Homeఆంధ్రప్రదేశ్‌Agrigold Plots: అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్ న్యూస్!

Agrigold Plots: అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్ న్యూస్!

Agrigold Plots: అగ్రిగోల్డ్( agri gold ) విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అగ్రిగోల్డ్ కు సంబంధించి ప్లాట్ల రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న వారికి ఉపశమనం ఇచ్చింది. అగ్రిగోల్డ్ రియల్ ఎస్టేట్ రంగంలో కూడా కార్యకలాపాలు చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో కొంతమంది అగ్రిగోల్డ్ లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేశారు. ఇంతలోనే అగ్రిగోల్డ్ పై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. దీంతో ప్లాట్లు కొనుగోలు చేసిన వారిపై ప్రభావం చూపింది. అగ్రిగోల్డ్ ఆస్తులు జప్తునకు వెళ్లిపోయాయి. అయితే అప్పటికే రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకున్న ప్లాట్లకు సంబంధించి జప్తు మినహాయింపు ఉండేది. అయితే కూటమి ప్రభుత్వం ఆ జుట్టు నుంచి మినహాయిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం పై ప్లాట్లు కొనుగోలు చేసిన వారు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ధన్యవాదములు తెలిపారు.

* అప్పట్లో టిడిపి ప్రభుత్వం మినహాయింపు..
అగ్రిగోల్డ్ సంస్థ కార్యకలాపాలు ముగించిన తరుణంలో లక్షలాదిమంది ఖాతాదారులు ఆందోళనకు గురయ్యారు. 2017 ఫిబ్రవరి 20న అప్పటి టిడిపి ప్రభుత్వం అగ్రిగోల్డ్ కు చెందిన 16,857.81 ఎకరాల భూమి, 82,207.08 చదరపు గజాల స్థలాలను జప్తు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జప్తు చేసిన భూముల్లో కొన్నిచోట్ల అగ్రిగోల్డ్ కు సంబంధించి లేఅవుట్లు కూడా ఉన్నాయి. అయితే కొంతమంది ఈ లేఅవుట్లలో వీటిలో ప్లాట్లు కొనుగోలు చేసి పూర్తిగా డబ్బులు చెల్లించారు. రిజిస్ట్రేషన్లు కూడా చేయించుకున్నారు. ఇటువంటి వారు అప్పటి టిడిపి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఈ ప్లాట్ లను ప్రభుత్వం జప్తు నుంచి మినహాయిస్తున్నట్లు స్పష్టంగా ఉత్తర్వుల్లో క్లారిటీ ఇచ్చింది. కానీ గత వైసిపి ప్రభుత్వం ఈ మినహాయింపును తొలగించడంతో ప్లాట్లు కొనుగోలు చేసిన వారంతా ఆందోళనకు గురయ్యారు.

* ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో..
కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఇటువంటి ప్లాట్లను కొనుగోలు చేసిన వారంతా ఏపీ సిఐడి అధికారులను( AP CID officers) కలిశారు. ప్రభుత్వ పెద్దల దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లారు. దీంతో వారు సానుకూలంగా స్పందించారు. అప్పట్లో టిడిపి ప్రభుత్వం ఈ ప్లాట్ల జప్తు మినహాయింపు కోసం ఇచ్చిన ఉత్తర్వులను ఇప్పుడు పునరుద్ధరించారు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో అగ్రిగోల్డ్ ప్లాట్లు కొనుగోలు చేసిన వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

AP Heavy Rains: ఏపీకి భారీ వాయుగుండం.. అయినా సరే!

AP Heavy Rains: బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. ఇది తీవ్ర వాయుగుండం గా మారింది. ప్రస్తుతం ఉత్తరం వైపు ప్రయాణిస్తూ ఒడిస్సాలోని బాలాసోర్, పశ్చిమ బెంగాల్లోని హల్దియా మధ్య కేంద్రీకృతమై ఉంది. ఈరోజు...

TDP MLC Candidates: ఆశావహులు 20 మంది.. టిడిపిలో ఆ ఇద్దరికీ ఎమ్మెల్సీ పదవి!

TDP MLC Candidates: ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి ప్రారంభం అయింది. గత వైసిపి ప్రభుత్వంలో గవర్నర్ కోటా కింద ఎన్నికైన ఇద్దరు ఎమ్మెల్సీలు పదవీ విరమణ చేయనున్నారు. మండలి డిప్యూటీ చైర్...

ADR Report 2026: ఏడీఆర్ నివేదిక: ఆ విషయంలో రేవంత్ ను ఎవరూ బీట్ చేయలేరు..

ADR Report 2026: దేశంలో రాజకీయ నాయకుల మీద ఉన్న కేసులు.. వారు సంపాదించిన ఆస్తులు.. ఇతర వ్యవహారాల మీద ఎప్పటికప్పుడు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రి ఫార్మ్స్ అనే సంస్థ...

West Indies vs Pakistan: పాపం పాకిస్తాన్.. వెస్టిండీస్ బౌలర్ గ్రీవ్స్ దెబ్బకు తోక ముడిచింది..

West Indies vs Pakistan: ఆ బంతులు బుల్లెట్లు.. చూస్తుండగానే వికెట్లను పడగొట్టాయి. చూస్తుండగానే వికెట్ల మందు దొరకబుచ్చుకున్నాయి.. చూస్తుండగానే బ్యాటర్లకు నరకం చూపించాయి. ఇదంతా కూడా ఒక్కడు చేసిన అద్భుతం....

Jogi Ramesh: జోగి రమేష్ మతమార్పిడి.. దుర్గమ్మ వద్ద ప్రమాణం!

Jogi Ramesh: వైసీపీలో పదవి కావాలంటే మతం మారాలా? క్రిస్టియన్ మతం తీసుకోవాల్సిందేనా? వైసీపీలో ఉన్న నేతల్లో ఎక్కువమంది అలానే చేసారా? ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో దీనిపై చర్చ నడుస్తోంది. తాజాగా మాజీ...
Oktelugu Epaper
Exit mobile version