మన దేశం చైనా నుంచి మొదలు పెడితే పాకిస్తాన్ దేశం వరకు సరిహద్దులు కలిగి ఉంది. మన దేశంతో సరిహద్దు పంచుకునే దేశాలేంటో చూద్దాం.
బంగ్లాదేశ్ఈ దేశంతో మనకు 4,096 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. ఈ సరిహద్దు పరిధిలో పశ్చిమబెంగాల్, అస్సాం, మిజోరాం, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాలు ఉన్నాయి.
మయన్మార్మన దేశానికి ఈశాన్యాన ఈ దేశం ఉంటుంది. 1,458 కిలోమీటర్ల సరిహద్దు రేఖ ఈ దేశంతో ఉంది.. ఈ దేశానికి సరిహద్దు పరిధిలో అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, మణిపూర్, నాగాలాండ్ వంటి రాష్ట్రాలు ఉన్నాయి.
నేపాల్హిమాలయ పర్వతాలకు దగ్గరగా ఉన్న దేశం ఇది. మన దేశం నేపాల్ తో 1,752 కిలోమీటర్ల సరిహద్దును కలిగి ఉంది. ఈ సరిహద్దు పరిధిలో పశ్చిమబెంగాల్, బీహార్, సిక్కిం, ఉత్తరాఖాండ్, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలు ఉన్నాయి.
చైనాచైనా దేశంతో మనకు 3,917 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. ఈ సరిహద్దు పరిధిలో జమ్ము కాశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఉత్తరాఖాండ్, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలు ఉన్నాయి.
భూటాన్ఈ దేశం తో మనకు 587 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. దీని పరిధిలో అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, అస్సాం, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు ఉన్నాయి.
పాకిస్తాన్పాకిస్తాన్ దేశంతో మనకు 3,310 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. ఈ సరిహద్దు పరిధిలో గుజరాత్, జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాలు ఉన్నాయి.
ఆఫ్ఘనిస్తాన్ఆఫ్ఘనిస్తాన్ దేశంతో మనకు 80 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. ఈ సరిహద్దు పరిధిలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం విస్తరించి ఉంది.