Xiaomi 17 Premium Smartphone 2026 Features: కొంతమంది ప్రీమియం ఫోన్లో మాత్రమే కొనుగోలు చేయాలని చూస్తారు. ఇందులో భాగంగా మార్కెట్లోకి వీరి కోసం ప్రత్యేకంగా కొన్ని కంపెనీలు ఆకట్టుకునే ఫీచర్లతో మొబైల్స్ వస్తుంటాయి. ప్రముఖ మొబైల్ కంపెనీ Xiaomi మధ్యతరగతి ప్రజల నుంచి ప్రీమియం ఫోన్లు కొనే వారిని ఆకర్షించేందుకు అన్ని రకాల మొబైల్స్ను మార్కెట్లోకి తీసుకువస్తుంది. ఇందులో భాగంగా 2026 సంవత్సరంలో ఫ్లాగ్ ఫిష్ మొబైల్ ను తీసుకువచ్చింది. ఇందులో కెమెరా, బ్యాటరీ పర్ఫామెన్స్ చూసి చాలామంది క్యూ కడుతున్నారు. ఇంతకీ దీని ధర ఎంత అంటే?
Xiaomi కంపెనీ నుంచి 17 మొబైల్ గురించి ఆసక్తిగా చర్చ సాగుతోంది. ఇందులో 6.3 అంగుళాల AMOLED డిస్ప్లే ఉండనుంది. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేస్తుంది. 1.5 K resolution తో ఉండే ఈ మొబైల్ HDR+తోపాటు డాల్ఫి విజన్ డిస్ప్లే కూడా చూడొచ్చు. ఇందులో ఆండ్రాయిడ్ 16 వెర్షన్ సాఫ్ట్వేర్ పొంగడంతో పాటు ఇది ఆరు సంవత్సరాల వరకు గ్యారెంటీని అందిస్తుంది. ఎలాంటి ఏఐ ఫీచర్లను కూడా సపోర్ట్ చేసే ఈ సాఫ్ట్వేర్ తో ఎన్నో రకాల ఉపయోగాలు పొందవచ్చు. అలాగే ఇందులో Qualcomm స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్ ఉండనుంది. 12gb రామ్ తోపాటు 256 జిబి స్టోరేజ్ ఉండడంతో కావాల్సిన ఫైల్స్ ను స్టోరేజ్ చేసుకునేందుకు అనుకూలంగా ఉంటుంది.
ప్రీమియం మొబైల్స్ లోఎక్కువగా కెమెరా గురించి ప్రత్యేకంగా ఆరా తీస్తారు. వీరికి అనుగుణంగా షియోమీ 17 మొబైల్ లో 50 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా ఉండనుంది. టెలిఫోటో కెమెరా 50 మెగా పిక్సెల్ తో పనిచేస్తుంది. 50 మెగాపిక్సల్ అల్ట్రావైడ్ సెన్సార్ తో ఉండనుంది. ఫ్రంట్ కెమెరాతో పాటు వీడియో కాలింగ్ కోసం కూడా 50 ఎంపీ కెమెరా ఉండనుంది. ఈ కెమెరా లతో ఖచ్చితమైన దృశ్యాన్ని మంచి ఆకర్షణీయమైన రంగులతో పొందవచ్చు. పగలు, రాత్రి అని తేడా లేకుండా ఎలాంటి వాతావరణంలో నైనా స్పష్టమైన ఇమేజ్ ను పొందవచ్చు.
ఇందులో బ్యాటరీ కెపాసిట్ మెరుగ ఉండనుంది. 6330 mAh బ్యాటరీ ఉండగా.. ఇది 100 W ఫాస్టెస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో పనిచేస్తుంది. ఈ చార్జర్ తో రోజు వారి వినియోగదారులకు అనుకూలంగా అవుతుంది. ఒకసారి చార్జింగ్ చేస్తే 19 గంటల 7 నిమిషాల వరకు వినియోగించుకోవచ్చు. అలాగే 4k వీడియో రికార్డింగ్ చేయడంతో బ్యాటరీ డౌన్ టైం కూడా తక్కువగానే ఉంటుంది. ప్రస్తుతం ఈ మొబైల్ ను రూ.89,999 తో విక్రయిస్తున్నారు. దీనిని అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.