Homeఅంతర్జాతీయంMarco Rubio India Visit: మార్కో రూబియోకి ’మోదీ మార్క్‌’ ట్రీట్‌మెంట్‌.. అమెరికాకు స్పష్టమైన సందేశం!

Marco Rubio India Visit: మార్కో రూబియోకి ’మోదీ మార్క్‌’ ట్రీట్‌మెంట్‌.. అమెరికాకు స్పష్టమైన సందేశం!

Marco Rubio India Visit: అగ్రరాజ్యం అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఇటీవలి నాలుగు రోజుల భారత్‌ పర్యటన దౌత్య ప్రపంచంలో చర్చనీయాంశమైంది. సాధారణ ప్రోటోకాల్‌తో ముడిపడిన ఈ సందర్భం రెండు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్తతలను, భారత్‌ స్వతంత్ర విదేశీ నీతిని ప్రతిబింబించేలా ఉంది.

పర్యటన ఇలా..
భారత్‌కు వచ్చిన రూబియో పర్యటన కోల్‌కతాలో మదర్‌ థెరిసా సంస్థ సందర్శనతో మొదలైంది. అక్కడ అమెరికా రాయబారి ఆహ్వానం మాత్రమే ఉండగా, భారత్‌ తరఫున ఉన్నత అధికారులు ఎవరూ లేకపోవడం గమనార్హం. తర్వాత ఆగ్రా, జైపూర్‌లో మధ్యాహ్నం సమయంలో కార్యక్రమాలు ఏర్పాటు చేయడం వల్ల ఎండ, వేడికి రూబియో ఎదుర్కొన్న అసౌకర్యాలు కూడా చర్చకు లోనయ్యాయి. ఢిల్లీలో జరిగిన కీలక సమావేశాలు మినహా, మొత్తం పర్యటనలో వీవీఐపీ స్థాయి స్వాగతం లేదా ప్రత్యేక ప్రోటోకాల్‌ కనిపించలేదు. తిరిగి వెళ్లేటప్పుడు కూడా మామూలు వీడ్కోలు మాత్రమే జరిగాయి. ఇది సాధారణ దౌత్య ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నా, సందర్భం కారణంగా ప్రత్యేక ఆసక్తి కలిగించింది.

ఎందుకు ఇలా..?
ఇటీవలి కాలంలో అమెరికా వైఖరి భారత్‌ను అసంతృప్తి చెందించిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భారత్‌ను ‘డెడ్‌ ఎకానమీ‘గా వర్ణించడం
ఇష్టానుసారం టారిఫ్‌లు విధించడం, ఆపరేషన్‌ సిందూర్‌ వంటి సందర్భాల్లో అమెరికా ధోరణి ఇవన్నీ భారత్‌ స్పందనకు నేపథ్యం అని చెప్పవచ్చు. భారత్‌ తన జాతీయ ప్రయోజనాలను, సార్వభౌమత్వాన్ని ఎంత మాత్రం రాజీ పడకుండా కాపాడుకుంటుందని ఈ పర్యటన ద్వారా పరోక్ష సందేశం వెళ్లింది. విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ రూబియోతో జరిగిన చర్చల్లో ఆయిల్‌ దిగుమతులు వంటి అంశాలపై గట్టి స్థానం తీసుకోవడం ఇందుకు ఉదాహరణ.

రూబియో లక్ష్యాలు ఇవీ..
రూబియో నవంబర్‌ మధ్యంతర ఎన్నికల ముందు ఏదైనా సాధించినట్లు చూపించుకోవాలని భావించి వచ్చారని కొందరు విశ్లేషిస్తున్నారు. అమెరికా దశాబ్దాలుగా ఏర్పాటు చేసిన భారత్‌–అమెరికా బంధాన్ని స్థిరీకరించడం, రష్యా–చైనా ప్రభావాన్ని ఎదుర్కోవడం అతని ముఖ్య లక్ష్యాలు. క్వాడ్‌ సమావేశాలు, ఇండో–పసిఫిక్‌ వ్యూహాలు ఇందులో భాగం. అయితే, జాయింట్‌ ప్రెస్‌ మీట్‌లో అమెరికాలోని జాత్యహంకార దాడులపై ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం లభించకపోవడం గమనార్హం. భారత్‌ ఏ దేశ ఒత్తిడికీ తలొగ్గదని, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటుందని ఈ సందర్భం ద్వారా స్పష్టమైంది.

దీర్ఘకాలిక పరిణామాలు..
ఈ పర్యటన భారత్‌ అభ్యుదయం, ఆత్మనిర్భరతను హైలైట్‌ చేసింది. అగ్రరాజ్యంతో సంబంధాలు మెరుగుపరచాలని అమెరికా కోరుకుంటున్నా, సమానత్వం ఆధారంగా మాత్రమే అది సాధ్యమవుతుందని భారత్‌ స్పష్టం చేసింది. ట్రంప్‌ పాలనలో ఏర్పడిన పగులను సరిదిద్దడానికి రూబియో ప్రయత్నాలు ఇంకా కొనసాగాల్సి ఉంది. భారత్‌ ఇప్పుడు ఆర్థిక, సైనిక, సాంకేతిక రంగాల్లో బలపడుతోంది. ఏ దేశానికీ ఆధారపడకుండా స్వతంత్ర విదేశీ విధానాన్ని అనుసరిస్తోంది. రూబియో పర్యటన ఈ వాస్తవాన్ని మరోసారి ధృవీకరించిన అవకాశం ఉంది.

దౌత్యం అనేది పరస్పర గౌరవం, సమానత్వం మీద ఆధారపడి ఉంటుంది. ’మోదీ మార్క్‌’ అని పిలవబడిన ఈ ట్రీట్‌మెంట్‌ భారత్‌ ఆత్మవిశ్వాసానికి నిదర్శనం. రెండు దేశాలు కూడా దీర్ఘకాలిక సహకారం కోసం ముందుకు సాగాలంటే పరస్పర ఆసక్తులను గౌరవించడం అనివార్యం.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version