HomeతెలంగాణCM Revanth Reddy: తెలంగాణ ప్రజలకు మరో గ్యారంటీ.. వీళ్లే అర్హులు

CM Revanth Reddy: తెలంగాణ ప్రజలకు మరో గ్యారంటీ.. వీళ్లే అర్హులు

CM Revanth Reddy: అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణ ప్రజలకు ఆరు గ్యారంటీ హామీలు ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో వాటిని అమలు చేస్తామని ప్రకటించింది. అధికారం చేపట్టి వంద రోజులు కావొస్తుండడంతో గ్యారంటీల అమలును వేగవంతం చేసింది. ఇప్పటికే ఆరోగ్యశ్రీ పరిమితి రూ.10 లక్షలకు పెంచారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణం కల్పించారు. మార్చి 1 నుంచి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500లకే సిలిండర్‌ అందించే హామీలు అమలు చేశారు. ఇక కీలకమైన మరో గ్యారంటీని మార్చి 11 నుంచి అమలు చేయాలని నిర్ణయించింది. ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని మార్చి 11న ప్రారంభిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలు, నిబంధనలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

మార్గదర్శకాలపై సమీక్ష
ఈనెల 11న ప్రారంభించే ఇందిరమ్మ ఇళ్ల పథకంపై సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీఎ సలహాదారు వేం నరేందర్‌రెడ్డితో మాట్లాడారు. అర్హులందరికీ లబ్ధి కలిగేలా విధి విధానాలు తయారు చేయాలని సూచించారు. పథకానికి సంబంధించిన మార్గదర్శకాలపై చర్చించారు. ప్రజా పాలనలో నమోదు చేసుకున్న అర్హులందరికీ ముందుగా ప్రాధాన్యమివ్వాలన్నారు. సీఎస్‌ శాంతికుమారి, ఆర్‌అండ్‌బీ మరఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

నియోజకవర్గానికి 3500 ఇళ్లు..
ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ముందుగా ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేయాలని సూచించారు. దశల వారీగా నిరుపేదల సొంత ఇంటి కల నెరవేరుస్తామన్నారు. ఇక ఇదే పథకంలో ఇంటి స్థలం ఉన్న వారికి అదే స్థలంలో ఇల్లు నిర్మిచునేలా రూ.5 లక్షలు ఇస్తామన్నారు. ఇక, ఇల్లు లేని పేదలకు స్థలం, ఇళ్లు నిర్మించుకునేందుకు ఆర్థికసాయం చేస్తామని తెలిపారు. నిధులు దుర్వినియోగం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు.

వివిధ ఇంటి నమూనాలు
ఇక ఇందిరమ్మ పథకంలో మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు కట్టుకునేవారికి ఉపయోగపడేలా వివిధ రకాల ఇంటి నమూనాలు, డిజైన్లను తయారు చేయించాలని సీఎం సూచించారు. లబ్ధిదారులు సొంత ఇంటిని తమకు నచ్చినట్లుగా కట్టుకున్నా అందులో టాయిలెట్, వంటగది కచ్చితంగా ఉండేలా చూడాలని సీఎం సూచించారు. ఇళ్ల నిర్మాణాను పర్యవేక్షించే బాధ్యతను కలెక్టర్ల ఆధ్వర్యంలో ఇంజినీరింగ్‌ విభాగానికి అప్పగించాలని తెలిపారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper