళ్ళిపోయింది. ఈ నేపథ్యంలో ఆ కుక్క ద్వారా పాప ఆచూకీ కనిపెట్టాలని పోలీసులు ప్రయత్నాలు చేశారు. కుక్క మెడలో జిపిఎస్ ట్రాకర్ ఏర్పాటు చేశారు. సమీపంలో ఉన్న అటవీ ప్రాంతాల్లోకి పంపించారు. మనుషులు హడావిడి ఎక్కువగా ఉండడంతో ఆ కుక్క విపరీతంగా భయపడుతోంది. దీంతో ఆ కుక్కను బోనులో ఉంచారు. జ్ఞానేశ్వరి బయటికి వెళ్తున్నప్పుడు ఎవరూ చూడలేదు. పైగా ఆమె వెంట కుక్క మాత్రమే ఉంది. దీంతో పోలీసులు అత్యంత జాగ్రత్తగా దానిని చూసుకుంటున్నారు.

జ్ఞానేశ్వరి ఆచూకీ లభించకపోవడంతో ఆమె తల్లి గుండెలు పగిలే విధంగా రోదిస్తోంది. దీనికి తోడు ఆ కుక్కతో..”జానును తీసుకొస్తావా” అని అడిగింది. ఆ వీడియోలు ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తున్నాయి. అయితే ఆ కుక్క ఇప్పుడు ఎవరూ ఊహించని విధంగా చనిపోయింది. దీంతో పోలీసులకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. కుక్క కూడా గడిచిన రెండు రోజులుగా విచిత్రంగా ప్రవర్తిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ కేసును పోలీసులు అనేక కోణాలలో దర్యాప్తు చేస్తున్నారు.

ఈ కేసులో ఎంతో కీలకమైన కుక్కను కావాలని కొంతమంది చంపేశారా.. లేదా అడవిలో తిరగడం వల్ల అలసటకు గురై చనిపోయిందా.. అనే కోణాలలో దర్యాప్తు చేస్తున్నారు. వారం రోజులైనప్పటికీ జ్ఞానేశ్వరి ఆచూకీ ఇంతవరకు లభించలేదు. ఇది కుటుంబ సభ్యులను తీవ్రమైన కలవర పాటుకు గురి చేస్తోంది. పోలీసులు ఇప్పటికే చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతకడం మొదలుపెట్టారు. అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. జ్ఞానేశ్వరి బంధుమిత్రుల ఇంట్లో కూడా తనిఖీలు చేస్తున్నారు. చిన్నారి వారం క్రితం తప్పిపోవడం.. కేసులో కీలకమైన కుక్క చనిపోవడం.. అది కూడా అనుమానాస్పదంగా కన్నుమూయడంతో.. ఈ కేసును మరింత జటిలం చేస్తున్నాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Kallanai Dam: దేశంలో అతి పురాతనమైన డ్యామ్ ఎక్కడుందో తెలుసా.. దీనిని ఎలా నిర్మించారంటే..

Kallanai Dam: భారతదేశం వ్యవసాయ పంటలపై ఎక్కువగా ఆధారపడినందున.. ఇక్కడ నీటి నిల్వ చేయడం చాలా అవసరం. అలాగే ఈ నీటిని ఇతర ప్రాంతాలకు తరలించడానికి నీటి ప్రాజెక్టుల అవసరాన్ని పురాతన కాలంలోనే...

Godavari Pulasa: *‘పులస’ ఎందుకు దొరకడం లేదు.. గోదావరిలోకి ఎందుకు రావడం లేదు?*

Godavari Pulasa: చేపలందు.. ఓ చేప వేరయ్యా.. అదే మన గోదారి పులస. 'పుస్తెలమ్మి అయినా పులస తినాల్సిందే'.. అనే నానుడి గోదావరి జిల్లాలో ఉందంటే ఆ చేప ప్రత్యేకత అంతలా ఉంటుందన్నమాట....

Adani Group Airlines: ఎయిర్ లైన్స్ వ్యాపారంలోకి అదానీ గ్రూప్ ఎంట్రీ..

Adani Group Airlines: దేశీయ విమానయాన రంగంలో సరికొత్త పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త గౌతం అదానీ నేతృత్వంలో ప్రధాని గ్రూప్ కొత్తగా విమానయాన సేవలోకి ప్రవేశించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ...

Srirastu Meaning: పెళ్లి పత్రికలో శ్రీరస్తు అని ఎందుకు రాస్తారు.. శ్రీ అనే అక్షరానికి ఎలాంటి ప్రాధాన్యత ఉంది..

Srirastu Meaning: సాధారణంగా లక్ష్మీదేవి పేరు రాసేటప్పుడు ముందు శ్రీ అని రాస్తారు. అలాగే వివాహ ఆహ్వాన పత్రికల్లో శ్రీరస్తు.. అని పేర్కొంటారు.. ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు కూడా శ్రీ అని...

Amazon Employee Quits Job: అమెజాన్ లో రూ.35 లక్షల వేతనం వదిలి.. మనశ్శాంతి కోసం ఈ టెకీ...

Amazon Employee Quits Job: ఆమెకు ఏడాదికి రూ. 30 లక్షల వేతనం.. ఆమె భర్తకు కూడా మంచి ఉద్యోగం.. ఇద్దరికీ కలిపి సుమారు రూ. 65 లక్షల వరకు ఆదాయం.. సాధారణంగా...
Oktelugu Epaper
Exit mobile version