హబ్సిగూడలో ఉత్కంఠ: వెనకంజలో ఎమ్మెల్యే సతీమణి

గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లో మొత్తంగా టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధిస్తున్నారు. అయితే కీలకమైన డివిజన్లలో మాత్రం వెనుకంజలో వెళుతోంది. ఉప్పల్ నియోజకవర్గంలోని హబ్సగూడ పరిధిలో 8వ డివిజన్ నుంచి పోటీచేసిన ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి సతీమణి స్వప్న వెనుకంజలో ఉన్నారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి వెయ్యి ఓట్లతో ముందంజలో ఉన్నారు. ఇక ఖైరతాబాద్, సోమాజిగూడలో టీఆర్ఎస్, బీజేపీల మధ్య హోరాహోరీ ఫలితాలు వస్తున్నాయి. ఇప్పటి వరకు 6 స్థానాల్లో టీఆర్ఎస్, 15 స్థానాల్లో ఎంఐఎం, ఒక్కో […]

Written By: Suresh, Updated On : December 4, 2020 2:59 pm
Follow us on

గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లో మొత్తంగా టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధిస్తున్నారు. అయితే కీలకమైన డివిజన్లలో మాత్రం వెనుకంజలో వెళుతోంది. ఉప్పల్ నియోజకవర్గంలోని హబ్సగూడ పరిధిలో 8వ డివిజన్ నుంచి పోటీచేసిన ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి సతీమణి స్వప్న వెనుకంజలో ఉన్నారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి వెయ్యి ఓట్లతో ముందంజలో ఉన్నారు. ఇక ఖైరతాబాద్, సోమాజిగూడలో టీఆర్ఎస్, బీజేపీల మధ్య హోరాహోరీ ఫలితాలు వస్తున్నాయి. ఇప్పటి వరకు 6 స్థానాల్లో టీఆర్ఎస్, 15 స్థానాల్లో ఎంఐఎం, ఒక్కో స్థానంలో బీజేపీ, కాంగ్రెస్ గెలుపొందాయి. ఇక టీఆర్ఎస్ 70, 45 డివిజన్లలో ఎంఐఎం, 30 డివిజన్లలో బీజేపీ , 4 డివిజన్లలో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్నారు.