spot_img
HomeతెలంగాణHyderabad Formula E Race Case: క్వాష్‌.. స్మాష్‌.. ఫార్ములా ఈ రేస్‌ కేసులో...

Hyderabad Formula E Race Case: క్వాష్‌.. స్మాష్‌.. ఫార్ములా ఈ రేస్‌ కేసులో కేటీఆర్‌కు చుక్కెదురు.. నేడో రేపో అరెస్ట్‌!

Hyderabad Formula E Race Case: తెలంగాణలో గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న కల్వకుంట్ల తారక రామారావు(KTR) ఫార్ములా ఈ కార్‌ రేస్‌ నిర్వహించారు. ఇందుకోసం విదేశీ సంస్థలను రప్పించారు. దీంతో హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ పెరుగుతుందని భావించారు. కానీ, ఈ పేరుతో కేటీఆర్‌ గ్రీన్‌కో సంస్థకు రూ.56 కోట్లు ఎలాంటి అనుమతి లేకుండా చెల్లించారు. దీనికి సంబంధించి రిజర్వు బ్యాంకు తెలంగాణ ప్రభుత్వానికి రూ.8 కోట్ల జరిమానా విధించింది. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో విచారణ జరిపిన ప్రభుత్వం అవకతవకలు జరిగినట్లు గుర్తించి విచారణకు అనుమతించాలని గవర్నర్‌ను కోరింది. గవర్నర్‌ అనుమతి రాగానే ఏసీబీ డిసెంబర్‌ 17న ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. ఈ ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని కేటీఆర్‌ డిసెంబర్‌ 18న హైకోర్టును ఆశ్రయించారు.

పిటిషన్‌ కొట్టివేత..
కేటీఆర్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై మూడు దఫాలుగా హైకోర్టు(High Court) ధర్మాసనం విచారణ జరిపింది. ఏసీబీకి, ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తీర్పు వచ్చే వరకు అరెస్టు చేయకుండా ఊరట ఇచ్చింది. అయితే ఏసీబీ కూడా అరెస్టు చేయకుండా దాఖలు చేసిన పిటిషన్‌ కొట్టివేయాలని కోరింది. దీనిపై ఇరు పక్షాల వాదనలు విన్న జస్టిస్‌ లక్ష్మణ్‌ బెంచ్‌ తీర్పును డిసెంబర్‌ 31న రిజర్లు చేసింది. తాజాగా జనవరి 6న తీర్పు వెల్లడించింది. కేటీఆర్‌ దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ కొట్టివేస్తున్నట్లు వెల్లడించింది. తీర్పు వెల్లడిస్తున్న క్రమంలో కేటీఆర్‌ను అరెస్టు చేయకుండా ఉత్తర్వులు ఇవ్వాలని కేటీఆర్‌ తరఫున అడ్వకేట్‌ కోర్టును కోరగా, ఇలాంటి పిటిషన్లలో అవన్నీ కుదరవని స్పష్టం చేసింది. కేసు విషయంలో ఏసీబీ వాదనలనే సీరియస్గా పరిగణనలోకి తీసుకున్నట్లు కోర్టు తెలిపింది.

హోరాహోరీగా వాదనలు..
ఈ కేసులో కేటీఆర్‌ తరఫున ప్రభాకర్‌రావు వాదనలు వినిపించారు. కేటీఆర్‌పై 409 సెక్షన్‌ చెల్లదని వాదించారు. ఫార్ములా ఈరేస్‌ సందర్భంగా ఎలాంటి నిధుల దుర్వినియోగం జరగలేదని తెలిపారు. సొంత ప్రయోజనాల కోసం కేటీఆర్‌ డబ్బులు వాడుకోలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 409 సెక్షన్‌ అమలు చేస్తే దంగరగోళం నెలకొంటుందని పేర్కొన్నారు. దేశంలో ఏ మంత్రి కూడా ఫైళ్లపై సంతకాలు చేయరని తెలిపారు. ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జరరల్‌ బాల మోహన్‌రెడ్డి వాదనలు వినిపించారు. పూర్తి ఆధారాలతో కోర్టులో సమర్పించారు. నోట్‌ఫైళ్లు, ఇతర సాక్ష్యాధారాలు కోర్టు ముందు ఉంచారు. కేబినెట్‌లో చర్చించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు క్వాష్‌ పిటిషన్‌ కొట్టేసింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

SS Rajamouli

SS Rajamouli: వారణాసి బడ్జెట్ పెరగడం మీద స్పందించిన రాజమౌళి…

SS Rajamouli: మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'వారణాసి' సినిమా మీద ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలైతే ఉన్నాయి. మొదట 1000 కోట్ల బడ్జెట్ తో తీసేద్దాం అనుకోని ఈ సినిమాని...
Three Sisters Marry One Man

Three Sisters Marry One Man: ఒక యువకుడితో ముగ్గురు పెళ్లి చేసుకుందే కాక.. దారుణం.. ఇది ఊహించని...

Three Sisters Marry One Man: దేశవ్యాప్తంగా కొద్దిరోజులుగా నీట్ గురించి రచ్చ రచ్చ జరుగుతుంటే.. ముగ్గురు అక్కా చెల్లెళ్లు మాత్రం మీడియం మొత్తం తన వైపు తిప్పుకున్నారు. తమ గురించి మాట్లాడుకునే...
Balakrishna

Balakrishna: బాలయ్య ఈ ఇద్దరు లేకుండా సినిమా చేయడం లేదుగా…

Balakrishna: నందమూరి నటసింహం బాలయ్య బాబు చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. రీసెంట్ గా ఆయన చేసిన 'అఖండ 2' సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోయిన...
YSR Congress Party

YSR Congress: గోదావరి జిల్లాలో వైసీపీకి షాక్!

YSR Congress: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి సీనియర్ నేత ఒకరు గుడ్ బై చెప్పారు. పదేళ్లుగా పార్టీని బలోపేతం చేస్తున్న అతనిని కాదని వేరే వ్యక్తికి ప్రాధాన్యం...
YS Jagan

YS Jagan: జగన్ కు కేంద్ర పెద్దల అపాయింట్మెంట్!

YS Jagan: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పుంజుకునేందుకు ఆ పార్టీ చేయని ప్రయత్నం అంటూ లేదు. మరోవైపు పార్టీ నేతలకు కేసులు...
Oktelugu Epaper