Homeప్రవాస భారతీయులుUS Green Card New Rules: గ్రీన్ కార్డ్ షాక్.. అమెరికాలో ఉన్న వాళ్లు తట్టాబుట్టా...

US Green Card New Rules: గ్రీన్ కార్డ్ షాక్.. అమెరికాలో ఉన్న వాళ్లు తట్టాబుట్టా సర్దుకొని రావాల్సిందే..

US Green Card New Rules: అమెరికాలో వలసదారలపై మరో నిబంధన తీసుకొచ్చింది. ఇప్పటికే శాశ్వత వీసాపై పలు నిర్ణయాలు తీసకున్న ఇక్కడి ప్రభుత్వం తాజాగా కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఇక నుంచి శాశ్వత నివాస హక్కు (గ్రీన్ కార్డు) పొందాలంటే సొంత దేశానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. ఈ కొత్త నిబంధనల ద్వారా అమెరికాలో ఉంటున్న వలదారులు.. ముఖ్యంగా భారతీయులపై తీవ్రప్రభావం పడే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఈ విషయంలో కొందరికి మినహాయింపు ఉంటుంది. ఆ వివరాల్లోకి వెళితె..

అమెరికా వలస విధానాల్లో తాగాగా మార్పులు తీసుకొచ్చారు. ఇందులో భాగంగా ఈ దేశంలో తాత్కాలికంగా ఉంటున్న విదేశీయులు గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలంటే, ఇకపై తప్పనిసరిగా తమ మాతృదేశానికి వెళ్లాలని అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ (USCIS) స్పష్టం చేసింది. ఈ మేరకు సంస్థ ప్రతినిధి జాక్ కహ్లర్ కొత్త పాలసీ మెమోను విడుదల చేశారు. అమెరికా వలస చట్టాల అసలు ఉద్దేశాన్ని కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తేల్చి చెప్పారు. దీంతో విజిట్ వీసా లేదా తాత్కాలిక వీసాపై ఉంటూ గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేవారిలో ఆందోళన మొదలైంది.

అయితే ఈ నిబంధనల్లో కొందరికి మినహాయింపు ఉంటుందని తెలపింది. కొన్ని ప్రత్యేక, అసాధారణ పరిస్థితుల్లో ‘అడ్జస్ట్‌మెంట్ ఆఫ్ స్టేటస్’ ద్వారా అమెరికా నుంచే గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. అటువంటి మినహాయింపు కోరే వారి దరఖాస్తులను అధికారులు అత్యంత క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఎవరైనా గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకుని అది తిరస్కరణకు గురైతే, వారు అమెరికాలో అక్రమంగా ఉండకుండా చూసేందుకు ఈ కొత్త నిబంధనలు దోహదపడతాయని అధికారులు భావిస్తున్నారు.

వలస వ్యవస్థను దుర్వినియోగం కాకుండా చూడటమే ఈ విధానం ప్రధాన ఉద్దేశమని జాక్ కహ్లర్ వివరించారు. ముఖ్యంగా విద్యార్థులు, తాత్కాలిక కార్మికులు, టూరిస్టు వీసాపై వచ్చిన వారు తమ పని పూర్తికాగానే దేశాన్ని వీడి వెళ్లాలని, గ్రీన్‌కార్డు హోదా పొందేందుకు అమెరికాకు రావడం ఒక మెట్టుగా మారకూడదని ఆయన స్పష్టం చేశారు. ఈ విధానం వల్ల వలసల ప్రక్రియ మరింత క్రమబద్ధీకరించబడుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

యూఎస్‌సీఐఎస్‌ చేపట్టిన కఠిన చర్యల ఫలితంగా ఇప్పటికే తీవ్ర ప్రభావం చూపింది. 2027 ఆర్థిక సంవత్సరంలో హెచ్-1బీ వీసా దరఖాస్తుల సంఖ్య ఏకంగా 38.5 శాతం పడిపోయింది. వీసాల ఆమోదంలో కూడా సంస్థ తన పద్ధతిని మార్చుకుంది. కేవలం ఉన్నత డిగ్రీలు, అధిక వేతనాలు పొందుతున్న నైపుణ్యం కలిగిన అభ్యర్థులకే పెద్దపీట వేస్తున్నట్లు యూఎస్‌సీఐఎస్‌ పేర్కొంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version