Puri Jagannadh- Charmi
Puri Jagannadh- Charmi: వేర్ ఈజ్ పుష్ప? అన్నట్లు… వేర్ ఈజ్ పూరి-ఛార్మి? అనే ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ బిజినెస్ పార్టనర్స్ ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. అటు సోషల్ మీడియాలో కానీ ఇటు పబ్లిక్ లో కానీ కనిపించడం లేదు. దీంతో వీరిద్దరూ ఏమారయ్యారనే చర్చ మొదలైంది. అభిమానులు వెతుకులాట మొదలెట్టారు. ఇదంతా లైగర్ ఎఫెక్టేనా..? అన్న ఆలోచనలో పడ్డారు. దర్శకుడు పూరి జగన్నాధ్ కి ఈ పరిస్థితి ఊహించనిది. ఆయనకు డై హార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. డైనమిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న పూరి జగన్నాధ్… సినిమాలంటే పడిచచ్చే ఆడియన్స్ ఉన్నారు.
టాలీవుడ్ ట్రెండ్ సెట్టర్స్ ఆయన ఒకరు. హీరోయిజానికి కొత్త మేనరిజం నేర్పిన డైరెక్టర్. జీవిత సత్యాలతో కూడిన ఆయన వన్ లైనర్స్ అద్భుతంగా ఉంటాయి. ఇడియట్, పోకిరి, బిజినెస్ మాన్ చిత్రాల్లో పూరి హీరోల పాత్రలను తీర్చిదిద్దిన తీరు కొత్తగా ఉంటుంది. పూరి జగన్నాధ్ సూపర్ టాలెంటెడ్ డైరెక్టర్ అండ్ రైటర్. అందులో ఎలాంటి సందేహం లేదు. ఒక దశకు వచ్చాక… ఆయన జల్సాలకు అలవాటు పడ్డారు. లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ తన క్రియేటివిటీని కోల్పోయారు.
పోకిరి విడుదలై దాదాపు 18 ఏళ్ళు అవుతుంది. ఇండస్ట్రీ రికార్డ్స్ తిరగరాసిన ఆ స్థాయి చిత్రం మరలా ఆయనకు పడలేదు. కొన్ని హిట్ చిత్రాలు తెరకెక్కించారు. అయితే పరాజయాలే ఎక్కువ. రెండు వారాల్లో స్క్రిప్ రాసి మూడు నెలల్లో పూరి సినిమా తీసేస్తాడు. అంత స్పీడ్. ఇస్మార్ట్ శంకర్ తో ఫార్మ్ లోకి వచ్చిన పూరి లైగర్ మూవీతో పాతాళంలోకి పడిపోయారు. ఆయన ఇమేజ్ ని లైగర్ భారీగా డామేజ్ చేసింది. పరాజయం అటుంచితే… బయ్యర్లతో గొడవలు, ఈడీ విచారణలతో వ్యవహారం రచ్చ రచ్చ అయ్యింది.
Puri Jagannadh- Charmi
కొన్ని నెలలుగా పూరి-ఛార్మి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆ మధ్య ముంబై ఎయిర్ పోర్ట్ లో కనిపించారు. మరలా వీరిద్దరూ మీడియా కంట్లో పడలేదు. ఛార్మి అయితే సోషల్ మీడియాకు పూర్తిగా దూరమయ్యారు. ఆమె చివరి ఇంస్టాగ్రామ్ పోస్ట్ గత ఏడాది సెప్టెంబర్లో చేశారు. పూరి మాత్రం… మ్యూసింగ్స్ చేస్తూ జనాలతో కొంచెం టచ్ లో ఉన్నారు. ఓ నెల రోజులుగా ఆయన అవి కూడా చేయడం లేదు. దీంతో పూరి-ఛార్మి ఏమయ్యారని ఫ్యాన్స్ వెతుకులాట మొదలెట్టారు.