Ram Charan : ‘చిరంజీవి గారు కన్నెర్ర చేస్తే ఎవరూ మిగలరు’ అంటూ రామ్ చరణ్ షాకింగ్ కామెంట్స్

Ram Charan : రీఎంట్రీ తర్వాత వరుసగా రెండు సార్లు వంద కోట్ల రూపాయిల షేర్ వచ్చే సినిమాలను చేసి నేటి తరం స్టార్ హీరోలకు ఊపిరి ఆడని రేంజ్ పోటీ ఇస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. ‘ఆచార్య’ , ‘గాడ్ ఫాదర్’ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ ఫెయిల్యూర్స్ గా మిగిలిలోపు అభిమానులు చాలా తీవ్ర స్థాయిలో నిరాశకి గురైన వేళ వాల్తేరు వీరయ్య అభిమానుల ఆకలి తీర్చింది.. ‘వాల్తేరు వీరయ్య’ విడుదలై అభిమానులను ఉర్రూతలూగించింది. నెగెటివ్ […]

Written By: NARESH, Updated On : January 28, 2023 10:02 pm
Follow us on

Ram Charan : రీఎంట్రీ తర్వాత వరుసగా రెండు సార్లు వంద కోట్ల రూపాయిల షేర్ వచ్చే సినిమాలను చేసి నేటి తరం స్టార్ హీరోలకు ఊపిరి ఆడని రేంజ్ పోటీ ఇస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. ‘ఆచార్య’ , ‘గాడ్ ఫాదర్’ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ ఫెయిల్యూర్స్ గా మిగిలిలోపు అభిమానులు చాలా తీవ్ర స్థాయిలో నిరాశకి గురైన వేళ వాల్తేరు వీరయ్య అభిమానుల ఆకలి తీర్చింది.. ‘వాల్తేరు వీరయ్య’ విడుదలై అభిమానులను ఉర్రూతలూగించింది.

నెగెటివ్ రివ్యూల ముఖాల మీద కొడుతూ వారి కుట్రలు అన్నిటినీ ఛేదించుకుంటూ ఈ సినిమా 130 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది.. ఈ సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన విజయోత్సవ వేడుకని వరంగల్ లో నిర్వహించారు.. ఈ ఈవెంట్ కి మూవీ యూనిట్ తో పాటుగా ముఖ్య అతిథిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వచ్చాడు.

ఈ సందర్భంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాట్లాడుతూ ‘ఈ సినిమా విడుదలైనప్పుడు నేను విదేశాల్లో ఉన్నాను..ఈ చిత్రానికి వచ్చిన టాక్ ని చూసి ఎప్పుడెప్పుడు ఇండియా కి వద్దామా.. సినిమా చూద్దామా అని ఉన్నాను.. ఈ సినిమా చూసిన తర్వాత బాబీ గురించి ఒకటి చెప్పాలి.. ఆయన ప్రతీ ఫ్రేమ్ అందంగా చెక్కినట్టు గా అనిపించింది.. సినిమా చూస్తున్నంత సేపు మా నాన్నని చూసినట్టు లేదు.. నా బ్రదర్ ని చూసినట్టుగా అనిపించింది.. ఇక రవితేజ గారి గురించి చెప్పుకోవాల్సి వస్తే మొట్టమొదటి సారి ఆయన చేత ఫుల్ లెంగ్త్ సీరియస్ రోల్ వేయించాడు బాబీ.. ఆయన పాత్ర అయిపోగానే ఎక్కడో నాకు ఇంకా సరిపోలేదు అనిపించింది.. వెంటనే నెట్ ఫ్లిక్స్ ఓపెన్ చేసి ధమాకా సినిమా చూసాను.. అందరూ అంటూ ఉంటారు చిరంజీవి గారు సౌమ్యులు అని.. ఆయన సౌమ్యంగా ఉంటేనే ఇంత మంది వచ్చారు.. ఒక్కసారి ఆయన కన్నెర్ర చేస్తే ఆయన మీద కామెంట్స్ చేసేవాళ్ళు ఎవ్వరు మిగలరు’ అంటూ రామ్ చరణ్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.