
తెలంగాణలో రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ సోమవారం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 502 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే ముగ్గురు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కేసుల సంఖ్య 2,57,876 గా ఉంది. ఇక మరణాల సంఖ్య 1,407గా ఉన్నట్లు బులిటెన్లో పేర్కొంది. ఇక ఇప్పటి వరకు 2,42,084 మంది కోలుకోగా ప్రస్తుతం 14,385 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరిలో 11,948ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నారని ఆరోగ్యశాఖ తెలిరిపింది. కాగా 24 గంటల్లో 17,296 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.