Israel Attacks Iran Latest News: పశ్చిమాసియా మరోసారి అస్థిరతకు లోనవుతోంది. ఒకవైపు శాంతి చర్చలు అంటూనే అమెరికా ఇరాన్పై దాడులు చేస్తోంది. దీంతో ఇరాన్ కూడా అమెరికాకు అండగా నిలిచిన గల్ఫ్ దేశాలతోపాటు ఇజ్రాయెల్పై ప్రతీకార దాడులు చేస్తోంది. ఇరాన్ చేసిన దాడులకు స్పందనగా ఇజ్రాయెల్ బలమైన ప్రతీకార చర్యలు చేపట్టింది. టెహ్రాన్, ఇస్ఫహాన్, నజాఫాబాద్తో సహా ఇరాన్లోని ముఖ్య నగరాలపై క్రూయిజ్ మిస్సైల్స్ యుద్ధ విమానాలతో దాడులు జరిపినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్ వెల్లడించింది.
సీజ్ఫైర్ తర్వాత తొలి దాడి..
ఏప్రిల్ 8న అమలులోకి వచ్చిన యుద్ధవిరామం తర్వాత ఇది ఇరు దేశాల మధ్య జరిగిన మొదటి తీవ్రమైన సంఘర్షణ. ఇరాన్ ఇటీవల ఇజ్రాయెల్పై దాడి చేయడంతో ఈ పరిణామం వేగం పుంజుకుంది. ఇజ్రాయెల్ ఈ దాడులను తన భద్రతకు అనివార్య చర్యగా చూస్తోంది.
ట్రంప్ సూచనలు విస్మరించిన నెతన్యాహు..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ దాడికి ప్రతీకారం చేయవద్దని, అలా చేస్తే శాంతి చర్చలు ప్రమాదంలో పడతాయని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును స్పష్టంగా హెచ్చరించారు. అయినప్పటికీ నెతన్యాహు ప్రభుత్వం వెనక్కి తగ్గకుండా దాడులు కొనసాగించడం గమనార్హం. ఇది ఇజ్రాయెల్–అమెరికా మధ్య సమన్వయ లోపాన్ని బయటపెట్టింది.
ప్రాంతీయ భద్రతపై ప్రభావం..
ఇరాన్–ఇజ్రాయెల్ పరస్పర దాడులు ప్రాంతీయ భద్రతపై తీవ్రమైన ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఇరాన్ ఇప్పటికే బలహీన స్థితిలో ఉన్నప్పటికీ, తన మిత్రదేశాలు ద్వారా ప్రతీకారం చేసే సామర్థ్యం కలిగి ఉంది. దీంతో లెబనాన్, సిరియా, ఇరాక్ వంటి ప్రాంతాల్లో సంఘర్షణ వ్యాపించే ప్రమాదం ఏర్పడింది. నెతన్యాహు ప్రభుత్వం తన దేశ భద్రతను ప్రధాన ప్రాధాన్యతగా చూస్తూ, ఏ చిన్న బలహీనతను కూడా అనుమతించదని స్పష్టం చేస్తోంది. మరోవైపు ట్రంప్ శాంతి చర్చలు, ఒప్పందాల ద్వారా సమస్యను పరిష్కరించాలని భావిస్తున్నారు. ఈ రెండు వ్యూహాల మధ్య తీవ్రమైన అసమానత కనిపిస్తోంది.
ప్రస్తుత పరిస్థితి ఎంత త్వరగా అదుపులోకి వస్తుందనేది ఇప్పుడు కీలకం. ఒకవేళ ఇరు వైపులా మరిన్ని దాడులు జరిగితే, ఇప్పటికే జరిగిన ఫిబ్రవరి–ఏప్రిల్ యుద్ధం తర్వాత మళ్లీ పెద్ద ఎత్తున సంఘర్షణ రావచ్చు. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతుంది. రెండు దేశాలను సంయమనం పాటించాలని, చర్చల ద్వారా మార్గం వెతకాలని అంతర్జాతీయ సమాజం కోరుతోంది.
