Peddi movie overseas box office collection: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం కొద్దీ గంటల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటి వరకు ఈ సినిమా నుండి వచ్చిన ప్రతీ కంటెంట్ అభిమానుల్లో , ప్రేక్షకుల్లో ఈ చిత్రం పై ఉత్కంఠ ని రేపాయి, అంచనాలను భారీ రేంజ్ లో పెంచేలా చేశాయి, కానీ ఇండియా లో ఈ సినిమాకు ఉన్నంత డిమాండ్ , ఎందుకో ఓవర్సీస్ లో లేదు అనేది కఠోరమైన నిజం. ఈ చిత్రానికి సంబంధించిన ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలై నెల రోజులు దాటింది. ఈ చిత్రానికి ఉన్నటువంటి హైప్ ని చూసి , ప్రతీ ఒక్కరు కచ్చితంగా ఓజీ, దేవర, కల్కి , పుష్ప 2 తరహా ఓపెనింగ్ వస్తుందని అనుకున్నారు. కానీ తీరా చూస్తే ‘రాజాసాబ్’ కంటే తక్కువ గ్రాస్ ఓవర్సీస్ నుండి నమోదైంది, ఇదే అభిమానులను కంటతడి పెట్టిస్తున్న విషయం.
ప్రీమియర్ షోస్ కి గానూ ‘రాజా సాబ్’ చిత్రానికి ఓవర్సీస్ మొత్తం మీద 1.65 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు నమోదు అవ్వగా, ‘పెద్ది’ చిత్రానికి కేవలం 1.5 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు మాత్రమే నమోదు అయ్యాయి. నార్త్ అమెరికా లోని USA లో కూడా ఇదే పరిస్థితి. రాజా సాబ్ చిత్రానికి 1700 షోస్ కి గానూ 1.032 మిలియన్ డాలర్ల గ్రాస్ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా నమోదు అవ్వగా , ‘పెద్ది’ చిత్రానికి 1.022 మిలియన్ డాలర్లు మాత్రమే నమోదైంది. మరోపక్క ఇండియా లో ఈ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ పూర్తి భిన్నంగా ఉన్నాయి. రెండు రోజుల క్రితమే ఆంధ్ర ప్రదేశ్ లో బుకింగ్స్ మొదలు పెట్టారు , తెలంగాణ లో కాసేపటి క్రితమే పూర్తి స్థాయిలో బుకింగ్స్ మొదలయ్యాయి. అప్పుడే 10 లక్షలకు పైగా టికెట్స్ బుక్ మై షో, డిస్ట్రిక్ట్ యాప్స్ నుండి అమ్ముడుపోయాయి అంటే సాధారణమైన విషయం కాదు.
ఓవరాల్ గా ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల రూపాయలకు పైగా అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. బుక్ మై షో లో ప్రస్తుతం ఈ చిత్రానికి గంటకు 40 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. కచ్చితంగా ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి సెన్సేషనల్ ఓపెనింగ్ రాబోతుంది , వరల్డ్ వైడ్ గా మొదటి రోజు కచ్చితంగా వంద కోట్ల గ్రాస్ వసూళ్లను రాబడుతుంది , అందులో ఎలాంటి సందేహం లేదు , కానీ ఓవర్సీస్ బుకింగ్స్ మాత్రమే కాస్త ట్రేడ్ ని , అభిమానులను నిరాశకు గురి చేసింది. ఇదంతా పక్కన పెడితే , టాక్ వస్తే ఓవర్సీస్ లో కూడా సునామీ లాంటి వసూళ్లను చూడొచ్చు అనేది వాస్తవం. చూడాలి మరి రాబోయే రోజుల్లో ‘పెద్ది’ ఎలాంటి వసూళ్లను రాబడుతుంది అనేది.
