
Chiranjeevi: నేడు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. ఈ సందర్భంగా ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తమ జీవితంలో భాగమైన ముఖ్యమైన మహిళలను గుర్తు చేసుకుంటున్నారు. వారి త్యాగాలను, ఔన్నత్యాన్ని కొనియాడుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి సైతం ఉమెన్స్ డే బెస్ట్ విషెస్ తెలియజేశారు. ఈ మేరకు ఆయన ఒక ఎమోషనల్ నోట్ పంచుకున్నారు. ‘ప్రపంచ మహిళామణులందరికీ శుభాకాంక్షలు. వారి హక్కుల కోసం పోరాడిన పోరాడుతున్న మహిళలకు సెల్యూట్. మీరు భవిష్యత్ ఆశాకిరణాలు. వీరు నా జీవితాన్ని ప్రభావం చేసిన ఇద్దరు మహిళలు.. అని ట్వీట్ చేశారు. అమ్మ అంజనాదేవి, భార్య సురేఖలతో దిగిన ఫోటో పంచుకున్నారు.
జన్మనివ్వడమే కాకుండా మంచి నడవడిక నేర్పిన తల్లికి, తన ప్రయాణంలో తోడుగా ఉన్న భార్యకు చిరంజీవి ఎనలేని ప్రాధాన్యత ఇచ్చారు. అందుకే తనను మార్చిన మహిళలు అంటూ కీర్తించారు. తన సినిమాలకు మొదటి క్రిటిక్ భార్య సురేఖనే అని చిరంజీవి పలుమార్లు చెప్పారు. ఇక ఉమెన్స్ డే వేళ చిరంజీవి ట్వీట్ వైరల్ అవుతుంది.
మరోవైపు చిరంజీవి సక్సెస్ ఫుల్ కెరీర్ సాగిస్తున్నారు. యువరక్తం కథం తొక్కుతున్నా ఈయన తగ్గేదేలే అంటున్నారు. ఏడాదికి రెండు మూడు సినిమాలు విడుదల చేస్తూ సత్తా చాటుతున్నారు. చిరంజీవితో పాటు స్టార్డం అనుభవించిన హీరోలు నెమ్మదించారు. చిరంజీవి మాత్రం తన పరంపర కొనసాగిస్తున్నారు. ఆయన మార్కెట్ ఏమాత్రం చెక్కుచెదరలేదని, సరైన హిట్ పడితే బాక్సాఫీస్ గల్లంతే అని వాల్తేరు వీరయ్యతో నిరూపించాడు.

2023 సంక్రాంతి కానుకగా విడుదలైన వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. రెండు వందల కోట్లకు పైగా వసూళ్లతో నయా రికార్డ్స్ సెట్ చేసింది. దర్శకుడు బాబీ అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందించారు. రవితేజ కీలక రోల్ చేయగా.. శృతి హాసన్ హీరోయిన్ గా చేశారు. ప్రస్తుతం ఆయన భోళా శంకర్ చిత్రం చేస్తున్నారు. దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్నారు. వేదాళం రీమేక్ గా భోళా శంకర్ తెరకెక్కుతుంది. తమన్నా హీరోయిన్ కాగా కీర్తి సురేష్ చెల్లెలు పాత్ర చేస్తున్నారు.
https://twitter.com/KChiruTweets/status/1633367711999750144

