Monsoons : ఖరీఫ్ సీజన్ ప్రారంభమై 20 రోజులు కావొస్తున్నా వాన చినుకు జాడలేదు. రుతుపవనాలు దోబూచులాడుతున్నాయి. దుక్కులు దున్ని విత్తనాలు వేసుకునేందుకు సిద్ధంగా ఉన్న రైతులు చినుకు జాడ కోసం ఆకాశంవైపు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే దేశంలోకి వారం ఆలస్యంగా ప్రవేశించిన రుతుపవనాలు ఒక అడుగు ముందుకు నాలుగు అడుగులు వెనక్కి అన్నట్లు నెమ్మదిగా కదులుతున్నాయి. కేరళ, కర్ణాటకలో విస్తరించిన నైరుతి.. తెలుగు రాష్ట్రాల్లో విస్తరించడం లేదు. దీంతో భానుడు భగ్గుమంటున్నాడు. ఎండలు మండిపోతున్నాయి. ఈ తరుణంలో వాతావరణ శాఖ కీలక సమాచారం ఇచ్చింది.