ప్లాట్లు, లేఅవుట్ల క్రమబద్ధీకరణ తెలంగాణ ప్రభుత్వం ప్రవేశఫెట్టిన (ఎల్ఆర్ఎన) గడువు నేటితో ముగియనుంది. అక్టోబర్ 15న గడువు ముగియగా ప్రభుత్వం 31వరకు గడువు పెంచింది. శుక్రవారం వరకు ఎల్ఆర్ఎస్కు 24,14,337లక్షల దరఖాస్తులు వచ్చాయి. మున్సిపాలిటీల్లో 10, 02, 235 ఉండగా కార్పొరేషన్లలో 3,94,719, గ్రామపంచాయతీల్లో 10, 17, 293 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. అయితే సర్వర్ డౌన్ తదితర కారణాలతో గడువు మరింత పెరిగే అవకాశం ఉందని పలువు అంటున్నారు. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.