El Mencho Cartel Mexico: డ్రగ్స్ అక్రమ రవాణా విషయంలో అమెరికా, మెక్సికో మధ్య చాలాకాలంగా వైరం కొనసాగుతోంది. మెక్సికో నుంచి తమ దేశంలోకి డ్రగ్స్ సరఫరా అవుతున్నాయని, వాటిని వినియోగించి ప్రజలు చనిపోతున్నారని అమెరికా గుర్తించింది. అరికట్టేందుకు ఎన్ని ప్రయత్నా చేసినా.. అక్రమ రవాణా ఆగడం లేదు. తాజాగా ప్రపంచంలోనే పెద్ద గ్రడ్ సప్లయర్గా గుర్తింపు తెచ్చుకున్న ఎల్ మెంచోను అమెరికా మట్టుపెట్టింది. బతికి ఉన్నప్పుడు అమెరికాను వణికించిన ఎల్ మెంచో.. చనిపోయాక మెక్సికోను అతలాకుతలం చేస్తున్నాడు.
అతిపెద్ద డ్రగ్ కార్టెల్ యజమాని..
ప్రపంచంలోనే అతిపెద్ద డ్రగ్ కార్టెల్ సీజేఎనజీ నాయకుడు నెమెసియో ఓసెగ్వెరా సెర్వాంటెస్.. పలకడానికి కష్టంగా ఉన్నా అసలు పేరు ఇదే. కానీ అంతా ఎల్ మెంచోగా పిలుస్తారు. ఇతడిని అమెరికా మట్టుపెట్టింది. దీంతో మెక్సికలో అల్లర్లు చెలరేగాయి. పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. దీంతో అమెరికా, కెనడా, భారత్ కూడా తమ దేశ పౌరులను అప్రమత్తం చేశాయి. ఎల్ మెంచోపై అమెరికా 15 బిలియన్ డాలర్ల బహుమతి ప్రకటించింది. ఈ కరుడుగట్టిన స్మగ్లర్ చంపడంతో అతని ముఠా రోడ్లపైకి దిగి, బస్సులకు నిప్పు పెట్టడం చేశారు.
ఎల్ మెంచో జీవిత యాత్ర
1966లో జన్మించిన మెంచో 5వ తరగతిలో చదువు పూర్తి చేసి అవకాడో, గంజాయి ఫామ్లలో కాపలాగా పని చేశాడు. 18 ఏళ్ల వయసులో మెక్సికో నుంచి అమెరికాకు అక్రమ వలసలో డ్రగ్స్ స్మగ్లింగ్ మొదలుపెట్టాడు. పోలీసులకు పట్టుబడి 5 ఏళ్ల జైలు ఖైదు కాశాడు. విడుదలై పోలీసు శాఖలో చేరి సిస్టమ్ లూఫ్హోల్స్ తెలుసుకుని రాజీనామా చేసి ఇఒNఎ స్థాపించాడు.
కారై్టల్ సామ్రాజ్యం..
చైనా నుంచి రా మెటీరియల్ తెప్పించుకుని కొకైన్, హెరాయిన్, ఫెంటానిల్ అమ్మకాలు నడిపాడు. మెక్సికోలో కేజీకి 4 వేల డాలర్లు ధర అయిన ఫెంటానిల్ అమెరికాలో మిలియన్లు పొందింది. సమాంతర పాలన, హత్యలు, మనీ లాండరింగ్తో ప్రపంచంలోనే అతి శక్తివంతమైన కార్టెల్గా మారింది. అతని కొడుకు అమెరికన్ సిటిజన్గా 6 బిలియన్ డాలర్ల డ్రగ్స్ కేసులో జైలు శిక్ష పడ్డాడు.
మరణానంతర హింసాత్మకత
ఆపరేషన్లో మెంచో హెలికాప్టర్ను కిందపడేసి పోరాడాడు. అయితే మెక్సికో సైన్యం అతన్ని చంపేసింది. దీంతో సీజేఎన్జీ సభ్యులు 20 రాష్ట్రాల్లో అల్లర్లు చేశారు. హైవేలు మూసివేసి, వాహనాలకు ఆగ్ని, లూటెపాట్లు. అమెరికా, కెనడా, భారత్దేశాలు ట్రావెల్ అడ్వైజరీలు జారీ చేశాయి. మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షెయిన్బామ్ సైన్యాన్ని పొగడ్తలతోపాటు ప్రజలకు ప్రశాంతత సూచించారు.
ఎల్ చాపో, ఎల్ మాయోలా ముందు నాయకుల మరణాలు కార్టెల్లలో అంతర్గత కరువులకు దారితీశాయి. సీజేఎన్జీలో కూడా అధికార పోరు రభసా పెరిగే అవకాశం ఉంది. అమెరికా దీన్ని ఉగ్రవాద సంస్థగా ప్రకటించడంతో అంతర్జాతీయ ఒత్తిడి పెరుగుతుంది. మెక్సికో ప్రభుత్వం ఈ అవకాశాన్ని కార్టెల్ బలహీనతలను ఉపయోగించుకుని స్థిరపడాలని, కానీ హింస మరింత తీవ్రమైతే దేశ ఆర్థికం, పర్యాటకం దెబ్బతింటాయి.