హైదరాబాద్ మెట్రోఫిల్లర్లపై ఉన్న ప్రభుత్వ ప్రకటనలను తొలగించాలని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. శనివారం ఆయన పార్టీ నాయకులతో కలిసి ఎన్నికల కమిషనర్ పార్థసారధిని కలిశారు. అనంతరం బయటకు వచ్చిన ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు.ప్రభుత్వం ప్రజాధనంతో కట్టిన మరుగుదొడ్లపై కూడా టీఆర్ఎస్ ప్రచారం చేసుకోవడం సిగ్గు చేటన్నారు. అలాగే ఆర్టీసీ షెల్టర్లపై, పలుచోట్ల టీఆర్ఎస్ ప్రకటనలు తొలగించాలనీ ఈసీని కోరామని ఉత్తమ్ చెప్పారు.