Homeఆంధ్రప్రదేశ్‌AP local body elections update: ఏపీలో లోకల్ పోల్స్.. ముందుగా వాటికే..

AP local body elections update: ఏపీలో లోకల్ పోల్స్.. ముందుగా వాటికే..

AP local body elections update: స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి పెట్టింది కూటమి ప్రభుత్వం. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని.. సిద్ధం కావాలని సీఎం చంద్రబాబు తో పాటు మంత్రి లోకేష్ కూటమి పార్టీల శ్రేణులకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో ముందుగా.. దేనికి ఎన్నికలు అన్న సందేహం వ్యక్తం అవుతోంది. అయితే ముందుగా పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించి.. తరువాత మిగతా వాటికి ఎన్నికలు నిర్వహించాలన్నది ఒక ప్రణాళికగా తెలుస్తోంది. కానీ ఇప్పుడు ప్రభుత్వ ఆలోచన మారినట్లు సమాచారం. రాజకీయంగా పై చేయి సాధించడంతోపాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని మరింతగా కృంగదీసేందుకు మాస్టర్ ప్లాన్ రూపొందించినట్లు ప్రచారం జరుగుతోంది. అసలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వకుండా.. సునాయాస విజయం దక్కాలంటే మున్సిపల్ ఎన్నికలే కీలకమని కూటమి ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.

ప్రత్యేక అధికారుల నియామకం..
రాష్ట్రంలో వందకు పైగా మున్సిపాలిటీలు ఉన్నాయి. 12 వరకు కార్పొరేషన్లు కొనసాగుతున్నాయి. వాటికి సంబంధించి పాలకవర్గాల పదవీకాలం మార్చి 17 తో ముగిసింది. అప్పటినుంచి ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. పంచాయతీలకు సంబంధించిన సర్పంచుల పదవీకాలం ఈనెల రెండు తో ముగిసింది. పంచాయితీలకు కూడా ప్రత్యేక అధికారులు వచ్చారు. మండల పరిషత్ తో పాటు జిల్లా పరిషత్తులకు సంబంధించిన గడువు ఇంకా జూన్ వరకు ఉంది. అది ముగిసిన వెంటనే వాటికి సంబంధించి ప్రత్యేక అధికారుల నియామకం కూడా జరగనుంది. అయితే ఒక్కో స్థానిక సంస్థ ఖాళీ అవుతున్న తరుణంలో ఎన్నికలు నిర్వహిస్తారా లేదా అనే అనుమానాలు ఉన్నాయి. కానీ ఎట్టి పరిస్థితుల్లో గడువులోగా ఎన్నికలు పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.

ఆ ఒక్క కారణంతో..
ముందుగా మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఎందుకంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో తమదే విజయం అని చెబుతోంది. ప్రజల్లోకి బలంగా వెళ్లే ప్రయత్నం చేస్తోంది. ఈ సమయంలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించి గెలవాలని చూస్తోంది కూటమి. పట్టణాల్లో విద్యావంతులతో పాటు తటస్థులు అధికం. వారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తీరుపై కొంచెం ఆగ్రహంతో ఉన్నారు. అందుకే ముందుగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తే అక్కడ ఏకపక్షంగా విజయం సాధించవచ్చు అని ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. పైగా పార్టీ సింబల్ తో జరిగే ఎన్నికలు కాబట్టి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పట్టణ/ నగర ప్రజలు వ్యతిరేకించే అవకాశం ఉంది. ఈ కారణంతోనే మున్సిపల్ ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

పార్టీల రహితంగా..
పంచాయితీ ఎన్నికలు అనేవి పార్టీలకు రహితంగా జరుగుతాయి. పైగా మూడు పార్టీల ఉమ్మడి ప్రభుత్వము ఉంది. చాలా చోట్ల స్థానిక రాజకీయాలకు అనుగుణంగా అభ్యర్థులు ఎక్కువగా ఉంటారు. ఈ తరుణంలో స్వతంత్రులను సైతం తమ ఖాతాల్లో వేసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసుకునే అవకాశం ఉంది. అందుకే ఆ పార్టీకి ఎంత మాత్రం అవకాశం ఇవ్వకుండా.. ఇప్పుడు నేరుగా మున్సిపల్ ఎన్నికలకు వెళ్లిపోతే బాగుంటుందన్న అభిప్రాయానికి ప్రభుత్వం వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం జన గణన ప్రారంభం అయింది. కానీ 2011 జనాభా లెక్కల ప్రకారం మాత్రమే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ప్రభుత్వ దూకుడు చూస్తుంటే మరి కొద్ది రోజుల్లోనే మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

India vs Zimbabwe : ఆరు ఓటముల తర్వాత.. అయ్యర్ పొలంలో మొలకలు.. కానీ ఇది సరిపోదు..

India vs Zimbabwe : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలోను వైట్ వాష్.. బ్యాటింగ్ బలంగా లేదు. బౌలింగ్ గొప్పగా లేదు.. ఫీల్డింగ్ చెప్పుకొనే స్థాయిలో లేదు. ఆటగాళ్లు ఏమైనా...

Dharmendra Pradhan : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. నరేంద్ర మోడీ తదుపరి ఏం చేయబోతున్నారు..

Dharmendra Pradhan : సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రధాన్ రాజీనామా చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనలకు తలవంచి.. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ప్రధానమంత్రి నరేంద్ర...

Narendra Modi : కొత్త విద్యాశాఖ మంత్రి ఇతనే అనూహ్యంగా మోడీ మనస్సు ఇతడి మీదికే ఎందుకంటే..

Narendra Modi : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కొత్త విద్యాశాఖ మంత్రి ఎవరు అనే చర్చ మొదలైంది. వాస్తవానికి ధర్మేంద్ర రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న తర్వాత.. నరేంద్ర మోడీ వెంటనే...

Donald Trump : ఈయూ జరిమానాలపై కన్నెర్రజేసిన ట్రంప్‌.. అమెరికా కంపెనీల రక్షణకు చర్యలు!

Donald Trump : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఏడాది కాలంపాటు అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని తరలించడం, అమెరికా వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సరుకులపై...

Harish Rao : బిజెపిలోకి హరీష్ రావు.. కేటీఆర్ ఏమన్నారంటే..

Harish Rao : తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏదో ఒక సందర్భంలో మీడియాలో బలంగా ప్రచారానికి.. నాయకుల మధ్య చర్చకు కారణమయ్యే అంశం ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీలో హరీష్...
Oktelugu Epaper
Exit mobile version