Pithapuram Varma: ఏపీ( Andhra Pradesh) రాజకీయాల్లో ఇప్పుడు పిఠాపురం హాట్ టాపిక్. టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ వర్మ తన పదవికి రాజీనామా చేశారు. పార్టీ హై కమాండ్ ఆదేశాలతో ఈ నిర్ణయానికి వచ్చారు. ఆయనను తప్పిస్తూ ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని టిడిపి హై కమాండ్ ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చిన వర్మ కన్నీటి పర్యాంతం అయ్యారు. అయితే ముగ్గురు నేతలతో కమిటీ నియమించమని తానే లోకేష్ కు చెప్పినట్లు వర్మ చెబుతున్నారు. అయితే పిఠాపురం నియోజకవర్గంలో కూటమిలో తలెత్తుతున్న విభేదాల దృష్టిలో పెట్టుకొని టిడిపి హై కమాండ్ ఈ నిర్ణయం తీసుకుంది. మొన్ననే ఒక ఘర్షణ వాతావరణం జరిగింది కూటమి పార్టీల మధ్య. దీంతో లోకేష్ వర్మను పిలిపించుకుని మాట్లాడారు. అన్ని విషయాలను సేకరించి.. ముగ్గురు నేతలతో కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పుకొచ్చారు.
* నిబద్ధత కలిగిన నేత..
వర్మ తెలుగుదేశం పార్టీ పట్ల కమిట్మెంట్ తో పనిచేసే నాయకుడు. సహజంగానే నియోజకవర్గంలో పట్టున్న నేత కావడంతో.. కూటమి పార్టీల్లో ఆధిపత్యం కోసం ప్రయత్నాలు చేశారు. తెలుగుదేశం పార్టీకి పిఠాపురం నియోజకవర్గంలో అన్యాయం జరుగుతోందని చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఈ విషయం హై కమాండ్ కు తెలుసు. కానీ రాష్ట్రస్థాయిలో పొత్తు కొనసాగాలంటే పవన్ కళ్యాణ్ కీలకం. ఆయనకు ఎటువంటి ఇబ్బందులు రాకూడదు. అందుకే లోకేష్ ఈ విషయంలో ప్రత్యేకంగా కలుగ చేసుకున్నారు. పార్టీ పరిస్థితి తో పాటు కూటమి దుస్థితిని వివరించే ప్రయత్నం చేశారు వర్మకు. అందుకే వర్మ స్వచ్ఛందంగా తప్పుకున్నట్లు ప్రకటించారు. ముగ్గురు నేతలతో టిడిపి కమిటీ వేయాలని సూచించారు. దానికి బద్ధుడు నై పని చేస్తానని లోకేష్ కు హామీ ఇచ్చారు. అందుకే వర్మను తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది టిడిపి హై కమాండ్.
* తగ్గనున్న యాక్టివ్..
పిఠాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఉంటుంది అంతే. కానీ యాక్టివ్ గా ఉండదు. లేనిపోని ఇబ్బందులు తెచ్చిపెట్టే పరిస్థితి ఉండదు. వాస్తవానికి పిఠాపురంలో జనసేనకు సైతం ఐదుగురు నేతలతో కూడిన కమిటీ ఉంది. ఇప్పుడు టిడిపి మరో ముగ్గురితో కమిటీ ఏర్పాటు చేస్తుండడంతో.. ఈ మొత్తం ఎనిమిది మంది నేతలు కూటమి సమన్వయం చూస్తారు. జనసేనతో పాటు టిడిపి శ్రేణులకు ప్రాధాన్యమిస్తూ.. ఏకతాటి పైకి సాగేందుకు దోహదపడతారు. అయితే పిఠాపురం అంటేనే వర్మ ముందుగా గుర్తుకొస్తారు. అందులోనూ టిడిపి భావజాలం ఎక్కువ ఆయనలో. ఈ క్రమంలో టిడిపి ఇన్చార్జి పదవి నుంచి తొలగించేసరికి కొంచెం మనస్తాపానికి గురయ్యారు. అయితే ఆ విషయం తనకు ముందుగానే నాయకత్వం చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. అయితే లోకేష్ ఏదో బలమైన హామీ వర్మకు ఇచ్చారన్న ప్రచారం ఉంది. పిఠాపురం వదులుకుంటే రాజకీయంగా ఉన్నత పదవి ఇస్తామన్నదే ఆ హామీ సారాంశంగా తెలుస్తోంది. కానీ రాజకీయంగా వర్మ స్థిరంగా ఉంటేనే అది కూడా.. చూడాలి మరి ఏం జరుగుతుందో..