spot_img
Homeవింతలు-విశేషాలుMost Expensive Teas: నిలోఫర్ టీ కే గుండెలు బాదుకుంటున్నాం..ఈ చాయ్ లు తాగాలంటే ఆస్తులు...

Most Expensive Teas: నిలోఫర్ టీ కే గుండెలు బాదుకుంటున్నాం..ఈ చాయ్ లు తాగాలంటే ఆస్తులు అమ్ముకోవాలి..

Most Expensive Teas: హైదరాబాద్ నగరంలో అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఇటీవల నీలోఫర్ కేఫ్ ఏర్పాటయింది. అక్కడ లగ్జరీ పీపుల్ తాగే టీ ధర ₹1000. దీనికి పన్నులు అదనం. వాస్తవానికి నిలోఫర్ టీ నే చాలామంది అత్యంత ఖరీదు అనుకుంటారు. మస్కా బన్ కూడా అత్యంత కాస్ట్లీ అనుకుంటారు. కానీ వీటికి మించిన ఖరీదైన చాయ్ లు ఈ ప్రపంచంలో చాలా ఉన్నాయి. ఇంతకీ అవి ఏంటో ఒకసారి తెలుసుకుందామా..

డా హాంగ్ పావో
ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చాయ్.. దీని తయారీకి ఉపయోగించే పౌడర్ కిలో ధర దాదాపుగా 10,57,80,000 ఉంటుంది. దీనికి ఈ స్థాయిలో ధర ఉండడానికి ప్రధాన కారణం.. టీ పౌడర్ ను తయారు చేయడానికి ఉపయోగించే చెట్లు 350 సంవత్సరాలు కంటే ఎక్కువ పురాతనమైనవి. ఇచ్చట్లు పొగ మంచుతో కూడిన వాతావరణం లో ఉంటాయి. కొండ ప్రాంతంలో ఎక్కువగా పెరుగుతుంటాయి.. యాన్ యున్ అనే ప్రత్యేకమైన రుచి ఈ చెట్ల వల్ల వస్తుందట. పైగా మింగ్ అనే రాజవంశం ఈ టీని విపరీతంగా తాగేవారట. చైనా దేశంలో ఈ టీ పౌడర్ తయారు చేసే చెట్లను జాగ్రత్తగా చూసుకుంటారట.

పాండా డంగ్ టీ
పేరులోనే పాండాల వ్యర్ధాలు ఉన్నాయి. ఈపాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది.. ఈ చాయ్ ఎలా తయారు చేస్తారోనని.. పాండాల వ్యర్ధాలను సహజ ఎరువుగా మార్చి ఈ చెట్లను పెంచుతారు. పాండాలు కేవలం ఎదురు మాత్రమే తింటాయి కాబట్టి.. వాటి ఎరువులో రెట్టింపైన పోషకాలు ఉంటాయి. వాటి ఎరువును వేయడం వల్ల ఈ మొక్కలు బలంగా పెరుగుతుంటాయి. అందువల్లే ఈ టీ ని అత్యంత ఖరీదైనదిగా పేర్కొంటారు. బహిరంగ మార్కెట్లో కిలో టీ పౌడర్ ధర 61,70,500 వరకు ఉంటుంది.

డైమండ్ టీ బ్యాగ్
పేరులో ఉన్నట్టుగానే ఈ టీ బ్యాగ్ ను 2.56 క్యారెట్ల వజ్రాలతో అలంకరిస్తారు. ఆ బ్యాగు లోపల బంగారపు గొలుసు ఉంటుంది. దాంతోపాటు సిల్వర్ టిప్ టి ఆకులు ఉంటాయి.. ఒక్క టీ బ్యాగు ధర 13,22,250 వరకు ఉంటుంది.

నార్సిసస్ ఊలాంగ్
ఇది చైనాలో తయారయ్యే టీ పౌడర్. దీని ధర కిలో 6,31,643 ఉంటుంది.. గ్రీకు పురాణాల్లో నార్సిపస్ అనే పేరును దీనికి పెట్టారు. ఈ టీ పౌడర్ చాలా కాలం పాటు నిల్వ ఉంటుంది. చాయ్ కి గొప్ప రుచి అందిస్తుంది. దీని బలమైన సువాసన ఇట్టే ఆకట్టుకుంటుంది.

టైగ్వానిన్
చైనాలో తయారుచేసే ఈ టీ పౌడర్ కిలో ధర 2,91,489 వరకు ఉంటుంది. ఈ తేయాకు మొక్కలను 1800 సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారు. ఈ మొక్కలను కరుణామయి అయిన దేవత అని పిలుస్తుంటారు. ఆకులు సేకరించడం.. వాటిని ఎండబెట్టడం.. శుద్ధి చేయడం.. ఈ ప్రక్రియలు అత్యంత కఠినమైనవి. అందువల్లే ఈ టీ పౌడర్ అత్యంత విలువైనదిగా పేరుపొందింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

India vs Zimbabwe : ఆరు ఓటముల తర్వాత.. అయ్యర్ పొలంలో మొలకలు.. కానీ ఇది సరిపోదు..

India vs Zimbabwe : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలోను వైట్ వాష్.. బ్యాటింగ్ బలంగా లేదు. బౌలింగ్ గొప్పగా లేదు.. ఫీల్డింగ్ చెప్పుకొనే స్థాయిలో లేదు. ఆటగాళ్లు ఏమైనా...

Dharmendra Pradhan : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. నరేంద్ర మోడీ తదుపరి ఏం చేయబోతున్నారు..

Dharmendra Pradhan : సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రధాన్ రాజీనామా చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనలకు తలవంచి.. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ప్రధానమంత్రి నరేంద్ర...

Narendra Modi : కొత్త విద్యాశాఖ మంత్రి ఇతనే అనూహ్యంగా మోడీ మనస్సు ఇతడి మీదికే ఎందుకంటే..

Narendra Modi : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కొత్త విద్యాశాఖ మంత్రి ఎవరు అనే చర్చ మొదలైంది. వాస్తవానికి ధర్మేంద్ర రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న తర్వాత.. నరేంద్ర మోడీ వెంటనే...

Donald Trump : ఈయూ జరిమానాలపై కన్నెర్రజేసిన ట్రంప్‌.. అమెరికా కంపెనీల రక్షణకు చర్యలు!

Donald Trump : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఏడాది కాలంపాటు అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని తరలించడం, అమెరికా వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సరుకులపై...

Harish Rao : బిజెపిలోకి హరీష్ రావు.. కేటీఆర్ ఏమన్నారంటే..

Harish Rao : తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏదో ఒక సందర్భంలో మీడియాలో బలంగా ప్రచారానికి.. నాయకుల మధ్య చర్చకు కారణమయ్యే అంశం ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీలో హరీష్...
Oktelugu Epaper
Exit mobile version