Homeఆంధ్రప్రదేశ్‌AP Fake Liquor Scam : జోగి రమేష్–జనార్దన్ రావు వాట్సాప్ చాట్ లీక్.. ఏపీలో...

AP Fake Liquor Scam : జోగి రమేష్–జనార్దన్ రావు వాట్సాప్ చాట్ లీక్.. ఏపీలో నకిలీ మద్యం స్కాంలో మరో సంచలనం

AP Fake Liquor Scam : ఆంధ్రప్రదేశ్‌లో నకిలీ మద్యం కేసు మరో సంచలన ఘట్టానికి చేరుకుంది. ఈ కేసులో ఏ1 నిందితుడు జనార్దన్ రావు , మాజీ మంత్రి జోగి రమేష్ మధ్య జరిగిన వాట్సాప్ చాట్ లీక్ అవ్వడంతో ఈ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఈ చాట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, రాజకీయ వర్గాల్లో పెను కలకలం సృష్టిస్తోంది.

AP Fake Liquor Scam

* చాట్‌లో వెల్లడైన సంచలన విషయాలు

వైరల్ అయిన వాట్సాప్ చాట్ ప్రకారం.. వైసీపీ పాలనలో జోగి రమేష్ ఆధ్వర్యంలోనే నకిలీ మద్యం తయారీకి పాల్పడినట్లు నిందితుడు జనార్దన్ రావు అంగీకరించాడు. ఈ చాట్‌లో బయటపడిన కీలక అంశాలు ఇవీ..

వ్యాపారం ఆపమని ఆదేశం: టిడిపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే, జోగి రమేష్ ఆదేశాల మేరకే నకిలీ మద్యం వ్యాపారం ఆపేశామని జనార్దన్ రావు వెల్లడించారు.

తిరిగి ప్రారంభించమని ఆదేశం: ఏప్రిల్ 2025లో జోగి రమేష్ ఫోన్ చేసి, “టిడిపి ప్రభుత్వంపై చెడ్డపేరు తెచ్చేలా మళ్లీ తయారీ మొదలు పెట్టు” అని చెప్పినట్లు చాట్‌లో స్పష్టంగా ఉంది.

తంబళ్లపల్లె నియోజకవర్గంలో సూచన: అక్కడి నుంచి మొదలుపెడితే చంద్రబాబు ప్రభుత్వంపై బురద జల్లవచ్చు అని జోగి రమేష్ సూచించినట్టు వివరించారు.

ప్లాన్ అమలు

వేర్వేరు పేర్లతో గదులు అద్దెకు తీసుకుని, మద్యం తయారీకి యంత్రాలు ఏర్పాటు చేశారు. దీని తర్వాత సాక్షి మీడియా ముందు ఉంచి లీక్ ఇచ్చి రైడ్ చేయించడం, తద్వారా ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే ప్లాన్‌ను ఈ చాట్‌లో స్పష్టంగా వెల్లడించారు.

జనార్దన్ రావు ఫిర్యాదు ప్రకారం, జోగి రమేష్ చిన్నప్పటి పరిచయాన్ని అడ్డుపెట్టుకుని నమ్మించి మోసం చేశాడని పేర్కొన్నాడు. అలాగే, ఈ వ్యవహారంలో జై చంద్రారెడ్డికి అసలు సంబంధం లేదని స్పష్టం చేశాడు.

* జోగి రమేష్ స్పందన..

ఈ వ్యవహారంపై జోగి రమేష్ మొదట స్పందిస్తూ, జనార్దన్ రావు ఎవరో తనకు తెలియదని, తనపై కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఆ తర్వాత, పరిచయం ఉన్నప్పటికీ స్నేహితుడేమీ కాదని, జనార్దన్ తన ఇంటికి రాలేదని, సంబంధం లేని విషయాలను వెల్లడించాడని తెలిపారు.

* సిట్ దర్యాప్తు ముమ్మరం

ఈ కేసును దర్యాప్తు చేయడానికి ఏలూరు రేంజ్ ఐజీ నేతృత్వంలో ఒక ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేయబడింది. సిట్ అధికారులు ఇప్పటికే సీసీ ఫుటేజీలను సేకరించినట్లు సమాచారం. జోగి రమేష్‌పై ఆరోపణలు, అసలు కుట్రదారులు ఎవరు అనే కోణంలో విచారణ కొనసాగుతోంది.

* రాజకీయ పరిణామాలు, ప్రభుత్వం స్పందన

మాజీ మంత్రి జోగి రమేష్ పేరు తెరపైకి రావడం, ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీయడానికి కుట్ర జరిగిందన్న ఆరోపణలు రాజకీయ వర్గాల్లో పెద్ద సంచలనం సృష్టించాయి. ప్రభుత్వం ఈ వ్యవహారంపై కఠినంగా ఉండాలని, ఇందులో ఎవరెవరి ప్రమేయం ఉన్నా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది.

నకిలీ మద్యం కేసు రాజకీయంగా పెను దుమారం రేపనుంది. జనార్దన్ రావు–జోగి రమేష్ చాట్ లీక్, ఇతర సాక్ష్యాలు సిట్ దర్యాప్తుకు మార్గం చూపుతున్నాయి. ఈ కేసులో వచ్చే రోజుల్లో రాజకీయ పరిణామాలు, అధికారుల చర్యలు రాష్ట్రంలో ప్రధాన అంశాలుగా మారనున్నాయి.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version