spot_img
Homeఎంటర్టైన్మెంట్Balagam Actress Vijayalakshmi: కన్నీళ్లు పెట్టుకున్న ‘బలగం’ నటి.. ఆమె కన్నీటి కథ

Balagam Actress Vijayalakshmi: కన్నీళ్లు పెట్టుకున్న ‘బలగం’ నటి.. ఆమె కన్నీటి కథ

Balagam Actress Vijayalakshmi
Balagam Actress Vijayalakshmi

Balagam Actress Vijayalakshmi: సైలెంట్ గా వచ్చి సంచలనం సృష్టించిన బలగం గురించి ఇప్పుడు చర్చంతా. ఓ వైపు కామెడీతో నవ్విస్తూ అంతలోనే కన్నీళ్లు పెట్టిన ఈ సినిమా ఇప్పటికీ థియేటర్లలో రన్ కావడం మాములు విషయం కాదు. ఓటీటీలో రిలీజైనా థియేటర్లోకి వెళ్లి ఈ సినిమాను చూసేందుకు ఇష్టపడుతున్నారు. కమెడియన్ వేణు డైరెక్షన్లోవచ్చిన ‘బలగం’ మూవీలో ప్రతి పాత్ర కీలకంగానే ఉంటుంది. ఇందులో హీరో, హీరోయిన్లు ఉన్నా సైడ్ పాత్రల్లో నటించిన వారే హైలెట్ అయిన విషయం గుర్తించవచ్చు. ఇందులో భాగంగా కొమురయ్య చెల్లెలుగా పోశవ్వ పాత్రలో నటించిన విజయలక్ష్మి కూడా ప్రత్యేకంగా నిలుస్తారు. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయలక్ష్మి తన పర్సనల్ విషయాలను బయటపెట్టింది. తన రియల్ జీవితమంతా విషాదమయం నెలకొందని చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంది.

గత నెల 3న రిలీజైన ‘బలగం’ మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. కుటుంబ విలువలు, బాధ్యతలు తెలిపే ఈ సినిమా చూసి చాలా మంది అన్నదమ్ములు ఒక్కటయ్యారు. భారీ బడ్జెట్ తో వచ్చిన సినిమాలు వారం తిరగముందే థియేటర్ల నుంచి వెల్లిపోతున్నాయి. అలాంటిది ఈ మూవీ ఓటీటీలోరిలీజైనా థియేటర్లోచూసేందుకు జనం ఆసక్తి చూపుతున్నారు. ఈ సందర్భంగా సినిమాలోని ప్రతి పాత్ర గురించి చర్చలు పెట్టుకుంటున్నారు. బలగం సినిమాలో కొమురయ్య చెల్లెలు పాత్ర పోశవ్వ అందరినీ ఆకట్టుకుంటుంది. సూటిపోటి మాటలతో నిందిస్తూ కన్నీళ్లు తెప్పిస్తుంది.

Balagam Actress Vijayalakshmi
Balagam Actress Vijayalakshmi

అయితే ఆమె పర్సనల్ లైఫ్ మాత్రం విషాదంగా మిగిలింది. చిన్నప్పటి నుంచి నాటకాల్లో పాల్గొన్న విజయలక్ష్మికి సినిమాలపై ఆసక్తి ఉండేంది. కానీ ఇప్పటి వరకు సినిమాల్లో నటించే అవకాశం దొరకలేదు. ఎందుకంటే పెళ్లయిన కొన్నాళ్లకే భర్త చనిపోయాడు. ఆ తరువాత ఇద్దరు కొడుకులను పెంచే బాధ్యత విజయలక్ష్మినే తీసుకున్నారు. అలా పెంచి పెద్ద చేశాక ఇద్దరికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి. అయితే తన చిన్న కొడుకు రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఆ సమయంలో అతడి భార్య గర్భవతి. ఈ సంఘటనపై ఇప్పటికీ కోలుకోలేకపోతున్నానని ఆమె కన్నీళ్లు పెడతూ చెప్పింది.

ఇక విజయలక్ష్మికి నాటకాలు వేసిన సమయంలో ఎన్నో అవార్డులు వచ్చాయి. హరికథలు కూడా విజయలక్ష్మి చెప్పేవారు. అయితే ఆమె నటించిన మొదటి సినిమా బలగం నే కావడం విశేషం. వేణు డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ కోసం పనిచేస్తున్నప్పుడు ఎంతో ఉత్సాహాన్నిచ్చిందని ఆమె చెప్పారు. ఈ సినిమా నిర్మాణ సమయంలో ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడ్డారని, వారి కష్టానికి ఫలితమే నేటి విజయం అని విజయలక్ష్మి చెప్పారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

America Politics: అమెరికాకు యువ అధ్యక్షురాలు.. పోల్స్ తో ఈ 36 ఏళ్ల మహిళకే ఓటు

America Politics: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగి ఏడాదిన్నర అయింది. నాలుగేళ్లకోసారి ఎన్నికలు జరుగుతాయి. ఏడాదిన్నర క్రితం జరిగిన ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. అంతకుముందు జోబైడెన్‌ అధ్యక్షుడిగా...

Chiranjeevi: చిరంజీవి కెరియర్ లో చేసిన మూడు తప్పులు ఇవే…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి. ఒక సామాన్య మానవుడు సైతం సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఇక్కడ హీరోగా మారవచ్చు అని ప్రూవ్ చేసిన...

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ మూవీ రిలీజ్ పోస్ట్ పోన్ వెనక ఇన్ని కారణాలున్నాయి…

Vijay Deverakonda: 'అర్జున్ రెడ్డి' సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయిన నటుడు విజయ్ దేవరకొండ... ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా కేర్ ఫుల్ గా...

Ramayana Trailer Postponed: ‘రామాయన్ ‘ ట్రైలర్ విడుదల వాయిదా.. సంచలనం రేపుతున్న పోస్ట్..

Ramayana Trailer Postponed: బాలీవుడ్ లో నితీష్ తివారీ దర్శకత్వం లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'రామాయన్' మూవీ కి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని నేడు గ్రాండ్ గా విడుదల చెయ్యాలని...

Super El Nino: వచ్చే రోజుల్లో సూపర్ ఎల్ నినో.. తెలుగు రాష్ట్రాల్లో ప్రభావం ఎలా ఉంటుందంటే..

Super El Nino: సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది. గతంతో పోల్చి చూస్తే వాతావరణం మీద శాస్త్రవేత్తలకు అవగాహన మరింత పెరిగింది. అందువల్లే వర్షాలు.. ఎండలు.. కరువు కాటకాల గురించి అత్యంత స్పష్టంగా...
Oktelugu Epaper
Exit mobile version