ఈరోజుల్లో చాలామంది మద్యం తాగుతున్నారు. వయస్సు, జెండర్‌తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఆల్కహాల్ సేవిస్తున్నారు. కొందరు పార్టీలు ఉన్నప్పుడు ఏదో లిమిట్‌గా తాగుతుంటారు.

Images source: google

కానీ కొందరైతే సమయం సందర్భం లేకుండా ఎక్కువగా తాగుతుంటారు. దీనివల్ల అనారోగ్యం బారిన పడతారని తెలిసినా కూడా రోజు తాగుతుంటారు.

Images source: google

ముఖ్యంగా మధుమేహం ఉందని తెలిసినా కంట్రోల్ చేసుకోకుండా మద్యం తాగుతారు. అయితే డయాబెటిస్ ఉన్నవాళ్లు మద్యం తాగడం వల్ల అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయి.

Images source: google

డయాబెటిస్ ఉన్నవాళ్లు ఆహార విషయంలో తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. అయితే డయాబెటిస్ ఉన్నవాళ్లు మద్యం తాగవచ్చా.. తాగితే ఎలాంటి సమస్యలు వస్తాయి చూద్దాం.

Images source: google

డయాబెటిస్ ఉన్నవాళ్లు  మద్యం ఎక్కువగా సేవిస్తే వీళ్లలో కాళ్లు చేతులు తిమ్మిర్లు రావడం, మంటగా ఉండటం, ఏదో గుచ్చినట్లు నొప్పి రావడం వంటివి అన్ని జరుగుతాయి.

Images source: google

అలాగే నాడులు దెబ్బతినడంతో పాటు రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. దాదాపుగా 30 శాతం రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. అలాగే బాడీ బాగా డ్యామేజ్ అవుతుంది. కిడ్నీలు, లివర్‌ దెబ్బతింటాయి.

Images source: google

 డయాబెటిస్ ఉన్నవాళ్లు తాగడం వల్ల వాళ్లకు రిస్క్ ఎక్కువగా ఉంటుంది. రక్తపోటు అధికం అవుతుంది. టైప్ 1 డయాబెటిస్ ఉన్నవాళ్లు అయితే అస్సలు మందు తాగకూడదు. వాళ్లలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది

Images source: google

మధుమేహం ఉన్నవాళ్లు మద్యం తీసుకోవాల్సి వస్తే చాలా తక్కువగా మాత్రమే తీసుకోవాలి. అది కూడా మద్యం తాగిన వెంటనే భోజనం చేయాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Images source: google

మద్యం తాగిన తర్వాత తింటే రక్తంలో షుగర్ లెవెల్స్ కొంతవరకు కంట్రోల్‌లో ఉంటాయి. ఎక్కువగా మద్యం సేవించి పూర్తిగా తినకపోతే గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువగా పెరిగిపోతాయి. దీంతో హైపోగ్లైసీమియాకు దారితీస్తుంది

Images source: google