భారత్, ఇంగ్లాండ్ మూడో టెస్టుకు ముందు ఓ సంచలన విషయం తెలిసింది. దూకుడుగా ఉండే విరాట్ కోహ్లీ, ప్రశాంతంగా కనిపించే జో రూట్ తీవ్ర వాగ్వివాదానికి పాల్పడ్డారని సమాచారం. రెండో టెస్టులో విజయం సాధించిన వెంటనే ఈ ఘటన చోటు చేసుకుందని అంటున్నారు. అంతేకాదు రెండు జట్ల ఆటగాళ్లు గుంపులు గుంపులుగా చేరి ఒకర్నొకరు దూషించుకున్నారని తెలుస్తోంది.