spot_img
HomeతెలంగాణGachibowli real estate offer: గచ్చిబౌలిలో 26 లక్షలకే ప్లాటు.. ఆలసించినా ఆశాభంగం!

Gachibowli real estate offer: గచ్చిబౌలిలో 26 లక్షలకే ప్లాటు.. ఆలసించినా ఆశాభంగం!

Gachibowli real estate offer: హైదరాబాద్ నగరంలో అత్యంత ఖరీదైన ప్రాంతాలుగా ఒకప్పుడు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ఉండేవి. ఇప్పుడు ఆ స్థానాన్ని గచ్చిబౌలి, మాదాపూర్, మణికొండ వంటి ప్రాంతాలు ఆక్రమించాయి. ఈ ప్రాంతాలలో చదరపు గజం ధర దాదాపు లక్షల్లో పలుకుతుంది. భారీగా డబ్బు చెల్లించి కొనుగోలు చేద్దామనుకున్నా స్థలాలు అమ్మేవారు లేరు.

హైదరాబాద్ నగరంలో అత్యంత ఖరీదైన గచ్చిబౌలి ప్రాంతంలో 26 లక్షలకే ప్లాటు లభిస్తోంది. చదువుతుంటే మీకు ఆశ్చర్యంగా అనిపించిన.. ఇది ముమ్మాటికి నిజం. హైదరాబాద్ నగరంలోని అత్యంత విలాసవంతమైన గచ్చిబౌలి ప్రాంతంలో దిగువ ఆదాయ వర్గాల కోసం హౌసింగ్ బోర్డ్ గృహ సముదాయాలను నిర్మించింది. ఇందులో నిర్మించిన ప్లాట్లను విక్రయించడానికి రంగం సిద్ధం చేసింది. తెలంగాణ హౌసింగ్ బోర్డ్ దిగువ ఆదాయ వర్గాల ప్రజలకు సొంత ఇంటి కలను నిజం చేయడానికి కృషి చేస్తోంది.

తెలంగాణ హౌసింగ్ బోర్డు గతంలో ప్రైవేట్ డెవలపర్ల సహాయంతో సంయుక్త విధానంలో వెంచర్లు నిర్మించింది. ఆ ప్రాజెక్ట్ లలో ప్రభుత్వం వాటాగా వచ్చిన ప్లాట్లను విక్రయించడానికి రాంకం సిద్ధం చేసింది. హైదరాబాదులోనే గచ్చిబౌలి లో మొత్తం 111 ప్లాట్లను విక్రయించడానికి తెలంగాణ హౌసింగ్ బోర్డ్ సన్నాహాలు చేస్తోంది. అల్ప ఆదాయ వర్గాల ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం.. ఉన్నచోట ఉన్నట్టు అనే విధానంలో ప్లాట్లను విక్రయించనుంది. అంతేకాదు టోకెన్ అడ్వాన్స్ చెల్లించిన దరఖాస్తుదారుల మధ్య అత్యంత పారదర్శకమైన విధానంలో లాటరీ తీసి.. ప్లాట్లను విక్రయించనుంది.

ప్రధాన ఐటి కారిడార్లు గా పేరుపొందిన హైటెక్ సిటీ, ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ సమీపంలో ఉన్న నేపథ్యంలో గచ్చిబౌలి లో భూములకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఇక్కడ మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, ఇన్ఫోసిస్ వంటి గ్లోబల్ కెపాసిటీ సెంటర్లు ఇక్కడ ఉన్నాయి. వీటిని క్రమంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఉద్యోగుల సంఖ్య పెరిగిపోతుంది. అందువల్ల ఇక్కడ స్థలాలతోపాటు, రెసిడెన్షియల్, కమర్షియల్ అవసరాలు ఇక్కడ పెరిగిపోయాయి.

