Homeట్రెండింగ్ న్యూస్Jharkhand Mother: చికెన్ లో విషం కలిపి చంపిన సవతి తల్లి.. దారుణ ...

Jharkhand Mother: చికెన్ లో విషం కలిపి చంపిన సవతి తల్లి.. దారుణ స్కెచ్

Jharkhand Mother: కంటేనే అమ్మ అని అంటే ఎలా అన్నారో సినీకవి. పిల్లల్ని కనకున్నా వారిలో దైవత్వాన్ని చూసే వారు చాలా మంది ఉంటారు. కనకపోయినా పిల్లల్ని ఎంతో ప్రేమతో చూసుకుంటారు. కన్న ప్రేమ కాకపోయినా పెంచిన ప్రేమకు కూడా ఎంతో ఆదరణ ఉంటుంది. సవతి తల్లి అయినా సరే కన్నతల్లి కంటే ఎక్కువగా చూసుకునే వారు ఎందరో ఉన్నారు. కానీ పిల్లలని చూడకుండా వారిని అకారణంగా చంపాలని భావించే వారు కూడా ఉండటం బాధాకరం. పిల్లల్లో దేవుడుంటారు అంటారు. కానీ వారినే తుదముట్టించే కసాయి తల్లి ఉదంతం విస్తు గొలుపుతోంది.

Jharkhand Mother
Jharkhand Mother

జార్ఖండ్ లోని సునీల్ సోరేన్ కు నలుగురు పిల్లలు. ఒక కుమార్తె ముగ్గురు కుమారులున్నారు. సజావుగా సాగుతున్న వారి సంసారంలో విధి ఆడిన నాటకంలో వారి జీవితాలు కకావికలం అయ్యాయి. సునీల్ భార్య పాముకాటుతో మరణించడంతో నలుగురు పిల్లలు తల్లిలేని వారయ్యారు. దీంతో వారి ఆలనాపాలన కష్టమైంది. దీంతో శ్రేయోభిలాషుల సూచన మేరకు మరో వివాహం చేసుకోవాలని భావించాడు. ఈ నేపథ్యంలో అతడు సునీత హన్సానీని రెండో వివాహం చేసుకున్నాడు. ఆమె వారిని కన్న తల్లిలా చూసుకుంటుందని అనుకుంటే అలా ప్రవర్తించలేదు.

వారిని సాకడం తన వల్ల కాదని తేల్చిచెప్పింది. దీంతో ఈ విషయంలో తరచు గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో సునీల్ కు బెంగుళూరులో ఉద్యోగం రావడంతో పిల్లల్ని చూసుకోవాలని చెబితే పట్టించుకోలేదు. దీంతో వారిని నానమ్మ దగ్గర ఉంచి అతడు బెంగుళూరు వెళ్లాడు. ఇటీవల దుర్గా దేవి జాతర ఉండటంతో సొంతూరుకు వచ్చిన సునీల్ తన పిల్లల్ని ఆప్యాయంగా చూసుకున్నాడు. దీంతో ఓర్వలేకపోయిన సునీత ఎలాగైనా పిల్లలను భర్తకు దూరం చేయాలని భావించింది. పిల్లలను సరిగా చూసుకుంటానని సునీల్ ను నమ్మించింది. దీంతో అతడు మళ్లీ బెంగుళూరు వెళ్లిపోయాడు.

Jharkhand Mother
Jharkhand Mother

ఇక పథకం అమలు చేయాలని ఆలోచించిన సునీత పిల్లలకు చికెన్ లో విషం కలిపింది. వారికి కొసరికొసరి తినిపించింది. దీంతో వారు అపస్మారక స్థితిలోకి వెళ్లారు. విషయం తెలుసుకున్న స్థానికులు వారిని ఆస్పత్రిలో చేర్పించారు. ఇందులో ఓ కుర్రాడు చనిపోగా విజయ్, శంకర్ అనే పిల్లల పరిస్థితి విషమంగా మారింది. వారు చనిపోయారనుకుని సునీత అక్కడి నుంచి పారిపోయింది. వెంటనే భర్త సునీల్ ఊరుకు చేరుకుని భార్య మీద పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు సునీతను అరెస్టు చేశారు.

పిల్లలకు తల్లి అవుతుందని అనుకుంటే కసాయి తల్లిలా మారి వారిపాలిట యమపాశంలా మారింది. పిల్లలను మంచిగా చూసుకుని ఎంతో ఆప్యాయంగా చూసుకోవాల్సిన వారిని మొగ్గలోనే తుంచాలని ఆశించింది. వారిని కడతేర్చాలని భావించడంతో వారి జీవితాలు మధ్యలోనే ముగిసిపోవడంతో తండ్రి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాడు.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

Cockroach Janata Party youth politics

Cockroach Janata Party : ఎగతాళి నుంచి పుట్టి.. ఎదురొడ్డి పోరాడి..

Cockroach Janata Party : ఇటీవలి కాలంలో భారత రాజకీయాల్లో ఒక కొత్త శక్తి ఆవిర్భవించింది. సంప్రదాయ పార్టీలను అధిగమించి ఇన్‌స్టాగ్రామ్‌లో రెండు కోట్ల మంది అనుచరులను సంపాదించుకున్న కాక్రోచ్‌ జనతా పార్టీ...
Today 26 February 2026 Horoscope

Today horoscope in telugu 27.7.2026 : ఈ నాలుగు రాశుల వారు అదృష్టవంతులు..

Today horoscope in telugu : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవారం ద్వాదశ రాశులపై పూర్వాషాడ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈ రోజు అనుకోకుండా ధన లాభం...

Cockroach Janata Party Funding : కాక్రోచ్ జనతా పార్టీకి ఫండ్.. “లెక్క” భారీగానే ఉందిగా..

Cockroach Janata Party Funding : కావలసినంత ఆహారం వచ్చింది. డ్రై ఫ్రూట్స్ ఊహించని విధంగా వచ్చాయి. మెడికల్ కిట్లు.. ఫాస్ట్ ఫుడ్.. డ్రింక్స్.. టెంట్లు.. రాళ్లు.. రప్పలు.. ఇవన్నీ ఆకాశరామన్న పంపించినట్టు...

Public Movement : ప్రధానుల తల వంచిన ప్రజా ఉద్యమాలు..

Public Movement : ప్రజా ఉద్యమాలు భారత దేశానికి కొత్తకాదు. మన స్వాతంత్య్రమే ప్రజా ఉద్యమాలతో సాధించుకున్నాం. స్వతంత్ర భారతదేశంలో ప్రజా ఉద్యమాలు ప్రభుత్వాలపై గణనీయమైన ప్రభావం చూపాయి. కొన్ని సందర్భాల్లో ప్రధానులు...
Narendra Modi

Narendra Modi : నాడు రైతులు.. నేడు విద్యార్థులు.. మోదీతో వెనకడుగు వేయించిన ఉద్యమాలు!

Narendra Modi : ప్రధాని నరేంద్రమోదీ.. వరుసగా మూడోసారి ప్రధాని అయ్యారు. ఇటీవలే పండిత్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును కూడా అధిగమించారు. అత్యధిక కాలం పాలించిన ప్రధానిగా చరిత్ర సృష్టించారు....
Oktelugu Epaper