Homeఆధ్యాత్మికంRashi Phalalu: ఈ రాశుల వారిపై కార్తీక పౌర్ణమి ప్రభావం.. 12 రాశుల వివరాలు ఎలా...

Rashi Phalalu: ఈ రాశుల వారిపై కార్తీక పౌర్ణమి ప్రభావం.. 12 రాశుల వివరాలు ఎలా ఉన్నాయంటే?

Rashi Phalalu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. నవంబర్ 27న సోమవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా ద్వాదశ రాశులపై కృత్తిక నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో మేషం, సింహంతో పాటు పలు రాశుల వారిపై ప్రభావం ఉండనున్నాయి. 12 రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం.

మేషరాశి:
కార్తీక పౌర్ణమి సందర్భంగా మేష రాశి వారు సంతోషంగా ఉంటాయి. ఆర్థికంగా మంచి ఫలితాలు ఉంటాయి. అయితే కొన్ని ఖర్చులను నియంత్రించాల్సి ఉంటుంది.

వృషభం:
కుటుంబ అవసరాలకు ఖర్చులు పెరుగుతాయి. ఆదాయం పెంచుకోవడం కోసం ప్రణాళికలు వేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

మిథునం:
కొన్ని పనుల విషయంలో వీరు కష్టపడాల్సి వస్తుంది. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. భగవంతుని దర్శనం కోసం తీర్థయాత్రలకు వెళ్తారు.

కర్కాటకం:
ఓ సమాచారం సంతోషాన్ని కలిగిస్తుంది. ఏదైనా సమస్య ఉంటే పరిష్కారం కనుగొంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.

సింహం:
సింహారాశి వారికి కార్తీక పౌర్ణమి ప్రభావం ఉంటుంది. ఈరోజు ఏ పని చేపట్టినా విజయం సాధిస్తారు. ఆర్థికంగా ప్రయోజనాలు ఉంటాయి. సలహాలు తీసుకోవడానికి ఇతరులను సంప్రదించాలి.

కన్య:
కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబంలో తండ్రి మార్గదర్శకంలో నడుస్తారు. చాలాకాలంగా పెండింగులో ఉన్న పనులు పూర్తవుతాయి.

తుల:
వ్యాపారులకు అనుకూలమైన రోజు పెట్టుబడులు పెడితే లాభాలు వస్తాయి. వివాహం చేసుకునేవారికి ప్రతిపాదనలు వస్తాయి. స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలి.

వృశ్చికం:
బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ప్రియమైన వారితో సంతోషంగా గడుపుతారు. సాయంత్రం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

ధనస్సు:
ఏ సమస్య వచ్చినా ఓపికతో పరిష్కరించుకోవాలి. ఎక్కువగా వాదనలకు దిగొద్దు. మహిళా ఉద్యోగులు అన్ని విషయాలలో రాణిస్తారు. వ్యాపారులకు అనుకూల సమయం.

మకరం:
బంధువులతో జాగ్రత్తగా ఉండాలి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. వీటి నియంత్రణ కోసం ప్రణాళికలు వేయాలి. వివాదాలకు దూరంగా ఉండడమే మంచిది.

కుంభం:
తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. శుభకార్యం గురించి చర్చిస్తారు. కొత్త పెట్టుబడులు మనస్పూర్తిగా పెట్టాలి.

మీనం:
ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పెండింగు పనులను పూర్తి చేస్తారు. వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
RELATED ARTICLES

Most Popular