
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు సోమవారం ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. రెండో విడత రైతుబంధు సహాయం కోసం నిధుల పంపిణీ విడుదలపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పాల్గొననున్నారు. కరోనా కాలంలో రైతు బంధును విడుదల చేశారు. ఆ సమయంలో ప్రభుత్వానికి ఆదాయం రాకున్నా రైతుబంధు సాయాన్ని ఆపబోమని చెప్పారు. తాజాగా సోమవారం నిర్వహించే సమావేశంలో రైతుబంధుపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని అందరూ ఆసక్తి చూపిస్తున్నారు.