spot_img
HomeతెలంగాణTeenmar Mallanna: తీన్మార్ మల్లన్నకే జై.. కాంగ్రెస్ కే ఎమ్మెల్సీ సీటు

Teenmar Mallanna: తీన్మార్ మల్లన్నకే జై.. కాంగ్రెస్ కే ఎమ్మెల్సీ సీటు

Teenmar Mallanna: వరంగల్‌–ఖమ్మం–నల్గొండ పట్టభద్రులు చేతి గుర్తుకు జైకొట్టారు. ఉప ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌ పార్టీ మద్దతు ఇచ్చిన చింతపండు నవీన్‌కుమార్‌(తీన్మార్‌ మల్లన్న) విజయం సాధించారు. సుదీర్ఘంగా సాగిన కౌంటింగ్‌లో ఎలిమినేషన్‌ ప్రక్రియ తర్వాత బీజేపీ బలపర్చిన ప్రేమేందర్‌రెడ్డికి వచ్చిన రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అనంతరం ఫలితం తేలింది. బీఆర్‌ఎస్‌ మద్దతుతో పోటీ చేసిన రాకేశ్‌రెడ్డి కన్నా తీన్మార్‌ మల్లన్నకు 14 వేలకుపైగా మెజారిటీ వచ్చింది. దీంతో శుక్రవారం అర్ధరాత్రి దాటాకా మల్లన్న గెలిచినట్లు రిటర్నింగ్‌ అధికారి ప్రకటించారు. ధ్రువీకరణ పత్రం అందించారు. గత నాలుగు పర్యాయాలు బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు విజయం సాధించిన ఈ స్థానాన్ని కాంగ్రెస్‌ పార్టీ హస్తగతం చేసుకుంది.

సుదీర్ఘ కౌంటింగ్‌..
పట్టభద్రులు ఎమ్మెల్సీ కౌంటింగ్‌ సుదీర్ఘంగా జరిగింది. బుధవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన లెక్కింపు శుక్రవారం అర్ధరాత్రి ముగిసింది. మూడు రోజులపాటు ఉత్కంఠగా సాగిన ఈ ప్రక్రియలో తొలి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు నుంచి ఎనలిమినేషన్‌ ప్రక్రియ వరకు మల్లన్నకు రాకేశ్‌రెడ్డి గట్టి పోటీ ఇచ్చారు. ఎలిమినేషన్‌ ప్రక్రియయలో రాకేశ్‌రెడ్డి, మల్లన్నకంటే సుమారు 4 వేల వరకు ఎక్కువ ఓట్లు సాధించినా.. అప్పటికే మొదటి ప్రాధాన్యంలో మల్లన్నకు 18 వేలపైచిలుకు ఆధిక్యం ఉండడంతో గెలుపు మల్లన్ననే వరించింది.

20 వేల ఓట్లలో కానరాని రెండో ప్రాధాన్యం
ఇదిలా ఉండగా స్వతంత్ర అభ్యర్థి, నాలుగో స్థానంలో ఓట్లు సాధించిన పాలకూరి అశోక్, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డికి కలిపి తొలి ప్రాధాన్య ఓట్లు 73,110 రాగా, వీటిలో సుమారు 20 వేల బ్యాలెట్‌ పత్రాల్లో ఆ ఓటర్లు రెండో ప్రాధాన్య ఓటు వేయలేదు. దీంతో ఈ ఇద్దరు అభ్యర్థుల రెండో ప్రాధాన్య ఓట్లు తనకే వస్తాయని ధీమాగా ఉన్న రాకేశ్‌రెడ్డి ఆమేరకు ఓట్లు కోల్పోయి.. ఓటమిని అంగీకరించారు.

నాలుగో ప్రయత్నంలో చట్ట సభకు..
ఇక తీన్మార్‌ మల్లన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం ఇది మూడోసారి. ఒకసారి శాసనసభకు కూడా పోటీ చేశారు. తొలిసారి 2015లో పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా, 2019లో హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యేగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2021లో మళ్లీ పట్టభద్రుల ఎన్నికల్లో రెండోసారి పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. తాజాగా ఉప ఎన్నికల్లో మూడోసారి బరిలో నిలిచి విజయం సాధించారు. మల్లన్న స్వగ్రామం యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం మాదాపూర్‌.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

Toli Ekadashi 2026: తొలి ఏకాదశి: ఉపవాసం ఉన్నవారు అన్నం, గోధుమల ఆహారం తినొచ్చా..

Toli Ekadashi 2026: హిందూ సాంప్రదాయం ప్రకారం ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంటుంది. ప్రతి నెలలో రెండు సార్లు వచ్చే ఏకాదశి ఏడాదిలో 24 సార్లు వస్తుంది. అయితే వీటిలో ఆషాడ మాసంలో...

Today 25 July 2026 Horoscope: ఈ నాలుగు రాశుల వారికి ఈరోజు నారాయణుడి ఆశీస్సులు.. పట్టిందల్లా బంగారమే..

Today 25 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశ రాశులపై జ్యేష్ఠ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా కొన్ని రాశుల వారికి అనుకోని ధన...

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Oktelugu Epaper
Exit mobile version