spot_img
Homeఎంటర్టైన్మెంట్Kaikala Satyanarayana- Chiranjeevi: నటుడే కాదు.. నిర్మాతగానూ కైకాల తోపే.. చిరంజీవితో ఆ అనుబంధం

Kaikala Satyanarayana- Chiranjeevi: నటుడే కాదు.. నిర్మాతగానూ కైకాల తోపే.. చిరంజీవితో ఆ అనుబంధం

Kaikala Satyanarayana- Chiranjeevi: ఉమ్మడి కృష్ణాజిల్లా కౌతవరంలో పుట్టిన అతడికి సినిమాలే ప్రాణం.. కాలేజీ రోజుల్లోనూ నాటకాలు అంటే పిచ్చి. ఆ నాటకాల కోసం సైకిల్ వేసుకొని ఎన్ని కిలోమీటర్లు తిరిగాడో లెక్కేలేదు. అలాంటి కైకాల సత్యనారాయణ “సిపాయి కూతురు” అనే సినిమా ద్వారా సినీ పరిశ్రమలోకి ఆరంగేట్రం చేశారు. అప్పటినుంచి తన చివరి చిత్రం మహర్షి దాకా ఎప్పుడు కూడా వెను తిరిగి చూసుకోలేదు. అవకాశాల కోసం ఎవరి వెంటా పడలేదు. చేసిన ప్రతి పాత్రకు ప్రాణ ప్రతిష్ట చేశారు. విలక్షణ నటుడిగా పేరుపొందారు.. అంతేకాదు ఎంతోమందికి చేతికి ఎముకే లేదు అన్నట్టుగా సహాయం చేశారు. ఆ చేసిన సహాయాన్ని కూడా ఎక్కడా చెప్పుకోలేదు.

Kaikala Satyanarayana- Chiranjeevi
Kaikala Satyanarayana- Chiranjeevi

నిర్మాతగానూ

ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన కైకాల సత్యనారాయణకు సినిమాలు తప్ప మరో లోకం లేదు. ఆ సినిమాల ద్వారా సంపాదించిన డబ్బులు అందులోనే పెట్టుబడిగా పెట్టారు. ఎంతోమంది కొత్త వాళ్లకు అవకాశాలు కల్పించారు. టెక్నీషియన్లకు కొత్త జీవితాన్ని ఇచ్చారు.. కైకాల సత్యనారాయణ సినిమా పరిశ్రమకు ఎంతోమంది కొత్త వాళ్లను పరిచయం చేశారు. ఇక ఆయన ఎన్టీఆర్, ఏఎన్ఆర్ , కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవి, బాలకృష్ణతో సినిమాలను నిర్మించారు. ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేసిన “గజదొంగ” అనే సినిమాను చలసాని గోపి తో కలిసి నిర్మించారు. ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ పోషించిన పలు చిత్రాల్లో ఆయనకు డూప్ గా సత్యనారాయణ నటించారు.. అందుకే కాబోలు ఎన్టీఆర్ తో తాను నిర్మించిన “గజదొంగ” చిత్రాన్ని రామారావు ద్విపాత్రాభినయంతో తెరకెక్కించారు.. రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన సినిమా అప్పట్లో ఘనవిజయం సాధించింది. అంతేకాదు ఏఎన్ఆర్ హీరోగా దాసరి నారాయణరావు దర్శకత్వంలో సత్యనారాయణ, తమ్ముడు కైకాల నాగేశ్వరరావు నిర్మాతగా “బంగారు కుటుంబం” అనే చిత్రం నిర్మించారు. ఆ సినిమా కూడా భారీ విజయాన్ని సాధించింది. 1994లో ఉత్తమ చిత్రంగా బంగారు నంది పురస్కారాన్ని అందుకుంది.. వాస్తవానికి కైకాల సత్యనారాయణ కృష్ణ నటించిన “మామా అల్లుళ్ళ సవాల్ ” అనే సినిమాతో నిర్మాతగా మారారు. రమా ఫిలిమ్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రానికి కె ఎస్ ఆర్ దాస్ దర్శకుడు. శ్రీదేవి కథానాయికగా నటించిన ఈ చిత్రం అప్పట్లో జనాదరణ చూరగొన్నది. తర్వాత కృష్ణ, శోభన్ బాబు హీరోలుగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో “ఇద్దరు దొంగలు” అనే చిత్రం నిర్మించారు. 1984లో సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా ఘన విజయం సాధించింది.. 1986లో శోభన్ బాబు హీరోగా కే మురళీమోహన్ రావు దర్శకత్వంలో “అడవి రాజా” అనే చిత్రం నిర్మించారు.. ఈ సినిమా ఒక మోస్తరుగా ఆడింది.

