హైదరాబాద్ శివారులో మంగళవారం సాయంత్రం కిడ్నాప్నకు గురైన డాక్టర్ హుస్సేన్ను పోలీసులు రక్షించారు. కిడ్నాపర్లు హుస్సేన్ను అనంతపురం జిల్లా మీదుగా బెంగుళూరుకు తీసుకెళ్తుండగా చెక్పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లాలోని రాప్తాడు సమీపంలో కిడ్నాపర్లు మంగళవారం పోలీసులకు చిక్కారు. వారి వద్ద నుంచి కత్తి, రివాల్వర్ను స్వాధీనం చేసుకున్నారు.