గచ్చిబౌలి ప్రాంతంలో అపార్ట్మెంట్/ ప్లాట్లు, చదరపు అడుగు కు ధర దాదాపు పది నుంచి 12 వేల వరకు ఉంది. ఇక ప్రస్తుతం హౌసింగ్ బోర్డ్ ఆధ్వర్యంలో తీసే లాటరీ కి ఒక్కో ప్లాట్ ధర 26.4 లక్షల వరకు ఉంది. ఈ ధర నేపథ్యంలో ఒక్కో చదరపు అడుగుల plinth ఏరియా సుమారు 6000 వరకు అల్ప ఆదాయ వర్గాల వారికి అందుబాటులోకి వస్తుంది. దిగువ ఆదాయ వర్గం కింద దరఖాస్తుదారుల నెలవారి ఇన్కమ్ అర్హత నెలకు 50,000 వరకు మాత్రమే ఉండాలి. ప్లాట్ లకు సంబంధించిన ఈఎండి/ టోకెన్ అడ్వాన్స్ కింద లక్ష రూపాయలను రాష్ట్రంలోని ఏదైనా మీ సేవ కేంద్రంలో చెల్లించవచ్చు.

అడ్వాన్స్ చెల్లించడానికి జనవరి 3 చివరి తేదీ అని ప్రభుత్వం నిర్ణయించింది. ఆయా ప్లాట్లకు సంబంధించి జనవరి 6న ఉదయం 11 గంటలకు, మధ్యాహ్నం మూడు గంటలకు గచ్చిబౌలి ప్రాంతంలోని నిర్మిత్ కేంద్రాలలో లాటరీ తీస్తారు. ప్లాట్ దక్కించుకున్న వారు మొదటి 15 రోజుల్లో 25%, 60 రోజుల్లో 50%, 90 రోజుల్లో మిగతా 25 శాతం నగదు చెల్లించాలి. ఈ ప్లాట్లను పొందిన వ్యక్తులు ఐదు సంవత్సరాల వరకు వాటిని విక్రయించకూడదు. బదిలీ చేయకూడదు. లీజుకు కూడా ఇవ్వకూడదు. బ్యాంకు రుణం పొందడానికి మాత్రం అవకాశం ఉంటుంది . రాంకీ టవర్స్ పక్కన(ఏఐజి ఆసుపత్రి పక్కన) విక్రయానికి 40 ప్లాట్లు ఉన్నాయి. రాంకీ సీఈఓ క్వార్టర్స్ పక్కన 36 ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. వసంత ప్రాజెక్టు సమీపంలో 35 ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

Japan And US: జర్మనీ అణు రహస్యం జపాన్‌కు చేరకుండా అడ్డుకున్న అమెరికా.. లేదంటే ప్రపంచ పటమే మారిపోయేది!

Japan And US: ప్రపంచంలో ప్రస్తుతం అణ్వస్త్రాలు కలిగిన దేశాల్లో అమెరికా అగ్రస్థానంలో ఉంది. తర్వాత రష్యా, చైనా, భారత్‌ కూడా ఉన్నాయి. ఇక ఏ దేశం కూడా అణ్వాయుధాలు కలిగి ఉండకుండా...

Jana Nayagan Collection: ‘జన నాయగన్ ‘ 2 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇంత తక్కువ గ్రాస్...

Jana Nayagan Collection: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' ఎన్నో అడ్డంకులను ఎదురుకొని రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై ,...

Kajal Aggarwal: అతను ఎవ్వరూ లేని సమయం చూసి నా రూమ్ లోకి ప్రవేశించాడు అంటూ కాజల్ అగర్వాల్...

Kajal Aggarwal: సినీ ఇండస్ట్రీ లోకి రావాలని, సక్సెస్ అవ్వాలని ఎంతో మందికి ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిలు ఇండస్ట్రీ లోకి రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే అమ్మాయిల తల్లిదండ్రులు...

Nara Rohith: ‘ఆదర్శ కుటుంబం’ నుండి నారా రోహిత్ లుక్ విడుదల.. ఈ రేంజ్ లో ఉన్నాడేంటి..

Nara Rohith: 'సంక్రాంతికి వస్తున్నాం' వంటి భారీ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత , విక్టరీ వెంకటేష్ చేస్తున్న చిత్రం 'ఆదర్శ కుటుంబం'. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమా...

Dhruv Vikram: కోటి రూపాయిలు తీసుకొని మోసం చేసిన ధృవ్ విక్రమ్.. ఫిర్యాదు నమోదు.. పూర్తి వివరాలు మీకోసం..

Dhruv Vikram: గత కొద్దిరోజుల నుండి తమిళ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ పేరు సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో మారుమోగిపోతుంది. గత కొంతకాలం నుండి...
Oktelugu Epaper
Exit mobile version