Mitchell Marsh Run Out: ఐపీఎల్ లో పరుగుల వరద పారుతూ ఉంటుంది. బౌండరీ ల వర్షం కురుస్తూ ఉంటుంది. ప్లాట్ మైదానాలపై బ్యాటర్లు చెలరేగి ఆడుతుంటే అభిమానులు ఎగిరి గంతులు వేస్తారు. కొట్టు కొట్టు అంటూ బ్యాటర్లను ఎంకరేజ్ చేస్తూ ఉంటారు.
ఐపీఎల్ లో 20 ఓవర్లు మాత్రమే ఉంటాయి. స్వల్ప కాలంలో జరిగే ఈ మ్యాచ్లో భారీగా పరుగులు సాధించాలని ప్రతి ఆటగాడు అనుకుంటాడు. అందువల్లే ప్రారంభం నుంచి బౌలర్ల మీద బ్యాటర్లు ఎదురు దాడికి దిగుతుంటారు. ఫోర్ లను.. సిక్సర్ లను అలవోకగా కొడుతుంటారు. చూస్తుండగానే స్కోర్ బోర్డును రాకెట్ వేగంతో పరుగులు పెట్టిస్తుంటారు.. అందువల్లే ఐపిఎల్ లో పరుగుల ప్రవాహం జోరుగా సాగిపోతూ ఉంటుంది.
ఐపీఎల్ లో హాఫ్ సెంచరీలు మాత్రమే కాదు.. సెంచరీలు కూడా నమోదు అవుతుంటాయి. అయితే ఆటగాళ్లు వేగంగా ఆడే క్రమంలో.. తప్పులు చేస్తుంటారు. ముఖ్యంగా 90 పరుగుల వద్ద ఉన్నప్పుడు ప్లేయర్లు విపరీతమైన ఒత్తిడికి గురవుతూ ఉంటారు. 90 పరుగులు దాటిన తర్వాత ప్లేయర్ల మీద విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. సెంచరీ మార్క్ అందుకోవాలని తొందరలో బ్యాటర్లు వికెట్ చేజార్చుకుంటారు.
ఐపీఎల్ లో బ్యాటర్లు సెంచరీకి దగ్గరగా ఉన్నప్పుడు రన్ అవుట్ అయ్యి వెనక్కి వెళ్లడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. అలాంటిది మిచెల్ మార్ష్ రెండుసార్లు ఇలా ఔట్ అయ్యాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ (99vs DC), గేల్(96 vs KKR), మిచెల్ మార్ష్(96 vs RR), మునువిందర్ బిస్లా(92 vs CSK) ,మిచెల్ మార్ష్ (90 vs CSK) ఉన్నారు.. రాజస్థాన్ జట్టుకు చేరిన మ్యాచ్ లో లక్నో ఆటగాడు మార్ష్ రనౌట్ అయ్యాడు. 57 బంతుల్లో 11 ఫోర్లు, ఐదు సిక్సర్ల సహాయంతో 96 పరుగులు చేసిన మార్ష్.. జైస్వాల్ విసిరిన బంతికి రన్ అవుట్ అయ్యాడు. ఇతడు 168.42 స్ట్రైక్ రేటుతో ఈ పరుగులు చేశాడు. సెంచరీ కోల్పోయిన తర్వాత మార్ష్ నిరాశతో మైదానాన్ని వీడి వెళ్లిపోయాడు.
