spot_img
Homeఆంధ్రప్రదేశ్‌PM Modi- Jagan And Chandrababu: ఏపీ పాలిటిక్స్ లో కీలక మలుపు.. ఒకే వేదికపై...

PM Modi- Jagan And Chandrababu: ఏపీ పాలిటిక్స్ లో కీలక మలుపు.. ఒకే వేదికపై మోదీ, జగన్, చంద్రబాబు

PM Modi- Jagan And Chandrababu: ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామం. సీఎం జగన్ తో పాటు విపక్ష నేత చంద్రబాబుకు ఢిల్లీకి రావాలని కేంద్ర పెద్దలు ఆహ్వానం పంపారు. డిసెంబరు 5న రాష్ట్రపతి భవన్ లో జరిగే అత్యున్నత స్థాయి సమావేశానికి హాజరుకావాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఇరువురి నేతలకు ఫోన్ చేసి మరీ ఆహ్వానించారు. ఏపీ రాజకీయాలకు సంబంధించి ఇది కీలక పరిణామం. ఇప్పటివరకూ శాసనసభలో తప్ప ఇరువురు నేతలు కలిసింది లేదు. వేదిక పంచుకున్న సందర్భాలు లేవు. తొలిసారి జగన్ తో పాటు చంద్రబాబు వేదిక పంచుకోనున్నారు. గతంలో అజాదీ కా అమృత్ దినోత్సవ వేడుకల నిర్వహణకుగాను నిర్వహించిన సమావేశానికి ఇద్దరు నేతలకు ఆహ్వానం అందింది. కానీ చంద్రబాబు ఒక్కరే హాజరయ్యారు. ఆ సమయంలో సీఎం జగన్ ఢిల్లీలోనే ఉన్నా హాజరుకాలేదు. ఇన్నాళ్లకు మరోసారి ఇద్దరు కలిసే చాన్స్ వచ్చింది.

PM Modi- Jagan And Chandrababu
PM Modi- Jagan And Chandrababu

ఈ ఏడాది జీ20 దేశాల అధ్యక్ష బాధ్యతలు అందుకున్న భారత్.. వచ్చే ఏడాది శిఖరాగ్ర సమావేశాల నిర్వహణకు సిద్ధపడుతోంది. దీనిలో అన్ని రాజకీయ పక్షాలనూ భాగస్వామ్యం చేయాలని నిర్ణయించింది, దేశావ్యాప్తంగా సదస్సులు, సమావేశాలు పెట్టాలని నిర్ణయించింది. ఇప్పటికే సెప్టెంబరులో ద్వైపాక్షిక సంబంధాల విషయంలో నిర్వహించిన 14వ జాయింట్ కమిషన్ సమావేశం సక్సెస్ అయ్యింది. ఇప్పుడు అదే స్పూర్తితో జీ20 శిఖరాగ్ర సమావేశానికి సన్నాహాలు చేస్తోంది. దేశ వ్యాప్తంగా అన్ని పార్టీల అధినేతలకు ఆహ్వానం పంపుతోంది. అందులో భాగంగా సీఎం జగన్ తో పాటు చంద్రబాబుకు ఆహ్వానం అందింది. సమావేశానికి యూనైటెడ్ స్టేట్స్ ఎమిరేట్ ప్రతినిధి ప్రత్యేక ఆహ్వినితుడిగా రానున్నట్టు తెలుస్తోంది. ప్రధాని మోదీ జీ20 శిఖరాగ్ర సమావేశం అజెండాపై రాజకీయ పార్టీల అధినేతలతో చర్చించనున్నారు.

అయితే ఈ సమావేశానికి జగన్ తో పాటు చంద్రబాబు తప్పకుండా హాజరయ్యే అవకాశముంది. ఇప్పటికే జగన్ ఢిల్లీ టూర్ షెడ్యూల్ ఖరారైనట్టు తెలుస్తోంది. డిసెంబరు 5న జగన్ ఢిల్లీ చేరుకోనున్నారు. సాయంత్రం 5 గంటలకు రాష్ట్రపతి భవన్ లో జరిగే ఈ భేటీకి హాజరుకానున్నారు. అయితే ఇప్పటికే చంద్రబాబు కూడా సమావేశానికి హాజరయ్యేందుకు నిర్ణయించుకున్నారు. అయితే గత మూడేళ్లుగా కేంద్ర పెద్దలకు దగ్గరయ్యేందుకు చంద్రబాబు చేసిన ప్రయత్నాలేవీ వర్కవుట్ కాలేదు.

