Homeట్రెండింగ్ న్యూస్Milk Competition: మొదట 75 లీటర్లు.. ఇప్పుడు 82 లీటర్లు.. ఇది ఆవు కాదు పాల...

Milk Competition: మొదట 75 లీటర్లు.. ఇప్పుడు 82 లీటర్లు.. ఇది ఆవు కాదు పాల కేంద్రం

Milk Competition: ప్రస్తుతం పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో ఎవరి నోట విన్నా 82 లీటర్ల పాలు ఇచ్చే ఆవు గురించే చర్చ జరుగుతోంది. ఇటీవల లూథియానాలో జరిగిన పాలు పితికే పోటీలో ఈ ఆవు మొదటి బహుమతిని గెలుచుకుంది. ఆవు యజమాని హర్‌ప్రీత్‌కు ట్రాక్టర్ బహుమతిగా ఇచ్చారు. బహుమతి గెలుచుకున్న తర్వాత హర్‌ప్రీత్ ఆవు కంటే ఎక్కువగా చర్చల్లో నిలిచారు. హర్‌ప్రీత్ ఆవులలో ఒకటి ఎక్కువ పాలు ఇచ్చినందుకు మొదటి బహుమతిని గెలుచుకోవడం ఇదే మొదటిసారి కాదు. గత సంవత్సరం కూడా 2024లో హర్‌ప్రీత్ ఆవు 75 లీటర్ల పాలు ఇవ్వడం ద్వారా మొదటి బహుమతిని గెలుచుకుంది.

వరుసగా రెండుసార్లు మొదటి బహుమతి గెలుచుకుంది. ఇప్పుడు ప్రజలు కూడా అది హర్‌ప్రీత్ ఆవునా లేక పాల కేంద్రమా అని సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి ఆవు ఒక్కటి ఉంటే చాలు రైతులు లక్షాధికారులు కావడం ఖాయమని అంటున్నారు. పంజాబ్‌లోని మోగాలోని నూర్‌పూర్ హకీమ్ గ్రామానికి చెందిన హర్‌ప్రీత్ గత 27 సంవత్సరాలుగా పాడి పరిశ్రమను నిర్వహిస్తున్నారు. ఆవులు ఎక్కువ పాలు ఇవ్వడానికి కారణం తాను డైరీ ఫామ్‌ను నిర్వహించే విభిన్న విధానమని హర్‌ప్రీత్ చెప్పాడు.

హరిప్రీత్ మీడియాతో మాట్లాడుతూ.. తన వద్ద ప్రస్తుతం 250 ఆవులు ఉన్నాయని చెప్పాడు. వీటిలో దాదాపు 150 పాలు ఇస్తున్నాయి. చాలా ఆవుల పాల ఉత్పత్తి ఇలాగే ఉంటుంది. ఆవులు ఎక్కువ పాలు ఇవ్వడం వెనుక ఒకే కారణం లేదు. ఇందులో విదేశీ నమూనాను స్వీకరించానని తెలిపాడు. ఆవులను ఎప్పుడూ ఓపెన్ గా ఉంచాలన్నారు. ఆవులు పొలంలో ఇక్కడ, అక్కడ స్వేచ్ఛగా తిరుగుతాయి. ఈ కాలంలో వాటికి మేత తినడం, నీరు త్రాగడంపై ఎటువంటి పరిమితి విధించకూడదన్నారు. ఉదయాన్నే ఆటోమేటిక్ వాహనం మేతను తినే ప్రదేశంలో ఉంచుతుంది. ఒక ఆవుకు దాదాపు 70 కిలోల మేత వేస్తారు. ఇందులో సాయంత్రం నాటికి ఒకటి నుండి రెండు శాతం మేత మాత్రమే మిగిలి ఉంటుంది. పశుగ్రాసం రోజంతా ఆవుల ముందు ఉంటుంది. వాటికి ఎప్పుడు నచ్చితే అప్పుడు తింటాయి. దాహం వేస్తే నీళ్లు తాగుతాయని తెలిపాడు.

ఇది మాత్రమే కాదు, ఆవులు తినడానికి విడివిడిగా పచ్చి మేత, పొడి మేత , కావాల్సిన మినిరల్స్ అందజేస్తామన్నారు. ఆవులకు యంత్రాల ద్వారా కలిపిన తర్వాత టోటల్ మిక్స్ రేషన్ (TMR) రూపంలో ఆహారం ఇస్తారు. ఏడాది పొడవునా పచ్చి మేతపై ఆధారపడమన్నారు. ఎక్కువగా మొక్కజొన్న సైలేజ్ ఉపయోగిస్తామని రైతు హరిప్రీత్ తెలిపాడు. ఆవులు స్వేచ్ఛగా తిరుగుతాయి కాబట్టి, అవి ఒత్తిడి లేకుండా ఉంటాయి. ఇది పాల ఉత్పత్తిని పెంచడమే కాకుండా, వ్యాధులను కూడా తగ్గిస్తుంది.మందుల ధర దాదాపుగా చాలా తక్కువగా ఉంటుందన్నారు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular