Homeఅంతర్జాతీయంHormuz Strait: హార్ముజ్‌ దాటిని మూడు భారత నౌకలు.. ఇంధన భద్రతపై భారత్‌ అప్రమత్తం

Hormuz Strait: హార్ముజ్‌ దాటిని మూడు భారత నౌకలు.. ఇంధన భద్రతపై భారత్‌ అప్రమత్తం

Hormuz Strait: ఇరాన్‌–అమెరికా యుద్ధం ముగిసింది. ఇరు దేశాల మధ్య డీల్‌ కుదిరింది. దీంతో హర్మూజ్‌ తెరుచుకుంది. దీంతో ప్రపంచం ఊపిరి పీల్చుకుంది. అయితే కొన్ని గంటలకే ఇరాన్‌ మళ్లీ హార్ముజ్‌ మూసివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో మళ్లీ ఆందోళన నెలకొంది. ఈ పరిస్థితిలో హార్ముజ్‌ జలసంధిని భారతీయ జెండా ఎగురవేస్తున్న మూడు క్రూడాయిల్‌ ట్యాంకర్లు ఆదివారం సురక్షితంగా దాటాయి. ఈ ట్యాంకర్లు మొత్తం 8.6 లక్షల మెట్రిక్‌ టన్నుల చమురు సరకును తీసుకెళ్తున్నాయి. ఇందులో 94 మంది భారతీయ నావికులు ఉన్నారు.

ట్యాంకర్ల వివరాలు..
హార్ముజ్‌ దాటిన మూడు నౌకల్లో మార్గందేశ్‌ వైభవ్, దేశ్‌ వైభోర్, సన్మార్‌ హెరాల్డ్‌ ఉన్నాయి. హార్ముజ్‌ జలసంధిని దాటి భారతీయ ఓడరేవుల వైపు పయనిస్తున్నాయి. ఈ ట్యాంకర్లు మధ్యప్రాచ్య ప్రాంతం నుంచి భారతదేశానికి చమురు దిగుమతి చేసుకోవడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. హార్ముజ్‌ జలసంధి ప్రపంచ చమురు సరఫరాలో సుమారు 20 శాతం వాటా కలిగిన వ్యూహాత్మక మార్గం కావడంతో ఇక్కడి సురక్ష ఎప్పుడూ సందేహాస్పదంగా ఉంటుంది.

కేంద్ర మంత్రి కీలక ప్రకటన..
కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్‌ ఈ ట్యాంకర్ల సురక్షిత ప్రయాణం గురించి వివరించారు. భారతీయ నావికుల సురక్ష, ఇంధన భద్రత విషయంలో అన్ని సంబంధిత ఏజెన్సీలతో సమన్వయం చేసుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రకటన భారతదేశం తన ఇంధన దిగుమతులను రక్షించడంలో ఎంతో అప్రమత్తంగా ఉందని చెబుతోంది.

ఇంధన భద్రతపై దృష్టి..
హార్ముజ్‌ జలసంధి దాటడం భారతదేశ ఇంధన భద్రతకు సంబంధించిన ముఖ్యమైన అంశం. భారత్‌ తన చమురు అవసరాల్లో ఎక్కువ భాగం మధ్యప్రాచ్య దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. ఈ ప్రాంతంలో ఏదైనా ఉద్రిక్తతలు ఏర్పడితే ఇంధన సరఫరాలు ప్రభావితం కావచ్చు. అలాంటి పరిస్థితుల్లో భారత ప్రభుత్వం నావికుల సురక్షను ముందుగా ఉంచి, అన్ని ఏజెన్సీలతో సమన్వయం చేసుకోవడం ద్వారా దిగుమతులను సురక్షితంగా కొనసాగిస్తోంది. ఈ ఘటన భారతదేశం తన ఇంధన రంగంలో స్వావలంబన వైపు అడుగులు వేస్తున్నా, దిగుమతులపై ఆధారపడటం తప్పనిసరి అని చెబుతోంది. అందుకే అంతర్జాతీయ సముద్ర మార్గాల సురక్షను నిరంతరం పర్యవేక్షించడం, దౌత్యపరమైన చర్యలు తీసుకోవడం అవసరం. భారతీయ నావికుల రక్షణను కాపాడటం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు మద్దతు ఇవ్వడం కూడా ఈ చర్యల్లో భాగం.

హార్ముజ్‌ జలసంధి వంటి మార్గాల్లో భారత ట్యాంకర్ల సురక్షిత ప్రయాణం భవిష్యత్తులో కూడా ఇలాంటి సవాళ్లను ఎదుర్కోవడానికి బలమైన వ్యవస్థను నిర్మించాల్సిన అవసరాన్ని సూచిస్తోంది. ఇంధన భద్రతను మరింతగా బలపరచడానికి ప్రత్యామ్నాయ మార్గాలు, నిల్వలు పెంచడం, పునరుత్పాదక ఇంధన వనరులపై దృష్టి పెంచడం వంటి చర్యలు అవసరం.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular