
ఐసీయూలో చికిత్స పొందుతున్న ఓ యువతిపై అత్యాచారం చేసిన ఘటన హర్యానాలో చోటు చేసుకుంది. గురుగ్రామ్లోని మహేంద్రనగర్కు చెందిన ఓ యువతి టీబీ వ్యాధితో బాధపడుతూ చికిత్స కోసం ఓ ప్రైవేట్ఆసుపత్రిలో చేరింది. అయితే వెంటిలేటర్పై ఉన్న ఆమెపై హత్య చేసినట్లు యువతి తన తండ్రికి పేపర్పై రాసి తెలిపింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు అందడంతో సుశాంత్ లోక్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. నిందితుడిని గుర్తించినట్లు ఏసీపీ పేర్కొన్నారు.కాగా ఈ కేసులో పోలీసులకు సహకరిస్తామని ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది.