పిల్లలకు మీరు ఇచ్చే ఆహారం వల్లనే వారి శరీరం ఎదుగుతుంది. అయితే కొందరు పిల్లలు తింటున్నారు అని ఇష్టం వచ్చిన ఆహార పదార్థాలను తినిపిస్తుంటారు.

Images source: google

అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి ఆరు నెలల పిల్లల వరకు వారికి ఎలాంటి ఆహారాలు ఇవ్వకుండా కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. ఈ పాల వల్ల శిశువు శరీరానికి అవసరమైన పోషకాలు లభిస్తాయి.

Images source: google

ఆ తర్వాత 6 నెలలకు తేలికపాటి ఆహారం ఇవ్వడం ప్రారంభించాలి. ఈ దశ ప్రారంభంలో సెమీ లిక్విడ్ ఫుడ్ ఇచ్చినా సరే వారు మాత్రం ఆహారాలు కొరకడానికి ఇష్టపడుతుంటారు.

Images source: google

ముఖ్యంగా ఆవు పాలు పిల్లలకు చాలా మంచివి. కానీ సంవత్సరం లోపు పిల్లలకు ఈ ఆవుపాలను ఇవ్వకూడదు.

Images source: google

ఎందుకంటే శరీర పోషణకు అవసరమైన ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి.. కాబట్టి ఆవు పాలను పిల్లలు జీర్ణించుకోలేరు. ఫలితంగా పిల్లలకు కడుపు ఉబ్బడం, కడుపు నొప్పి వంటి సమస్యలతో బాధ పడతారు.

Images source: google

తేనె:  సంవత్సరం కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలకు చాలా మంది తేనె కూడా ఇస్తుంటారు. కానీ నవజాత శిశువులకు తేనె ఇవ్వడం వల్ల ప్రయోజనాలు కాదు కదా నష్టమే అంటున్నారు నిపుణులు.

Images source: google

ఫలితంగా పిల్లలకు బోటులిజం వస్తుంది అంటున్నారు నిపుణులు. దీనివల్ల కండరాలు బలహీనపడతాయి. మలబద్ధకం సమస్యలు వస్తాయట.

Images source: google

విటమిన్ సి పండ్లు: విటమిన్ సి పుష్కలంగా ఉండే పుల్లని పండ్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.. కానీ పుల్లటి పండులో ఉండే విటమిన్ సి, సిట్రిక్ యాసిడ్ లు పిల్లలకు కడుపు నొప్పి సమస్యలను తెచ్చి పెడతాయి.   విరేచనాలు అవుతాయి..

Images source: google