Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » Andhra Pradesh » Capital cases not recognized in the ap governament

Amaravathi Cases : అమరావతి కేసులను పట్టించుకోని కూటమి సర్కార్.. కారణం అదే!

వైసిపి ప్రభుత్వం మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చిన సంగతి తెలిసిందే. అందుకు అనుగుణంగా అడుగులు వేస్తున్న క్రమంలో అమరావతి రైతులు భారీ ఉద్యమానికి తెర తీశారు. న్యాయస్థానాల్లో భారీగా పిటిషన్లు దాఖలు చేశారు. దీంతో కోర్టులు సైతం అమరావతి రాజధాని అని తేల్చి చెప్పాయి

Written By:Dharma Raj, Updated On : July 13, 2024 / 04:18 PM IST
  • OKTelugu FaceBook
  • OKTelugu Twitter
  • OKTelugu whatsapp
  • OKTelugu Telegram
Capital Cases Not Recognized In The Ap Governament

Follow us on

OKTelugu google news OKTelugu Facebook OKTelugu Instagram OkTelugu Youtube OKTelugu Telegram

Amaravathi Cases : తన ప్రాధాన్యత ప్రాజెక్టు అమరావతి అని చంద్రబాబు తేల్చి చెప్పారు. అధికారంలోకి వచ్చిన మరుక్షణం ఫుల్ ఫోకస్ పెట్టారు. గత ఐదేళ్లుగా పూర్తిగా నిర్వీర్యం అయిపోయిన అమరావతి.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ప్రాణం పోసుకుంది. చకచకా పనులు ప్రారంభమయ్యాయి. జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టారు. 45 రోజుల్లో పూర్తిస్థాయిలో పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకుగాను 33 కోట్ల రూపాయలు కేటాయించారు. శాశ్వత నిర్మాణాలకు సంబంధించి నిధుల కొరత ఉన్నా.. ఏదో విధంగా సర్దుబాటు చేసేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నుంచి భారీగా సాయం పొందాలని చూస్తున్నారు. అయితే అమరావతి పై దృష్టి పెట్టిన చంద్రబాబు.. న్యాయపరమైన చిక్కులపై ఇంతవరకు ఫోకస్ పెట్టలేదు.

వైసిపి ప్రభుత్వం మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చిన సంగతి తెలిసిందే. అందుకు అనుగుణంగా అడుగులు వేస్తున్న క్రమంలో అమరావతి రైతులు భారీ ఉద్యమానికి తెర తీశారు. న్యాయస్థానాల్లో భారీగా పిటిషన్లు దాఖలు చేశారు. దీంతో కోర్టులు సైతం అమరావతి రాజధాని అని తేల్చి చెప్పాయి. ఈ తీర్పు రాకముందే రాజధాని బిల్లులను అసెంబ్లీలో జగన్ సర్కారు వెనక్కి తీసుకుంది. అటు తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కానీ అక్కడ రాజధాని వ్యవహారం ఇప్పటికీ తేలలేదు. కేసు అలానే పెండింగ్ లో ఉంది. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన వెంటనే సుప్రీంకోర్టులో రాజధానుల కేసులు వెనక్కి తీసుకుంటుందని అంతా భావించారు. కానీ అలా జరగలేదు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులు గడుస్తోంది. అన్ని రకాల నిర్ణయాలు తీసుకుంటోంది చంద్రబాబు సర్కార్. కానీ రాజధానికి సంబంధించి న్యాయపరమైన చిక్కులు అధిగమించేందుకు ప్రయత్నాలు జరగకపోవడం విశేషం. కనీసం దాని గురించి చర్చలు కూడా జరగడం లేదు. అలాగే అసెంబ్లీలో రాజధాని బిల్లులు తిరిగి ప్రవేశపెడతామని కూడా ప్రభుత్వం చెప్పడం లేదు. న్యాయపరమైన వివాదాలు పట్టించుకోకుండా.. కేవలం పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుందా? అన్న చర్చ జరుగుతోంది.

ఏపీలో కూటమి ఏకపక్ష విజయం సాధించింది. కనీసం వైసీపీకి విపక్ష హోదా కూడా దక్కలేదు. తెలుగుదేశం పార్టీ ఒక్కటే 134 స్థానాల్లో విజయం సాధించింది. సుస్థిర ప్రభుత్వంతో ఐదేళ్లపాటు ముందుకు సాగనుంది.అందుకే కోర్టు వివాదాలు తర్వాత చూసుకోవచ్చన్న ధీమాతో ఉంది. ప్రస్తుతం అమరావతి రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా జరపాలని మాత్రం చూస్తోంది. అమరావతికి అనుకూలంగా తీర్పు వస్తుందన్న ధీమా కూడా కనిపిస్తోంది. చేతిలో అధికారం ఉంది కనుక.. విపక్షం బలహీనంగా ఉండడంతో.. ఎటువంటి భయం లేకుండా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.అందుకే ఈ కేసులను కూడా పెద్దగా పట్టించుకోవడంలేదని తెలుస్తోంది.

