మొదటి రోజు శైలపుత్ర దేవీ : నవరాత్రిలో మొదటి రోజు శైలపుత్రి పేరుతో పూజిస్తారు. శైలపుత్రి పార్వతీ దేవి హిమాలయ భగవానుని కుమార్తె. శైలం అంటే పర్వతం కాబట్టి ఆమెను పర్వత పుత్రిక శైలపుత్రి అని అంటారు. ఎద్దు(నంది) మీద స్వారీ చేస్తూ త్రిశూలం, కమలాన్ని పట్టుకుని ఈరోజు దర్శనమిస్తుంది.

Images source: google

రెండో రోజు బ్రహ్మచారిణి దేవి : నవరాత్రుల్లో రెండవ రోజు బ్రహ్మచారిణి దేవికి పూజిస్తారు. ఈ రోజున భక్తులు ఎక్కువగా బ్రహ్మచారిని పూజిస్తారు. బ్రహ్మచారిణి పూజించడం వల్ల జ్ఞానం, కాఠిన్యాన్ని వస్తుందని నమ్ముతారు.

Images source: google

మూడవ రోజు చంద్రఘంట దేవత : నవరాత్రుల్లో మూడో రోజు చంద్రఘంట దేవిని పూజిస్తారు. చంద్రఖండ, చండికా, రాంచండి అనే పేర్లతో కూడా ఆమెను పిలుస్తారు. పది చేతులు, చేతుల్లో ఆయుధాలతో ఈమె దర్శనమిస్తుంది.

Images source: google

నాలుగో రోజు కూష్మాండ దేవత: దేవీ నవరాత్రుల్లో నాల్గవ రోజున భక్తులు కూష్మాండ దేవతను ప్రార్థిస్తారు. కూష్మాండ దేవి జీవితంలో చిరునవ్వును ఇస్తుందని నమ్ముతారు. ఈ దేవి సింహాన్ని అధిరోహించి ఎనిమిది చేతులతో   కనిపిస్తుంది.

Images source: google

ఐదో రోజు స్కందమాత దేవి  : నవరాత్రి ఐదో రోజున భక్తులు స్కందమాతను పూజిస్తారు. శివుడు, పార్వతి దేవి కుమారుడు అయిన కార్తికేయను స్కంద్ అని అంటారు. అలా దేవి రూపానికి పేరు వచ్చిందని ఆమె తల్లి ప్రేమను సూచిస్తుందని నమ్ముతారు.

Images source: google

ఆరవ రోజు కాత్యాయని దేవి : ఆరవ రోజు కాత్యాయనికి పూజ చేస్తారు. హిందూ గ్రంధాల ప్రకారం, బ్రహ్మ, విష్ణువు, శివుడు తమ శక్తులను కలిపి మహిషాసుర అనే రాక్షసుడిని చంపి కాత్యాయనిని సృష్టించారు. కాత్యాయని దేవిని మహిషాసురమర్దిని అంటారు.

Images source: google

ఏడవ రోజు కాళరాత్రి దేవత : నవరాత్రి ఏడవ రోజున కాళరాత్రిని భక్తులు పూజిస్తారు. ఆమె దుర్గాదేవి ఉగ్ర రూపం, గాడిదపై స్వారీ చేస్తూ కనిపిస్తుంది. శుంభ, నిశుంభ అనే రాక్షసులను చంపడానికి పార్వతీ దేవి తన బయటి బంగారు చర్మాన్ని తొలగిస్తుందని ఈమెనే కాళరాత్రి దేవి అని అంటారు.

Images source: google

ఎనిమిదో రోజు మహా గౌరీ దేవి: నవరాత్రులలో ఎనిమిదవ రోజున మహాగౌరీ దేవిని భక్తులు పూజిస్తారు. ఆమె చాలా ప్రకాశవంతంగా చంద్రునిలా కనిపిస్తుంది. స్వచ్ఛత, ప్రశాంతతను సూచిస్తుందని, భక్తుల కోరికలన్నింటినీ తీర్చగలదని నమ్ముతారు.

Images source: google

తొమ్మిదో రోజు సిద్ధిదాత్రి దేవి : నవరాత్రుల్లో తొమ్మిదవ రోజున భక్తులు సిద్ధిదాత్రిని పూజిస్తారు. దుర్గా తొమ్మిదవ రూపమైన సిద్ధిదాత్రి అతీంద్రియ శక్తులు కలిగినది. ధ్యాన సామర్థ్యం, తన భక్తులకు జ్ఞానాన్ని ప్రసాదిస్తుందని నమ్ముతారు.

Images source: google