ఆంధ్రప్రదేశ్ లో గత కొన్ని రోజులుగా ఏపీ రాజధాని మార్పుపై అమరావతి రైతులు తీవ్ర ఆందోళనలు చేస్తున్నారు. అయితే రాజధాని మార్చడం వెనుక గల కారణాలను పరిశీలించినట్లయితే సీఎం జగన్ అధికారంలోకి రాకముందు నుంచే ఈ రాజధాని మార్పు ఆలోచన ఉందని,అందుకే జగన్ తమ పార్టీ అంతర్గత సమావేశంలో లో “మన ప్లేట్లో మన బిర్యాని తిందాం” అంటూ ఎన్నికలకు రెండు సంవత్సరాల ముందే ప్రకటించారు,అందులో భాగంగానే ఎన్నికలకు ఏడాది ముందు నుంచే భూములు కొనుగోలు చేశాం అని విశాఖ ఎంపి సత్యనారాయణ ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు.
అయితే తెరవెనుక విశాఖ లో భారీ భూములు కొనుగోలు చేసి ఇన్సైడ్ ట్రేడింగ్ లో భాగంగా భోగాపురం ఎయిర్పోర్ట్ వద్ద విజయ్ సాయి రెడ్డి వేల ఎకరాలు కొన్నారని ప్రచారం జరుగుతోంది.. దానికి తగ్గట్టుగానే ఆయన ఏపీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విషయాన్ని సీఎం జగన్ కంటే ముందే ప్రకటించారు. “పరిపాలన వికేంద్రీకరణ” అంటున్నా తెరవెనుక ఇలాంటి ఇన్సైడర్ ట్రేడింగ్ నడుస్తున్నట్లు తెలుస్తుంది.
ఏది ఏమైనప్పటికీ పరిపాలన వికేంద్రీకరనో లేక స్వార్థ రాజకీయాల వల్లనో ప్రజలు మోసపోతూనే ఉన్నారు. రాజధాని వస్తే తమ బ్రతుకులు మారతాయని సాగు చేసి పండించుకునే భూమిని, పచ్చటి పొలాలను రాజధాని కోసం గత ప్రభుత్వానికి ఇస్తే, ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం “పరిపాలన వికేంద్రీకరణ” అంటూ రాజధానిని మారుస్తూ, “మీ భూములు తిరిగి ఇచ్చేస్తాం..” అంటూ.. ఉదరగొట్టే మాటలు మాట్లాడటం ఎంతవరకు సబబో వైసీపీ నేతలకే తెలియాలి..