spot_img
Homeఆంధ్రప్రదేశ్‌CM Chandrababu: చంద్రబాబు అంటే భయం.. బిజెపి నేతల మౌనం.. హై కమాండ్ ఆదేశాలేనా?

CM Chandrababu: చంద్రబాబు అంటే భయం.. బిజెపి నేతల మౌనం.. హై కమాండ్ ఆదేశాలేనా?

CM Chandrababu: బిజెపిలో ఫైర్ బ్రాండ్లు ఏమయ్యారు? మునుపటిలా మాట్లాడడం లేదు ఎందుకు? హై కమాండ్ కంట్రోల్ చేసిందా? పరిస్థితులు అలా మారాయా? పొలిటికల్ సర్కిల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు చాలామంది బిజెపి నేతలు హడావిడి చేసేవారు. సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి, జివిఎల్ వంటి వారు యాక్టివ్ గా ఉండేవారు. అయితే ఇందులో జీవీఎల్ కాస్త మాట్లాడుతున్నారు. మిగతా నేతలు మాత్రం కనిపించడం లేదు. అయితే ఎన్నికల తర్వాత పరిస్థితులే అందుకు కారణంగా తెలుస్తోంది. చాలా రకాల సమీకరణలు మారాయి. రాష్ట్రంలో టిడిపి తో బిజెపి జతకట్టింది. ఎన్నికల్లో కలిసి పోటీ చేశాయి. అంతవరకు బిజెపి టిడిపి పై కొంత పై చేయి సాధించింది. బిజెపితో కలవడం చంద్రబాబుకు అవసరం. కానీ చంద్రబాబుతో కలవడం బీజేపీకి అవసరం లేదు. కానీ ఎన్నికల తర్వాత సీన్ మారింది. ఏపీలో టీడీపీ ఒంటరిగానే 136 సీట్లను గెలుచుకుంది. ఒంటరిగానే బంపర్ మెజారిటీ సాధించింది.బిజెపి గెలుచుకున్న 8 అసెంబ్లీ స్థానాలు టిడిపికి అవసరం లేదు.కానీ అదే సమయంలోటిడిపి సాధించిన 16 పార్లమెంట్ స్థానాలు మాత్రం కేంద్రంలోని బిజెపికి అవసరం.ఈ అవసరాల లెక్క మారిన తరువాతే బిజెపి నేతల్లో ఒక రకమైన చేంజ్ కనిపించింది.చంద్రబాబును పొగడడం కంటే వ్యతిరేకించడానికి వీలులేని పరిస్థితి ఏర్పడింది. అటు కేంద్ర పెద్దలు సైతం చంద్రబాబు విషయంలో కాస్త వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది. గౌరవభావం పెరిగినట్లు కూడా తెలుస్తోంది.

* మూడు పార్టీల కలయికతో..
రాష్ట్రంలో మూడు పార్టీలు కలిసి అధికారంలోకి వచ్చాయి.ప్రభుత్వాన్ని నడుపుతున్నాయి. మరో 10 సంవత్సరాలు పాటు ఉమ్మడిగానే ముందుకు సాగాలని నిర్ణయం తీసుకున్నాయి. నామినేటెడ్ పదవులు సైతం మూడు పార్టీలు పంచుకోనున్నాయి. అయితే సింహభాగం పదవులు మాత్రం టిడిపికి వెళ్ళనున్నాయి. అటు తరువాత జనసేనకు ఎక్కువ పదవులు కేటాయించనున్నారు. బిజెపి మాత్రం ఆ రెండు పార్టీలు ఇచ్చుకున్న పదవులు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేంద్రంలో ప్రయోజనాల దృష్ట్యా బిజెపి రాజీ పడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.

* ఆ ఫార్ములాతో పదవులు
మూడు పార్టీల మధ్య కుదిరిన రాజీ ప్రకారం అయితే.. టిడిపి ఎమ్మెల్యే ఉన్నచోట 80 శాతం పదవులు ఆ పార్టీ కేటాయించాలి. 30% జనసేన, 10 శాతం బిజెపి తీసుకోవాల్సి ఉంటుంది. జనసేన ఎమ్మెల్యే ఉన్నచోట ఆ పార్టీకి 60 శాతం, టిడిపికి 30%, బిజెపికి పది శాతం పదవులు కేటాయించాలి. కానీ బిజెపి ఎమ్మెల్యే ఉన్నచోట మాత్రం ఆ పార్టీకి 50 శాతం మాత్రమే పదవులు కేటాయించాలి. మిగతా 50 శాతం టిడిపి తో పాటు జనసేన పంచుకోవాలి. అయితే ఎలా చూసినా ఇక్కడ బిజెపికి నష్టం తప్పడం లేదు. మెజారిటీ పదవులు ఆ రెండు పార్టీలు తన్నుకు పోతాయి. దీంతో బిజెపి శ్రేణుల్లో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది.

* మారిన సీన్
బిజెపిది ఎన్నికల ముందు ఒక పరిస్థితి.. ఎన్నికలయ్యాక మరో పరిస్థితి. పది అసెంబ్లీ సీట్లకు పోటీ చేసిన బిజెపి ఎనిమిది చోట్ల విజయం సాధించింది. ఆరు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసి మూడింట గెలిచింది. అంటే ఆ పార్టీ 16 మంది నాయకులకు అవకాశం ఇచ్చింది. అందులో ఐదుగురు ఓడిపోయారు. ఓడిపోయిన నేతలకు తప్పనిసరిగా నామినేటెడ్ పదవులు ఇవ్వాలి. వారితో పాటు రాష్ట్రంలో 50 మంది వరకు యాక్టివ్ నాయకులు ఉన్నారు. వారికి సైతం పదవులు ఇవ్వాల్సి ఉంది. ఇటువంటి తరుణంలోకేంద్ర పరిస్థితుల దృష్ట్యా,టిడిపి అవసరం మేరకు బిజెపి నేతలు సైలెంట్ అవుతున్నారు. ఈ విషయంలో బిజెపి హై కమాండ్ నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చినట్లు సమాచారం.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper
Exit mobile version