Homeఆంధ్రప్రదేశ్‌AP DSC 2024 : ఏపీ డీఎస్సీ అప్పుడే.. ప్రభుత్వం ఫుల్ క్లారిటీ!

AP DSC 2024 : ఏపీ డీఎస్సీ అప్పుడే.. ప్రభుత్వం ఫుల్ క్లారిటీ!

AP DSC 2024 : కూటమి ప్రధాన హామీలో డీఎస్సీ ఒకటి. తాము అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీ ప్రకటిస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు తొలి ఫైల్ పై సంతకం చేశారు.జగన్ సర్కార్ ఇచ్చిన 6000 పోస్టులకు.. మరో 10 వేల పోస్టులు జత కలుపుతూ 16 వేలకు పైగా ఉపాధ్యాయ నియామకాలు చేపడతామని చెప్పారు. క్యాబినెట్లో సైతం ఆమోదం తెలిపారు. కానీ ఆరు నెలలు అవుతున్నా ఇంతవరకు నోటిఫికేషన్ మాత్రం ప్రకటించలేదు. దీంతో డీఎస్సీ అభ్యర్థుల్లో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. ఇప్పటికే లక్షలాదిమంది అభ్యర్థులు ఆశగా ఎదురుచూస్తున్నారు. చాలామంది ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. డీఎస్సీ నోటిఫికేషన్ ప్రక్రియలో జాప్యం జరుగుతుండడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వచ్చే విద్యా సంవత్సరం నాటికి ఉపాధ్యాయ నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని చెబుతోంది.

* ఎస్సీ వర్గీకరణతో
అయితే డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకటనలో జాప్యానికి ప్రధాన కారణం ఎస్సీ వర్గీకరణ. వాస్తవానికి నవంబర్ 4న డీఎస్సీ నోటిఫికేషన్ ఉంటుందని అంతా భావించారు. కానీ చివరి నిమిషంలో ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ చంద్రబాబును కలిశారు. ఎస్సీ వర్గీకరణ జరిగిన తర్వాత డీఎస్సీ ప్రకటించాలని కోరారు. అప్పుడే దళిత వర్గాలకు న్యాయం జరుగుతుందని చెప్పుకొచ్చారు. దీంతో ప్రభుత్వం నోటిఫికేషన్ ప్రకటనను వాయిదా వేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఎస్సీ వర్గీకరణ అనేది ఎప్పుడు జరుగుతుంది? ఇప్పట్లో పూర్తవుతుందా? అన్న అనుమానాలు ఉన్నాయి. ఈ తరుణంలో డీఎస్సీ అభ్యర్థులు కూడా ఎంతో ఆందోళనతో ఉన్నారు.

* అనేక రకాల జాగ్రత్తలు
అయితే ఈ డీఎస్సీ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. ఎటువంటి న్యాయ చిక్కుళ్ళు లేకుండా పూర్తి చేయాలన్న సంకల్పంతో ఉంది. ఒకవేళ డీఎస్సీ ప్రకటన చేసినా.. అడ్డంకులు సృష్టించేందుకు చాలామంది ప్రయత్నిస్తారు. న్యాయస్థానాలను ఆశ్రయిస్తారు. అందుకే వీలైనంత త్వరగా ఎస్సీ వర్గీకరణ పూర్తి చేసి.. డీఎస్సీ ప్రకటించాలన్నది సర్కార్ వ్యూహంగా తెలుస్తోంది. దీనిని ధ్రువీకరించారు విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్. ప్రస్తుతం ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఏకసభ్య కమిషన్ విచారణ కొనసాగుతోందని.. అది పూర్తయ్యాక డీఎస్సీ వర్గీకరణ పై స్పష్టత వస్తుందని.. ఆ తరువాత డీఎస్సీ నోటిఫికేషన్ వస్తుందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

YS Sharmila : ఆస్పత్రి బెడ్ మీద షర్మిల.. పరామర్శించడానికి జగన్ కు తీరికలేదు

YS Sharmila : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అనారోగ్యానికి గురయ్యారు. ఆమె కొద్ది రోజులుగా పొత్తికడుపు నొప్పితో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె శస్త్ర చికిత్స చేయించుకున్నట్టు తెలుస్తోంది. ఇదే...

Srinivasa Mangapuram : ‘శ్రీనివాస మంగపురం’ మొట్టమొదటి రివ్యూ.. ఈ రేంజ్ లో ఉంటుందని ఊహించలేదు..

Srinivasa Mangapuram : రమేష్ బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ హీరో గా నటించిన 'శ్రీనివాస మంగపురం' చిత్రం ఈ నెల 30 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల...
Abhishek Sharma

Abhishek Sharma : 1, 8, 2.. గంభీర్ తో పాటు ఇతడినీ షెడ్డు కు పంపించాల్సిందే..

Abhishek Sharma : ఆడుతోంది జింబాబ్వే మీద. వాళ్ల బౌలింగ్ అంత గొప్పగా ఉండదు. అలాంటప్పుడు స్వేచ్ఛగా ఆడుకోవచ్చు. సరికొత్త రికార్డులు సృష్టించుకోవచ్చు. అవసరమైతే దూకుడుగా బ్యాటింగ్ చేయవచ్చు. కానీ ఇతడు ఏం...
Gautam Gambhir Strict Selection Policy

Team India : గంభీర్ లేడు.. టీమిండియా నెంబర్ వన్..

Team India : ఇన్నాళ్లపాటు టీం ఇండియాకు దరిద్రం ఏందో.. శని ఏందో ఇప్పుడు అర్థమైంది. జట్టుకు ఏలినాటి శని లాగా దాపురించిన గంభీర్ లేకపోవడంతో.. ఒక్కసారిగా ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి....
Vaibhav Suryavanshi

Vaibhav Suryavanshi : బుడ్డోడి కొట్టుడుకి.. బంతి స్టేడియం అవతల.. పెద్ది సినిమా చూపించాడు గా

Vaibhav Suryavanshi :  49 బంతులు.. ఇందులో 8 ఫోర్లు.. నాలుగు సిక్సర్లు.. మొత్తంగా 81 పరుగులు.. అభిషేక్ శర్మతో తొలి వికెట్ కు 20 పరుగులు.. ఇషాన్ కిషన్ తో రెండో వికెట్...
Oktelugu Epaper