Homeఅంతర్జాతీయంEngland grooming gangs case: ఇంగ్లాండ్ లో పాకిస్తాన్ జిహాది గ్రూమింగ్ గ్యాంగ్ అరాచకం.. ఏకంగా...

England grooming gangs case: ఇంగ్లాండ్ లో పాకిస్తాన్ జిహాది గ్రూమింగ్ గ్యాంగ్ అరాచకం.. ఏకంగా 1,25,000 మంది అమ్మాయిలు.. ఏం దారుణం రా ఇది..

England grooming gangs case: ఈ వార్త రాస్తున్నప్పుడు చాలా బాధగా ఉంది. కన్నీరు అదే పనిగా ఒలుకుతుంది. ఏం దారుణం ఇది.. ఏం దుర్మార్గం ఇది.. అసలు ప్రపంచంలో ఇలాంటి దుర్మార్గులను ఎందుకు బతకనివ్వాలి. అసలు వాళ్లకు బతికే అవకాశం ఎక్కడిది.. ఇంతటి ఉన్మాదానికి పాల్పడిన ఆ ముష్కరులను మనుషులను ఎందుకు పిలవాలి.. మనుషులుగా ఎందుకు చూడాలి.. కనిపిస్తే కాల్చి పారేయడం కాదు.. జైల్లో ఉంచి మూడు పూటలా మేపి.. దున్నపోతుల లాగా బలిసేలా చేయడం కాదు.. బతికి ఉండగానే నరకం చూపించాలి. ఎందుకు ఈ నేరం చేసాం రా అని అనుకునేలా చేయాలి.

ఇంగ్లాండ్ లో కొంతమంది అమ్మాయిలపై పాకిస్తాన్ జిహాదీ గ్యాంగ్ దారుణానికి పాల్పడుతోందని.. ఘోరాలకు ఒడిగడుతోందని చాలా కాలం క్రితమే ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ వ్యవహారాన్ని అత్యంత జాగ్రత్తగా దర్యాప్తు చేసింది అక్కడి ప్రభుత్వం. గడిచిన 40 సంవత్సరాలుగా తాగిస్తాను ముస్లిం గ్రూమింగ్ బృందాలు లక్షలాదిమంది బాలికలను ప్రలోభ పెట్టారు. వారికి మాయమాటలు చెప్పారు. ఎత్తుకెళ్లారు.. ఘోరానికి పాల్పడ్డారు. క్రూరంగా హింసించారు. చివరికి వారిని అమ్మేశారు. కొందరైతే పలమార్లు దారుణానికి పాల్పడి.. వారి మతాన్ని మార్పించారు. అయితే మొదట్లో బ్రిటిష్ అధికారులు దీనిని బయటికి రాకుండా జాగ్రత్త పడ్డారు. ఇది వెలుగులోకి వస్తే ఇంగ్లాండ్ పరువు పోతుందని భావించారు. కానీ ఇప్పుడు అసలు విషయం వెలుగులోకి రావడంతో ఇంగ్లాండులో పాకిస్తాన్ జిహాది గ్యాంగ్ ఎంత క్రూరమైందో.. దానివల్ల ఇంగ్లాండ్ ఏ స్థాయిలో ఇబ్బంది పడుతుందో బయటికి వచ్చింది. అయితే ఈ దారుణాలకు పాల్పడిన వారిలో దాదాపు 87 నుంచి 90% వరకు పాకిస్థానీ ముస్లిం పురుషులు ఉన్నారు. వీరు దాదాపు రెండు లక్షల 50 వేల మందికి పైగా శ్వేత జాతీయయులైన బాలికలపై దారుణాలకు పాల్పడ్డారు.

ఈ దారుణానికి సంబంధించి 20019 పేజీల విచారణ నివేదికను ఎంపీ రిఫర్డ్ లో అధ్యక్షతన.. ఇంకా కొంతమంది నాయకత్వంలో బయట పెట్టారు. వీరంతా కూడా కొంతకాలంగా స్వతంత్ర సంస్థ ఆధ్వర్యంలో విచారణ నిర్వహిస్తున్నారు. బాధితుల వాంగ్మూలాలు.. అంతర్గత సమాచారం ఆధారంగా ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. అయితే ఇలా దారుణానికి గురైన పిల్లల్లో చాలామంది గర్బంధాల్చారని.. ప్రసవించారని.. కొంతమంది బలవంతపు గర్భ స్రావాలకు గురయ్యారని.. చిత్రహింసలను ఎదుర్కొన్నారని.. బలవంతంగా మతమార్పిడి బారిన పడ్డారని.. జీవిత కాలంలో ఎంతకాలం తగ్గని మానసిక గాయాలకు గురయ్యారని తేలింది.. 2019లోనే దాదాపు 19 వేల మంది పిల్లలు ఈ దారుణాలకి గురయ్యారు.

తల్లిదండ్రులు లేని పిల్లలు.. ఒంటరి మహిళల వద్ద పెరుగుతున్న పిల్లలను.. ఎటువంటి ఆలనా పాలన లేని పిల్లలను లక్ష్యంగా చేసుకొని ఈ పాకిస్తానీ జీహా ది గ్యాంగ్ దారుణానికి పాల్పడినట్టు తెలుస్తోంది. యూకే లోని దాదాపు 50 శాతం ప్రాంతాలను ఈ పాకిస్తానీ జిహాది గ్యాంగ్ కవర్ చేసింది. అంతేకాదు పిల్లల్ని అక్రమంగా రవాణా చేయడం.. వారికి మత్తు పదార్థాలను అందించడం.. వారితో దారుణానికి పాల్పడుతున్నప్పుడు రికార్డు చేయడం.. ఆ వీడియోలను చూపించే బెదిరించడం.. వంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ నేరాలు దాదాపు 40 సంవత్సరాల కాలం నుంచి జరుగుతూనే ఉన్నాయి. దీనిపై యూకే ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో చూడాల్సి ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version