Kaikala Satyanarayana- Chiranjeevi:
Kaikala Satyanarayana- Chiranjeevi:

చిరంజీవితో బాండింగ్

కారణాలు తెలియదు కానీ కైకాల సత్యనారాయణ చిరంజీవితో చాలా అన్యోన్యంగా ఉండేవారు.. ఆ చనువుతోనే చిరంజీవి హీరోగా “కొదమసింహం” అనే కౌబాయ్ సినిమాను నిర్మించారు. మురళీమోహన్ రావు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. హిందీలో ప్రాణ్ పోషించిన అనేక పాత్రల్లో తెలుగులో సత్యనారాయణ నటించారు. నిప్పులాంటిమనిషి, యుగంధర్, నా పేరే భగవాన్ వంటి సినిమాలలో ప్రాణ్ పోషించిన పాత్రలను తెలుగులో నటించి సత్యనారాయణ మెప్పించారు. అందువల్ల ప్రాణ్ అంటే సత్యనారాయణకు వల్లమాలిన అభిమానం. పలు సందర్భాల్లో ప్రాణ్ ను సత్యనారాయణ సన్మానించారు.. ఇక బాలకృష్ణ హీరోగా కోదండరామిరెడ్డి దర్శకత్వంలో “ముద్దుల మొగుడు” అనే చిత్రం నిర్మించారు..అంతేకాదు చిరంజీవితో “కొదమ సింహం” కంటే ముందు చిరంజీవి పేరుతో ఒక చిత్రాన్ని నిర్మించారు.. ఇలా సినిమాల ద్వారా తన సంపాదించిన డబ్బును సినిమాలోని పెట్టుబడిగా పెట్టారు. ఎంతోమందికి ఉపాధి చూపారు. కైకాల సత్యనారాయణ ద్వారా ఉపాధి పొందిన వారంతా నేడు ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Donald Trump

Donald Trump: యుద్ధాల్లో సైనిక మరణం వివరాలు ప్రకటించిన ట్రంప్.. అధ్యక్షుడి పోస్ట్ పై చర్చ!

Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ యుద్ధాల్లో సైనికుల మరణం పై తాజాగా ఒక పోస్ట్ చేశారు. తన సొంత సోషల్ మీడియా ట్రూత్ చేసిన ఈ పోస్టులో ఆఫ్గాన్...
David Warner

David Warner: మద్యం తాగి దొరికిన ప్రముఖ క్రికెటర్.. 9 నెలల జైలు శిక్ష

David Warner: క్రికెట్ అనేది జెంటిల్మెన్ గేమ్. ఆ క్రీడ ఆడేవాళ్లు జెంటిల్మెన్ల మాదిరిగానే వ్యవహరించాలి. అలా కాకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే పరువు పోతుంది. పైగా క్రికెటర్లను డెమి గాడ్స్ లాగా...
Jagan Mohan Reddy

Jagan Mohan Reddy: జగన్ ఇది తగునా?!.. రగిలిపోతున్న సీనియర్!

Jagan Mohan Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విచిత్ర పరిస్థితి కొనసాగుతోంది. ఆ పార్టీలో నేతలకు ప్రాధాన్యం ఇవ్వడంలో హైకమాండ్ వ్యవహరిస్తున్న తీరు చర్చకు దారితీస్తోంది. ప్రధానంగా వివిధ కేసుల్లో చిక్కుకున్న వారికి...
Chandrababu And Lokesh

Chandrababu And Lokesh: లోకేష్ విషయంలో చంద్రబాబు సంచలన నిర్ణయం

Chandrababu And Lokesh: తెలంగాణలో తెలుగుదేశం పార్టీపై చంద్రబాబు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అక్కడ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీని యాక్టివ్ చేసేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల నాటికి అక్కడ...
Suvendu Adhikari

Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసలపై సువేందు ఉక్కుపాదం..

Suvendu Adhikari:   గత 45 సంవత్సరాలుగా పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసదారులకు ఆశ్రయం కల్పించడం, వారికి ఓటు హక్కు, గుర్తింపు పత్రాలు ఇవ్వడం వంటి విధానాలు అమలులో ఉన్నాయని వివరణలు ఉన్నాయి. ఈ...
Oktelugu Epaper