PM Modi- Jagan And Chandrababu
PM Modi- Jagan And Chandrababu

కానీ ఇటీవల ఆయన కేంద్ర పెద్దల నుంచి వరుసగా ఆహ్వానాలు అందుకుంటున్నారు. తొలిసారి గా అజాదీ కా అమృత్ దినోత్సవ సన్నాహాక సమావేశానికి ఆహ్వానం అందడంతో ఢిల్లీ వెళ్లారు. ప్రధాని మోదీతో సుదీర్ఘ విరామం తరువాత సరదాగా మాట్లాడగలిగారు. అటు తరువాత భీమవరంలో విప్లవ వీరుడు అల్లూరి విగ్రహావిష్కరణకు ఆహ్వానం అందింది. కానీ పార్టీ ప్రతినిధిగా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడ్ని పంపించారు. ఇప్పుడు మూడోసారి జీ20 సమావేశ నిర్వహణకు ఆహ్వానించడంతో.. చంద్రబాబు అరుదైన అవకాశంగా భావిస్తున్నారు. తన సీనియార్టీని రంగరించి మరీ కేంద్రానికి సలహాలు, సూచనలు ఇచ్చేందుకు సిద్ధపడుతున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Telangana ACB

Telangana ACB: తెలంగాణ ఏసీబీ: పాముల వేట ముగిసింది.. అనకొండల హంట్ మొదలవుతోంది..

Telangana ACB: పుట్టల నుంచి పాములు బయటికి వస్తున్నాయి. ఆ పాముల వేట కూడా కొద్ది రోజులుగా ఆటంకం అనేది లేకుండా సాగుతోంది. అయితే ఇప్పుడు పాముల గుట్టు తెలిసిపోయింది. పాములు...
Ravi Prakash

Ravi Prakash: టీవీ9ను కొట్టేసిన రవి ప్రకాష్..

Ravi Prakash: మెరుగైన సమాజం అనే ట్యాగ్ లైన్ తో సరిగా దశాబ్దాల క్రితం రవి ప్రకాష్ శ్రీ ని రాజుతో కలిసి టీవీ9 అనే మహా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు....
Narendra Modi Strategy

Narendra Modi Strategy: ఢిల్లీ కాక్రోచ్‌లపై మోదీ హిట్‌ వ్యూహం.. దెబ్బకు దిగొచ్చిన ఆందోళనకారులు!

Narendra Modi Strategy: నీట్‌ పేపర్‌ లీకేజీకి వ్యతిరేకంగా ఢిల్లీలో మొదలైన ఉద్యమం క్రమంగా దేశంలోని పలు ప్రాంతాలకు విస్తరించింది. ఢిల్లీలో సీజేపీ నాయకత్వంలో సాగుతున్న ఈ ఆందోళనకు ఇతర రాష్ట్రాల్లో రాజకీయ...
SS Rajamouli

SS Rajamouli: వారణాసి బడ్జెట్ పెరగడం మీద స్పందించిన రాజమౌళి…

SS Rajamouli: మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'వారణాసి' సినిమా మీద ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలైతే ఉన్నాయి. మొదట 1000 కోట్ల బడ్జెట్ తో తీసేద్దాం అనుకోని ఈ సినిమాని...
Three Sisters Marry One Man

Three Sisters Marry One Man: ఒక యువకుడితో ముగ్గురు పెళ్లి చేసుకుందే కాక.. దారుణం.. ఇది ఊహించని...

Three Sisters Marry One Man: దేశవ్యాప్తంగా కొద్దిరోజులుగా నీట్ గురించి రచ్చ రచ్చ జరుగుతుంటే.. ముగ్గురు అక్కా చెల్లెళ్లు మాత్రం మీడియం మొత్తం తన వైపు తిప్పుకున్నారు. తమ గురించి మాట్లాడుకునే...
Oktelugu Epaper