Homeక్రీడలుక్రికెట్‌Rohit Sharma: BGT ట్రోఫీ ముగిసిన తర్వాత.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ షాకింగ్ నిర్ణయం..

Rohit Sharma: BGT ట్రోఫీ ముగిసిన తర్వాత.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ షాకింగ్ నిర్ణయం..

Rohit Sharma: న్యూజిలాండ్ సిరీస్ నుంచి మొదలుపెడితే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఇప్పటివరకు (పెర్త్ టెస్టు మినహా) రోహిత్ నాయకత్వంలో టీమిండియా వరుసగా వైఫల్యాలు ఎదుర్కొంటుంది.. ఆడిన 5 టెస్ట్ మ్యాచ్ లలో నాలుగు ఓటములను చవిచూసింది. కెప్టెన్ గానే కాకుండా.. ఆటగాడిగా కూడా రోహిత్ విఫలమవుతున్నాడు. బలమైన ఇన్నింగ్స్ ఆడటం లేదు. దీంతో టీమిండియా వరుస ఓటములను చవిచూస్తోంది. అంతేకాదు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ ముందు పరువు తీసుకుంటున్నది. న్యూజిలాండ్ సిరీస్ కంటే ముందు టీమిండియా ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్ సైకిల్లో నెంబర్ వన్ స్థానంలో ఉండేది. కానీ ఎప్పుడైతే న్యూజిలాండ్ సిరీస్ లో పడిపోయిందో.. అప్పుడే టీమిండియా పతనం మొదలైంది. పెర్త్ టెస్ట్ మినహా.. చెప్పుకోవడానికి టీమిండియా కు ఒక్క విజయం కూడా లేకపోవడంతో విమర్శలను ఎదుర్కొంటున్నది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ గత రెండు సీజన్లలో టీమిండియా ఫైనల్ వెళ్ళింది. తొలిసారి న్యూజిలాండ్ చేతిలో, మరోసారి ఆస్ట్రేలియా చేతిలో పరాభవాన్ని ఎదుర్కొంది. ఇప్పుడు మాత్రం దారుణమైన ఆటతీరుతో పరువు తీసుకుంటున్నది.

విమర్శల నేపథ్యంలో

టీమిండియా దారుణమైన ఆటతీరు ప్రదర్శిస్తున్న నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మ పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అతని ఆట తీరు పట్ల.. జట్టును నడిపిస్తున్న విధానం పట్ల ఆగ్రహావేశాలు చోటుచేసుకుంటున్నాయి. సీనియర్ క్రికెటర్లు ఇర్ఫాన్ పఠాన్, సునీల్ గవాస్కర్, రవి శాస్త్రి లాంటివాళ్ళు రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించడం మంచిదని చెబుతున్నారు. అతడు కెప్టెన్గా ఉండటం వల్లే అవకాశాలు లభిస్తున్నాయని.. సాధారణ ఆటగాడిగా ఉంటే మాత్రం ఎప్పుడో బయటికి వెళ్లిపోయేవాడని వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఈ క్రమంలో రోహిత్ కూడా కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ముగిసిన తర్వాత టెస్ట్ క్రికెట్ కు హిట్ మాన్ గుడ్ బై చెప్తాడని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే t20 లకు రోహిత్ శర్మ వీడ్కోలు పలికాడు.. ఇప్పుడు టీమ్ ఇండియాకు సిడ్ని టెస్ట్ లో విజయాన్ని అందించి.. టెస్ట్ క్రికెట్ కు స్వస్తి పలకాలని ఆలోచనలో రోహిత్ ఉన్నాడని సమాచారం. ఒకవేళ సిడ్ని టెస్ట్ లో టీమిండియా గెలిచి.. శ్రీలంక టూర్ లో ఆస్ట్రేలియా గనుక ఓడిపోతే.. టీమిండియాకు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ వెళ్లే అవకాశాలుంటాయి. అప్పుడు ఎలాగూ దక్షిణాఫ్రికా ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది కాబట్టి.. ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా ను ఓడించి.. టీమిండియా కు టెస్ట్ గదను అందించిన ఖ్యాతిని రోహిత్ శర్మ సొంతం చేసుకునే అవకాశం లేకపోలేదని జాతీయ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వీటిపై క్లారిటీ రావాలంటే కొంతకాలం వరకు ఎదురు చూడక తప్పదని స్పోర్ట్స్ వర్గాలు భావిస్తున్నాయి.

Bhaskar
Bhaskarhttps://oktelugu.com/
Bhaskar Katiki is the main admin of the website

Related News

Most Popular

Siddharth Emotional

Siddharth Emotional: స్టేజి పై వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన హీరో సిద్దార్థ్..వీడియో వైరల్..అసలు ఏమైందంటే!

Siddharth Emotional: ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో హీరో సిద్దార్థ్ కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు , కొంచెం ఇష్టం...
Google Employees Protest

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...
Sun Facts

Sun Facts: ఉదయం నిప్పులు చిమ్మే సూర్యుడు.. రాత్రిపూట ఎక్కడికి వెళ్తాడు..

Sun Facts: ఉదయం సూర్యోదయం అవుతుంది. కాలాలకు అనుగుణంగా సూర్యోదయంలో మార్పులు ఉంటాయి. వేసవికాలంలో అయితే సూర్యుడు తొందరగా ఉదయిస్తుంటాడు. చలికాలం లో అయితే కాస్త ఆలస్యంగా సూర్యోదయం అవుతూ ఉంటుంది. వర్షాకాలంలో...
Samsung Galaxy S26 FE

Samsung Galaxy S26 FE: శామ్‌సంగ్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ఈ రెండు త్వరలోనే మార్కెట్లోకి..

Samsung Galaxy S26 FE: ప్రముఖ టెక్ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్ మార్కెట్లోకి వస్తుందంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే ఆకర్షణీయమైన టాబ్లెట్ లను కూడా తీసుకువచ్చి...

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీ బలప్రదర్శన బలమా వాపా?

ఢిల్లీ వేదికగా జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ బలప్రదర్శన దేశ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ప్రారంభమైన ఈ ఉద్యమం, 23 రోజుల నిరాహార దీక్ష...
Oktelugu Epaper