Homeఆంధ్రప్రదేశ్‌Chandrababu : జగన్ ట్రాప్ లో చంద్రబాబు

Chandrababu : జగన్ ట్రాప్ లో చంద్రబాబు

Chandrababu : రాజకీయ పార్టీలు, నేతల అంచనాలు ఒక్కోసారి తప్పుతాయి. వ్యూహాలు ఫెయిలవుతాయి. అప్పుడు జరిగే మూల్యం అంతా ఇంతా కాదు. ఇప్పుడు చంద్రబాబుతో పాటు తెలుగుదేశం పార్టీకి అటువంటి సమస్య ఎదురైంది. ఇన్నాళ్లు టిడిపి తప్పు పట్టిన వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థను చంద్రబాబు సమర్ధించాల్సి వచ్చింది. ఆ రెండు వ్యవస్థల విషయంలో టిడిపి ఆరోపణలు తప్పు అయినట్లు తేలింది. అభిప్రాయం మారడంపై ప్రజల్లోకి తప్పుడు సంకేతం వెళ్తోంది.

గత ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు వైఖరి ఇలానే ఉండేది. 2014 ఎన్నికల సమయంలో ప్రత్యేక హోదా సాధిస్తానని చెప్పడంతో ఏపీ ప్రజలు చంద్రబాబును అపారంగా నమ్మారు. ఆయన సీనియారిటీని గౌరవించి తప్పకుండా ప్రత్యేక హోదా తెచ్చి పెడతారని భావించారు. మద్దతు తెలిపి టిడిపిని అధికారంలోకి తెచ్చారు. అయితే కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ప్రత్యేక హోదా తీసుకురావడంలో చంద్రబాబు ఫెయిలయ్యారు. ప్రత్యేక హోదాకు సమానమైన ప్యాకేజీ చాలు అంటూ ఒప్పుకున్నారు. అదే అంశాన్ని జగన్ హైలెట్ చేయడంతో యూటర్న్ తీసుకున్నారు. ప్రజల్లోకి బలంగా వెళ్లడంతో కేంద్ర ప్రభుత్వాన్ని విభేదించారు. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు. మళ్లీ ప్రత్యేక హోదా పల్లవిని అందుకున్నారు. దీంతో ప్రజల ముందు చులకన అయ్యారు.

ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ విషయంలో సైతం చంద్రబాబు చేసిన ఆరోపణలు అలానే ఉన్నాయి. గత ఐదు సంవత్సరాలుగా వ్యవస్థపై విషం చిమ్మారు. ప్రజాస్వామ్యానికి ఒక విఘాత వ్యవస్థగా చెప్పుకొచ్చారు. ప్రభుత్వం ఒక సమాంతర వ్యవస్థను తీసుకువచ్చిందని ఆరోపణలు చేశారు. అటు సచివాలయ వ్యవస్థను సైతం తప్పుపట్టారు. అక్కడ 11 శాఖలకు సంబంధించి సహాయకులు అవసరమా అని ప్రశ్నించారు. అయితే ఇప్పుడు ఎన్నికల ముంగిట రెండు వ్యవస్థలను చంద్రబాబు సమర్ధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పింఛన్ల పంపిణీ నిలిచిపోవడంతో పేద ప్రజలు రోడ్డుపైకి వస్తున్నారు. అటు అధికారపక్షం సైతం దీనికి కారణం చంద్రబాబు అని చెబుతోంది. అయితే వాలంటీర్ల స్థానంలో సచివాలయ ఉద్యోగులు పింఛన్లు, సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు అందించవచ్చు కదా అని చంద్రబాబుతో పాటు టిడిపి నేతలు ప్రశ్నిస్తున్నారు. అయితే సచివాలయ వ్యవస్థ వేస్ట్ అన్న వారే.. వారి సేవలను వినియోగించుకోవచ్చు కదా అని ప్రశ్నించేసరికి అధికార పక్షం టార్గెట్ చేస్తోంది. గతంలో చంద్రబాబు సచివాలయ వ్యవస్థ పై మాట్లాడిన తీరును గుర్తుచేస్తోంది. ఇలా ఎలా చూసుకున్నా.. గత ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా విషయంలో.. ఈ ఎన్నికల సమయంలో వాలంటీరు, సచివాలయ వ్యవస్థ విషయంలో చంద్రబాబు జగన్ ట్రాప్ లో పడ్డారన్న టాక్ నడుస్తోంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular