Homeఆంధ్రప్రదేశ్‌Jagan -KCR: ఆ విషయంలో రాజీ.. కేసీఆర్ ఒత్తిడికి తలొగ్గిన జగన్

Jagan -KCR: ఆ విషయంలో రాజీ.. కేసీఆర్ ఒత్తిడికి తలొగ్గిన జగన్

Jagan -KCR
Jagan -KCR

Jagan -KCR రాష్ట్ర విభజన జరిగి పదేళ్లవుతోంది. కానీ ఇరు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలు అలానే ఉండిపోయాయి. ఇప్పటికీ కొన్నిసంస్థల విభజన జరగలేదు. సరిహద్దు జల వివాదాలు నడుస్తున్నాయి. అయితే ఇరు రాష్ట్రాల సీఎంలు సన్నిహితంగా ఉంటున్నారు. కానీ సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు. రాజకీయంగా పరస్పర, వ్యక్తిగత ప్రయోజనాలకు పెద్దపీట వేసుకొని.. రాష్ట్ర ప్రయోజనాల విషయానికి వచ్చేసరికి మాత్రం రాజీ పడుతున్నారన్న అపవాదు ఇద్దరి సీఎంలపై పడింది. అటు రాజకీయంగా కేసీఆర్ తో స్నేహం వదులుకోలేక.. చాలా విషయాల్లో రాజీ ధోరణితో కేసీఆర్ కు, తెలంగాణకు జగన్ ఆయాచిత లబ్ధి చేకూర్చుతున్నారన్న టాక్ ఉంది. ఇప్పుడు ఓ కీలక ప్రాజెక్టు విషయంలో కూడా కేసీఆర్ ఒత్తిడికి జగన్ తలొగ్గడం చర్చనీయాంశంగా మారింది.

ఏపీకి జీవనాడి పోలవరం ప్రాజెక్ట్. ఏళ్లు గడుస్తున్నా ప్రాజెక్టు నిర్మాణం ఒక కొలిక్కి రాలేదు. రాష్ట్ర విభజన అనంతరం కేంద్ర ప్రభుత్వం పోలవరం నిర్మాణానికి అనుమతించింది. అంతేకాదు భవిష్యత్ లో తెలంగాణ నుంచి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను సైతం ఏపీలోనే కలిపింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో ఏడు మండలాల్లో వందలాది ఎకరాల భూములు నీట మునుగుతున్నాయని అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. రాష్ట్ర విభజనతో తెలంగాణ సర్కారు నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యే అవకాశముండడంతో ఆ మండలాలను ఏపీలో విలీనం చేసింది. దీంతో వివాదం అక్కడితో ముగుస్తుందనుకున్న తరుణంలో తెలంగాణ సర్కారు మాత్రం అభ్యంతరాలు వ్యక్తం చేస్తూనే ఉంది.

Jagan -KCR
Jagan -KCR

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో.. వరదల సమయంలో ఉమ్మడి ఏపీలో వేలాది ఎకరాల పంట భూములు మునిగిపోతున్నాయని తెలంగాణ వాదిస్తోంది. ఇదే అంశంపై న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించింది. పోలవరం నిర్మాణంతో జరుగుతున్న నష్టాన్ని అంచనా వేసేందుకు ఉమ్మడి సర్వే చేపట్టాలని డిమాండ్ చేస్తోంది. అప్పట్లో చంద్రబాబు సర్కారు దీనికి ఒప్పకోలేదు. గత మూడున్నరేళ్లుగా జగన్ ప్రభుత్వం సైతం పెద్దగా ఆసక్తి చూపలేదు. పోలవరం ప్రాజెక్టులో 150 అడుగుల నీరును స్టాక్ చేసే క్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వేలాది ఎకరాల పంట భూములు ముంపుబారిన పడుతున్నాయని సుప్రీం కోర్టులో పిటీషన్లు దాఖలు చేసింది. దానిపై విచారణ కొనసాగుతోంది.

జల వివాదాలను సామరస్యంగా పరిష్కరించాలని సుప్రీం కోర్టు కేంద్ర జల సంఘాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో గత నెల 25న పోలవరం బాధిత రాష్ట్రాలైన ఏపీ , తెలంగాణ, చత్తీస్ గడ్, ఒడిశా రాష్ట్రాల అధికారులతో కేంద్ర జల సంఘం ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. పోలవరం నష్టంపై ఉమ్మడి సర్వేకు ఏపీ అధికారులు అంగీకారం తెలిపినట్టు కేంద్ర జల సంఘం తాజాగా ప్రకటించింది. సుప్రిం కోర్టులో జరిగే తదుపరి విచారణలో దీనిపై పూర్తి క్లారిటీ రానుంది.

 

 

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

India vs Zimbabwe : ఆరు ఓటముల తర్వాత.. అయ్యర్ పొలంలో మొలకలు.. కానీ ఇది సరిపోదు..

India vs Zimbabwe : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలోను వైట్ వాష్.. బ్యాటింగ్ బలంగా లేదు. బౌలింగ్ గొప్పగా లేదు.. ఫీల్డింగ్ చెప్పుకొనే స్థాయిలో లేదు. ఆటగాళ్లు ఏమైనా...

Dharmendra Pradhan : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. నరేంద్ర మోడీ తదుపరి ఏం చేయబోతున్నారు..

Dharmendra Pradhan : సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రధాన్ రాజీనామా చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనలకు తలవంచి.. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ప్రధానమంత్రి నరేంద్ర...

Narendra Modi : కొత్త విద్యాశాఖ మంత్రి ఇతనే అనూహ్యంగా మోడీ మనస్సు ఇతడి మీదికే ఎందుకంటే..

Narendra Modi : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కొత్త విద్యాశాఖ మంత్రి ఎవరు అనే చర్చ మొదలైంది. వాస్తవానికి ధర్మేంద్ర రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న తర్వాత.. నరేంద్ర మోడీ వెంటనే...

Donald Trump : ఈయూ జరిమానాలపై కన్నెర్రజేసిన ట్రంప్‌.. అమెరికా కంపెనీల రక్షణకు చర్యలు!

Donald Trump : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఏడాది కాలంపాటు అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని తరలించడం, అమెరికా వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సరుకులపై...

Harish Rao : బిజెపిలోకి హరీష్ రావు.. కేటీఆర్ ఏమన్నారంటే..

Harish Rao : తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏదో ఒక సందర్భంలో మీడియాలో బలంగా ప్రచారానికి.. నాయకుల మధ్య చర్చకు కారణమయ్యే అంశం ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీలో హరీష్...
Oktelugu Epaper
Exit mobile version