ప్రస్తుతంరాష్ట్ర ప్రభుత్వం వివాదాస్పద అంశాల జోలికి పోవడం లేదు. కేంద్ర ప్రభుత్వం అమరావతి నిర్మాణానికి అన్ని విధాల అండగా నిలుస్తామని ఇప్పటికే చంద్రబాబుకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. గత అనుభవాల దృష్ట్యా చంద్రబాబు సైతం రాజకీయ అంశాల కంటే.. రాష్ట్ర ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తున్నారు. అమరావతి నిర్మాణం చేపడితేనే కూటమికి ఏపీ ప్రజలు నమ్ముతారని..లేకుంటే తమతో పాటు బిజెపికి కూడా ఇబ్బందికర పరిస్థితులు తప్పవని చంద్రబాబు కేంద్ర ప్రజలకు చెప్పినట్లు సమాచారం.దీనిపై కేంద్ర పెద్దల సైతం సానుకూలత వ్యక్తం చేశారని.. వీలైనంత త్వరగా అమరావతి పనులు పూర్తి చేయడం పైనే దృష్టి పెట్టాలని కేంద్రం నుంచి చంద్రబాబుకు స్పష్టమైన ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది. కేంద్రంలో అనుకూల ప్రభుత్వం ఉండడం, రాష్ట్రంలో ఏకపక్ష విజయం సాధించి ఉండడంతో.. న్యాయపరమైన చిక్కులు ఇట్టే అధిగమించవచ్చని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. అందుకే కేసుల విషయంలో పెద్దగా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది.

Dharma Raj

Dharma Raj Author - OK Telugu

Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Read More

Web Title: Capital cases not recognized in the ap governament

Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com

Tags
  • Amaravathi Cases
  • ap govt
  • ap politics
  • CM Chandrababu
Follow OKTelugu on WhatsApp

Related News

Vallabhaneni Vamsi:వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరు.

Vallabhaneni Vamsi:వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరు.

Jagan: జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న గుంటూరు నేతలు!

Jagan: జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న గుంటూరు నేతలు!

Keshineni Nani: రాజకీయ సన్యాసం ప్రకటన పక్కన పెట్టేసిన కేశినేని నాని.. చేరేది ఆ పార్టీలోనే!

Keshineni Nani: రాజకీయ సన్యాసం ప్రకటన పక్కన పెట్టేసిన కేశినేని నాని.. చేరేది ఆ పార్టీలోనే!

Pawan Kalyan: దటీజ్ పవన్.. నెటిజన్లు ఫిదా.. వీడియో వైరల్!

Pawan Kalyan: దటీజ్ పవన్.. నెటిజన్లు ఫిదా.. వీడియో వైరల్!

AP Government : ఏపీలో ఆర్మీ కుటుంబాలకు ఆ రాయితీ.. ప్రభుత్వం ఉత్తర్వులు!

AP Government : ఏపీలో ఆర్మీ కుటుంబాలకు ఆ రాయితీ.. ప్రభుత్వం ఉత్తర్వులు!

TDP Mahanadu 2025: మహానాడు ఏర్పాట్లకు ఆ జిల్లా నేతలు దూరం!

TDP Mahanadu 2025: మహానాడు ఏర్పాట్లకు ఆ జిల్లా నేతలు దూరం!

CM Chandrababu: కష్టపడి నలుగురు పిల్లల్ని కన్నాడు.. బాబు వ్యాఖ్యలు వైరల్

CM Chandrababu: కష్టపడి నలుగురు పిల్లల్ని కన్నాడు.. బాబు వ్యాఖ్యలు వైరల్

Annadata Sukhibhava Scheme: కౌలు రైతులకు రూ. 20,000.. త్వరపడండి

Annadata Sukhibhava Scheme: కౌలు రైతులకు రూ. 20,000.. త్వరపడండి

Rammohan Naidu : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకి హై సెక్యూరిటీ.. అలా చేయండి అంటూ నారా లోకేష్ సూచన!

Rammohan Naidu : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకి హై సెక్యూరిటీ.. అలా చేయండి అంటూ నారా లోకేష్ సూచన!

ఫొటో గేలరీ

Ashu Reddy : పొట్టి స్కర్టు రెండు జడలు.. అదిరిందిగా అషు..

Ashu Reddy Ashu Reddy Latest Photos Are Going Viral On Social Media

Deepthi Sunaina: ఈ భామ సొగసులు మామూలుగా లేవుగా..అందాల వరదండీ బాబూ..

Deepthi Sunaina Latest Photos Go Viral

Eesha Rebba Pics: వంపు, వయ్యారాలతో అదరగొట్టేస్తున్న ఈషా రెబ్బా..

Eesha Rebba Latest Photo Shoot Pics

Mahesh Babu Daughter: సంప్రదాయినీ.. మహేష్ కూతురు లుక్ వైరల్

Mahesh Babu Daughter Sitara Latest Pics Goes Viral

Faria Abdullah : చిట్టి ఫోటోలు చూస్తే చెమటలు పట్టాల్సిందే గురూ..

Faria Abdullah Faria Abdullah Latest Photos Are Viral On Social Media
OKTelugu
Follow Us On :
  • OKTelugu google news
  • OKTelugu youtube
  • OKTelugu instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OKTELUGU 2025 All rights reserved.