Kiran Abbavaram: ఈమధ్య కాలం లో ఇండస్ట్రీ కి వచ్చిన కొత్త హీరోలలో తక్కువ సమయం లోనే యూత్ ఆడియన్స్ కి బాగా దగ్గరైన హీరో కిరణ్ అబ్బవరం.’రాజావారు రాణివారు’ అనే సినిమాతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన కిరణ్ అబ్బవరం, ఆ తర్వాత SR కల్యాణ మండపం అనే సినిమా ద్వారా కెరీర్ లో మొట్టమొదటి కమర్షియల్ సక్సెస్ ని అందుకున్నాడు.
ఆ తర్వాత సమ్మతమే మరియు వినరో భాగ్యము విష్ణు కథ వంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి.మధ్యలో రెండు మూడు డిజాస్టర్ ఫ్లాప్ సినిమాలు కూడా ఉన్నాయి, అవి ఈయన మార్కెట్ ని పెద్దగా దెబ్బ తియ్యలేదు కానీ, గత కొద్దీ రోజుల క్రితం విడుదలైన ‘మీటర్’ సినిమా మాత్రం దారుణమైన ఫ్లాప్ గా నిలిచి కిరణ్ అబ్బవరం కెరీర్ ని రిస్క్ లో పడేసింది.
ట్రేడ్ పండితుల సమాచారం ప్రకారం ఈ సినిమాకి కనీసం 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు కూడా రాలేదట.మొదటి రోజు ఈ చిత్రానికి 26 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.రెండవ రోజు నుండి షేర్స్ రావడమే ఆగిపోయింది, దీనితో వచ్చిన ఆ 26 లక్షల్లో కూడా టాక్సులు మరియు థియేటర్స్ రెంట్స్ పోను నిర్మాతకి మిగిలింది గుండు సున్నా అట.
ఇది నిజంగా కిరణ్ అబ్బవరం కెరీర్ కి కోలుకోలేని దెబ్బ అని చెప్పొచ్చు.ఈ చిత్రం తర్వాత ఆయన శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ లో ‘రూల్స్ రంజన్’ అనే సినిమా చేస్తున్నాడు.ఈ చిత్రం తప్ప మరో సినిమా లేదు ఈ కుర్ర హీరో చేతిలో, కాబట్టి కచ్చితంగా ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాల్సిందే, లేకుంటే కిరణ్ అబ్బవరం కెరీర్ ఈ చిత్రం తోనే ముగిసిపోతుంది అంటున్నారు ట్రేడ్ పండితులు.